News May 25, 2024
ప్రతిపక్షాలు నా శత్రువులు కాదు: మోదీ

ప్రతిపక్ష నేతలను శత్రువులుగా భావించబోనని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. వారితో కలిసి పని చేయాలని భావిస్తానన్నారు. వారిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయబోనని, వాళ్లు దాదాపు 70ఏళ్లు ఏ దేశాన్ని పాలించారని అన్నారు. వాళ్ల నుంచి మంచి గ్రహించేందుకు ప్రయత్నిస్తానని మోదీ అన్నారు. NDTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ.. తనపై ప్రతిపక్షాల దాడులు, డెవలప్మెంట్ ఫిలాసఫీ, ప్రస్తుత లోక్సభ ఎన్నికలు వంటి అంశాలపై మాట్లాడారు.
Similar News
News November 18, 2025
CNG సరఫరా నిలిచి ముంబైలో స్తంభించిన రవాణా

ముంబైలో 2 రోజులుగా CNG సరఫరా నిలిచి ప్రైవేట్, పబ్లిక్ రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. పైప్ లైన్లో సమస్యతో నగరంలోని 486 రీఫిల్లింగ్ స్టేషన్లలో ఆదివారం నుంచి గ్యాస్ సరఫరా నిలిచింది. CNGతో నడిచే ఆటోలు, కార్లు, బస్సులు తిరగక అవస్థలు తప్పలేదు. సోమవారం నాటికి కొంతమేర సరఫరా చేపట్టారు. నేటి మధ్యాహ్నానికి కానీ పూర్తి సరఫరా కాదని కంపెనీలు పేర్కొన్నాయి. కాగా ముంబైలో CNGతో నడిచే కార్లే 5 లక్షల వరకు ఉన్నాయి.
News November 18, 2025
CNG సరఫరా నిలిచి ముంబైలో స్తంభించిన రవాణా

ముంబైలో 2 రోజులుగా CNG సరఫరా నిలిచి ప్రైవేట్, పబ్లిక్ రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. పైప్ లైన్లో సమస్యతో నగరంలోని 486 రీఫిల్లింగ్ స్టేషన్లలో ఆదివారం నుంచి గ్యాస్ సరఫరా నిలిచింది. CNGతో నడిచే ఆటోలు, కార్లు, బస్సులు తిరగక అవస్థలు తప్పలేదు. సోమవారం నాటికి కొంతమేర సరఫరా చేపట్టారు. నేటి మధ్యాహ్నానికి కానీ పూర్తి సరఫరా కాదని కంపెనీలు పేర్కొన్నాయి. కాగా ముంబైలో CNGతో నడిచే కార్లే 5 లక్షల వరకు ఉన్నాయి.
News November 18, 2025
మావోలకు మరో 4 నెలలే గడువు: బండి

TG: అర్బన్ నక్సల్స్ మాటలు నమ్మి మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. హిడ్మా హతం సందర్భంగా ఆయన వేములవాడలో మీడియాతో మాట్లాడారు. వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేస్తామని, మరో 4 నెలలే ఉన్నందున నక్సల్స్ లొంగిపోవాలని పిలుపునిచ్చారు. బుల్లెట్ను కాకుండా బ్యాలెట్ను నమ్ముకోవాలని సూచించారు. కేవలం పోలీసులు, సైనికుల చేతుల్లోనే తుపాకులు ఉండాలన్నారు.


