News May 25, 2024
ప్రతిపక్షాలు నా శత్రువులు కాదు: మోదీ

ప్రతిపక్ష నేతలను శత్రువులుగా భావించబోనని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. వారితో కలిసి పని చేయాలని భావిస్తానన్నారు. వారిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయబోనని, వాళ్లు దాదాపు 70ఏళ్లు ఏ దేశాన్ని పాలించారని అన్నారు. వాళ్ల నుంచి మంచి గ్రహించేందుకు ప్రయత్నిస్తానని మోదీ అన్నారు. NDTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ.. తనపై ప్రతిపక్షాల దాడులు, డెవలప్మెంట్ ఫిలాసఫీ, ప్రస్తుత లోక్సభ ఎన్నికలు వంటి అంశాలపై మాట్లాడారు.
Similar News
News March 9, 2026
విజయ్కి మరోసారి సీబీఐ నోటీసులు

కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే చీఫ్ విజయ్కి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఢిల్లీలోని తమ కార్యాలయంలో రేపు విచారణకు హాజరుకావాలని పేర్కొంది. గతేడాది సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాటలో 41 మంది చనిపోగా 60 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జనవరి 12, 19వ తేదీల్లో సీబీఐ ఆయనను విచారించింది.
News March 9, 2026
‘జీ రామ్ జీ’కి లోగో డిజైన్ చేస్తే ₹50వేలు!

మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన ‘వీబీ జీ రామ్ జీ’ స్కీమ్ లోగో డిజైన్పై కేంద్రం పోటీని నిర్వహిస్తోంది. లోగో డిజైనింగ్లో విజేతగా నిలిచిన వారికి ₹50వేలు బహుమతిగా ఇవ్వనుంది. ఈ కంటెస్ట్లో పాల్గొనాలని అనుకునేవారు <
News March 9, 2026
ఆస్తుల్లో ప్రశాంతిరెడ్డి టాప్

దేశవ్యాప్తంగా ఉన్న <<19333433>>మహిళా ప్రజాప్రతినిధుల్లో<<>> 14 మంది బిలియనీర్లు ఉన్నట్లు ADR వెల్లడించింది. వీరి మొత్తం ఆస్తి విలువ రూ.8,234 కోట్లని తెలిపింది. ఏపీకి చెందిన కోవూరు TDP MLA వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రూ.716 కోట్లతో టాప్లో ఉన్నారు. APలోని 24 మహిళా ప్రజాప్రతినిధుల సగటు ఆస్తి రూ.74 కోట్లు, TGలోని 11 మంది నాయకురాళ్ల సగటు ఆస్తి రూ.14 కోట్లుగా పేర్కొంది.


