News April 25, 2024
IAS గిరీశాపై విచారణకు ఆదేశం
AP: తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అవకతవకల ఘటనలో సస్పెన్షన్కు గురై, మళ్లీ విధుల్లో చేరిన IAS గిరీశాపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విద్యాశాఖ కమిషనర్ సురేశ్ను విచారణ అధికారిగా నియమించింది. 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. తిరుపతి మున్సిపల్ కమిషనర్గా ఉన్న గిరీశా లాగిన్ ఐడీతో 35వేల ఓటర్ ఐడీ కార్డులు డౌన్లోడ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో EC ఆయన్ను జనవరిలో సస్పెండ్ చేసింది.
Similar News
News January 14, 2025
APPLY NOW: భారీ జీతంతో 608 ఉద్యోగాలు
ESICలో 608 ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2 ఉద్యోగాలకు ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. MBBS పూర్తి చేసి, యూపీఎస్సీ నిర్వహించిన CMSE-2022&2023 ఉత్తీర్ణులైన వారు అర్హులు. వయసు 35 ఏళ్లు మించరాదు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు. ఎంపికైన వారికి రూ.56,100-రూ.1,77,500 జీతం ఉంటుంది. పూర్తి వివరాలకు <
News January 14, 2025
రెండు రాష్ట్రాలకు రేపు ‘కల్లక్కడల్’ ముప్పు: INCOIS
కేరళ, తమిళనాడు తీరాలకు కల్లక్కడల్(సముద్రంలో ఆకస్మిక మార్పులు) ముప్పు పొంచి ఉందని కేంద్ర సంస్థ INCOIS హెచ్చరించింది. హిందూ మహా సముద్రంలో బలమైన గాలుల కారణంగా రేపు రా.11.30 వరకు అలలు 1 మీటర్ వరకు ఎగిసి పడతాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంది. దీంతో రెండు రాష్ట్రాల అధికారులు చర్యలు చేపట్టారు. తీరప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని, పర్యాటకులు బీచ్లకు వెళ్లొద్దని సూచించింది.
News January 14, 2025
GOOD NEWS: సైనిక్ స్కూళ్లు.. దరఖాస్తు గడువు పొడిగింపు
దేశవ్యాప్తంగా సైనిక్ స్కూళ్లలో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు నిన్నటితో ముగియగా NTA మరో అవకాశం ఇచ్చింది. ఈ నెల 23 వరకు గడువును పొడిగించింది. ఆరో క్లాస్కు అభ్యర్థుల వయసు మార్చి 31, 2025 నాటికి 10-12ఏళ్లు, 9వ క్లాస్కు 13-15ఏళ్లు ఉండాలి. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో ఎగ్జామ్ ఉంటుంది. పూర్తి వివరాల కోసం <