News November 15, 2024

OTD: సచిన్ అరంగేట్రానికి సరిగ్గా 35 ఏళ్లు

image

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ అరంగేట్రం చేసి నేటికి సరిగ్గా 35 ఏళ్లు అవుతోంది. 1989 నవంబర్ 15న పాకిస్థాన్‌పై 16 ఏళ్ల వయసులోనే ఎంట్రీ ఇచ్చారు. తొలి మ్యాచ్‌లో డకౌటైనా ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. 200కుపైగా టెస్టులు, 400కుపైగా వన్డేలు ఆడి శత శతకాలు బాదారు. ఎవరికీ సాధ్యం కాని రీతిలో అంతర్జాతీయ క్రికెట్‌లో 34,357 పరుగులు చేశారు. 2013లో ఇదే తేదీన చివరిసారిగా బ్యాటింగ్‌కు దిగారు.

Similar News

News November 21, 2025

జొమాటో, స్విగ్గీ కస్టమర్లకు షాక్!

image

తమ కస్టమర్ల డేటాను లక్షలాది రెస్టారెంట్లతో పంచుకోవాలని జొమాటో, స్విగ్గీలు నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే జొమాటో పైలట్ ప్రాజెక్టు కింద ‘పర్మిషన్’ పాప్ అప్ మెసేజ్‌లను పంపుతోంది. దానిపై క్లిక్ చేస్తే మీ డేటా రెస్టారెంట్లకు చేరుతుంది. త్వరలో ఆటోమేటిక్‌ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఇకపై అన్‌వాంటెడ్ మెసేజ్‌లు ఇన్‌బాక్స్‌లను ముంచెత్తనున్నాయి. అలాగే డేటా గోప్యతకు భంగం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు.

News November 21, 2025

FEB 15న భారత్-పాకిస్థాన్ మ్యాచ్?

image

వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌లో మరోసారి భారత్-పాక్ తలపడే అవకాశం ఉంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరిగే అవకాశం ఉందని క్రీడా వర్గాలు తెలిపాయి. IND సెమీస్‌కు క్వాలిఫై అయితే వాంఖడేలో మార్చి 5న ప్రత్యర్థితో మ్యాచ్ ఆడనుందని పేర్కొన్నాయి. అలాగే FEB 7న టోర్నీ ప్రారంభమై అహ్మదాబాద్‌లో మార్చి 8న ఫైనల్‌తో ముగుస్తుందని వెల్లడించాయి. ఇటీవల T20IWC <<18244536>>వేదికలను<<>> ఖరారు చేసిన విషయం తెలిసిందే.

News November 21, 2025

25న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. ఎన్నికలే అజెండా!

image

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ ఈ నెల 25న భేటీ కానుంది. పంచాయతీ ఎన్నికలే అజెండాగా మంత్రివర్గం సమావేశం కానున్నట్లు సమాచారం. ఎలక్షన్స్ నోటిఫికేషన్, పోలింగ్ తేదీలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా వచ్చే నెల 11, 14, 17 తేదీల్లో నిర్వహించాలని ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. మొదట సర్పంచ్, తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ జరగనున్నాయి.