News March 29, 2025
OUలో రివాల్యుయేషన్కు అవకాశం

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఏ లాంగ్వేజెస్ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్కు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. బీఏ లాంగ్వేజెస్ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని చెప్పారు. ఈ రివాల్యుయేషన్కు ఒక్కో పేపరుకు రూ.500 చొప్పున చెల్లించి వచ్చే నెల 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News March 31, 2025
200 సిక్సర్లు.. ధోనీ అరుదైన రికార్డు

CSK ప్లేయర్ ధోనీ అరుదైన రికార్డు నెలకొల్పారు. 30 ఏళ్ల వయసు దాటాక ఐపీఎల్లో 200 సిక్సులు బాదిన తొలి ఇండియన్ ప్లేయర్గా నిలిచారు. ప్రస్తుతం 43వ వడిలో ఉన్న మిస్టర్ కూల్ నిన్న RRతో మ్యాచ్లో తుషార్ వేసిన 19వ ఓవర్లో సిక్స్ కొట్టడం ద్వారా ఈ ఘనత సాధించారు. ఓవరాల్గా క్రిస్గేల్(347) ఎవరికీ అందనంత దూరంలో ఉన్నారు. ఇక ధోనీ తర్వాత రోహిత్(113), అంబటి రాయుడు(109), దినేశ్ కార్తీక్(104) ఉన్నారు.
News March 31, 2025
నాగర్కర్నూల్: ఢిల్లీకి బయలుదేరిన కల్వకుర్తి నాయకులు

స్థానిక సంస్థల్లో, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఉద్దేశంతో ఈరోజు హైదరాబాద్లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి వేలాది మంది బీసీ నాయకులు ప్రత్యేక రైల్లో ఢిల్లీకి బయలుదేరారు. ఏప్రిల్ 2న జంతర్ మంతర్ వద్ద జరిగే బీసీల పోరు గర్జన సభను విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేశ్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. కల్వకుర్తి నుంచి నాయకులు వెళ్లారు.
News March 31, 2025
ప్రతిదాడి తప్పదు.. USకు ఇరాన్ వార్నింగ్

న్యూక్లియర్ ఒప్పందానికి అంగీకరించకుంటే <<15942110>>దాడులు చేస్తామన్న<<>> US అధ్యక్షుడు ట్రంప్కు ఇరాన్ అదే స్థాయిలో వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ అమెరికా అన్నంత పనిచేస్తే తాము ఎదురుదాడులు చేస్తామని సుప్రీం లీడర్ అయతుల్లా తేల్చిచెప్పారు. కాగా ప్రస్తుతం ఆ దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో క్షిపణులను లాంచ్ప్యాడ్లపై సిద్ధంగా ఉంచినట్లు అంతర్జాతీయ కథనాలు చెబుతున్నాయి. అగ్రరాజ్యంపై దాడులకు సిద్ధంగా ఉంచినట్లు పేర్కొంటున్నాయి.