News December 6, 2024
రేపు వచ్చేది మా ప్రభుత్వమే.. ఊరుకోం: పల్లా

TG: అక్రమ అరెస్టులకు భయపడేది లేదని BRS నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ‘పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ తీరు సరిగా లేదని మా మాజీ మంత్రులు, నేతలు ఆయన్ను కలవడానికి వెళ్లాం. చట్టాలు ఉల్లంఘించి మమ్మల్ని అరెస్ట్ చేసి అనేక స్టేషన్లు తిప్పారు. రేపు వచ్చే ప్రభుత్వం మాదే. మీ అక్రమాలు సహించం’ అని పల్లా అన్నారు. నార్సింగి PS వద్దకు భారీగా BRS శ్రేణులు చేరుకోగా, అర్ధరాత్రి పల్లాను పోలీసులు విడుదల చేశారు.
Similar News
News February 15, 2026
పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్

T20WC: ICC ఈవెంట్లలో పాక్పై భారత్ జైత్రయాత్రను కొనసాగించింది. ఫార్మాట్ ఏదైనా, ప్లేస్ మారినా ఫలితం మారదని నిరూపించింది. కొలంబోలో జరిగిన మ్యాచ్లో దాయాదిని 61 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాక్ను 18 ఓవర్లలో 114 రన్స్కే కట్టడి చేసింది. బుమ్రా, అక్షర్, వరుణ్, హార్దిక్ తలో 2 వికెట్లు, కుల్దీప్, తిలక్ చెరో వికెట్ తీశారు. వరుసగా 3 విజయాలతో IND సూపర్-8కి చేరుకుంది.
News February 15, 2026
38 దేశాలతో ట్రేడ్ డీల్స్.. MSMEల మార్కెట్ విస్తరించింది: మోదీ

దేశంలో రాజకీయ స్థిరత్వం పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచిందని PM మోదీ చెప్పారు. కొన్నేళ్లుగా 38 దేశాలతో 9 ట్రేడ్ డీల్స్ చేసుకున్నట్లు తెలిపారు. టెక్స్టైల్స్, లెదర్, కెమికల్స్, హ్యాండ్క్రాఫ్ట్స్, జువెల్లరీ వంటి రంగాల్లో MSMEల మార్కెట్ విస్తరించిందన్నారు. ఎగుమతిదారులకు కొత్త అవకాశాలు తెరుచుకున్నాయని పేర్కొన్నారు. UPA హయాంలో ఆర్థిక నిర్వహణ సరిగ్గా లేక ఏ దేశంతోనూ చర్చించలేకపోయిందని విమర్శించారు.
News February 15, 2026
శివుడు తనలో సగ భాగాన్ని పార్వతికి ఎందుకు ఇచ్చాడు?

పార్వతీదేవి శివునిపై అచంచలమైన భక్తితో కఠోర తపస్సు చేసింది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు, ఆమెను తనలో భాగంగా చేసుకున్నాడు. దీనివల్ల లోకానికి పురుషుడు (శివుడు – చైతన్యం), స్త్రీ (పార్వతి – శక్తి) వేర్వేరు కాదని ఈ రెండింటి కలయికతోనే సృష్టి నడుస్తుందని నిరూపించారు. ఇద్దరూ సమానమేనని, ఒకరు లేనిదే మరొకరు సంపూర్ణులు కారని ఈ రూపం చెబుతుంది. భక్తుడు భగవంతుడిలో లీనమవ్వడాన్ని కూడా ఇది సూచిస్తుంది.


