News April 6, 2024
మాది మిషన్.. విపక్షాలది కమీషన్: మోదీ
ఇండియా కూటమి కమీషన్ల కోసమే అధికారం కోరుకుంటోందని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ఓ మిషన్ కోసం పనిచేస్తోందని చెప్పారు. యూపీలోని షహరాన్పూర్లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టోపై విమర్శలు గుప్పించారు. ముస్లిం లీగ్, వామపక్ష భావజాలం కలిగిన వారి ముద్ర మేనిఫెస్టోలో కనిపిస్తోందన్నారు. అనిశ్చితి, అస్థిరతకు పర్యాయపదంగా ఇండియా కూటమి తయారైందని ఎద్దేవా చేశారు.
Similar News
News January 17, 2025
తెలంగాణకు 2,800 బస్సులు కేటాయించండి: సీఎం రేవంత్
TG: కాలుష్య నివారణకు HYD మహానగరంలో వంద శాతం బస్సులను ఎలక్ట్రిక్ మోడల్లోకి మార్చేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి కుమారస్వామిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ కిట్ అమర్చి రిట్రో ఫిట్మెంట్ పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే విషయాన్ని కుమారస్వామి దృష్టికి తీసుకెళ్లారు. నగరానికి కేటాయించే 2,800 బస్సులను జీసీసీతో పాటు రిట్రో ఫిట్మెంట్ కింద కేటాయించాలని కోరారు.
News January 17, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News January 17, 2025
భక్తులకు టీటీడీ కీలక సూచనలు
AP: నేటితో వైకుంఠద్వార దర్శన టోకెన్ల జారీ ముగియనుందని భక్తులకు టీటీడీ సూచించింది. ఈ నెల 19తో వైకుంఠద్వార దర్శనం ముగుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ నెల 20న దర్శనం చేసుకునే భక్తులను సర్వదర్శనం క్యూలైన్లో మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. ఈ నెల 20న ప్రోటోకాల్ భక్తులను మినహాయించి వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసింది. వీటిని దృష్టిలో పెట్టుకుని భక్తులు సహకరించాలని అధికారులు కోరారు.