News September 24, 2024

మా యుద్ధం హెజ్‌బొల్లాతోనే.. మీతో కాదు: నెతన్యాహు

image

తమ యుద్ధం హెజ్‌బొల్లాతోనేనని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. హెజ్‌బొల్లాకు లెబనాన్ పౌరులు మానవ కవచాలుగా మారొద్దని సూచించారు. ‘కొన్నేళ్లుగా హెజ్‌బొల్లా మీ ఇళ్లలో రాకెట్లు, క్షిపణులు దాచిపెడుతోంది. వీటితో మా దేశ ప్రజలపైకి దాడులకు పాల్పడుతోంది. మా ప్రజలను రక్షించుకోవడం కోసం దాడులు చేయక తప్పడం లేదు. యుద్ధం ముగిసేవరకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలు దక్కించుకోండి’ అని ఆయన విజ్ఞప్తి చేశారు.

Similar News

News December 16, 2025

దేశంలోనే తొలి AAD ఎడ్యుసిటీ.. ప్రారంభించనున్న లోకేశ్

image

AP: దేశంలోనే తొలి ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్(AAD) ఎడ్యుకేషన్ సిటీ విజయనగరం జిల్లా భోగాపురంలో ఏర్పాటు కానుంది. ఆయా రంగాల్లో వేలాది మంది నిపుణులను తయారుచేసేందుకు 160 ఎకరాల్లో జీఎంఆర్-మాన్సాస్ దీన్ని నిర్మించనున్నాయి. ఈ ప్రాజెక్టును మంత్రి లోకేశ్ ఇవాళ విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్టులో ప్రారంభించనున్నారు. ఈ కేంద్రంలో అంతర్జాతీయంగా పేరొందిన యూనివర్సిటీల బ్రాంచ్ క్యాంపస్‌లు ఏర్పాటు కానున్నాయి.

News December 16, 2025

పిల్లల ముందు గొడవ పడితే..

image

ప్రస్తుతకాలంలో ఉమ్మడి కుటుంబాలు తగ్గి చిన్న కుటుంబాలు పెరిగాయి. దీంతో పిల్లలపై ఇంట్లో వాతావరణం తీవ్రప్రభావం చూపుతోంది. ముఖ్యంగా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, కలహాలు, అక్రమ సంబంధాలు ఉంటే పిల్లలు మానసిక ఆందోళన, ఒత్తిడికి గురవుతారని ఆస్ట్రేలియాలో చేసిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇవి వారి జీవన నైపుణ్యాలను దెబ్బతీయడంతో పాటు ఎదిగే వయసులో తప్పటడుగులు వేసేందుకు కారణమవుతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.

News December 16, 2025

‘నేను చనిపోతే నా ఫ్యామిలీని చూసుకో’

image

ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో కాల్పులు జరుపుతున్న టెర్రరిస్టులను ధైర్యంగా <<18564673>>అడ్డుకున్న<<>> అహ్మద్ ప్రస్తుతం బుల్లెట్ గాయాల నుంచి కోలుకుంటున్నారు. ఆ రోజు జరిగిన సంఘటనను అతని బంధువు ముస్తఫా మీడియాకు వెల్లడించారు. ‘నేను ఉగ్రవాదిని అడ్డుకోవడానికి వెళ్తున్నా. నేను చనిపోతే నా ఫ్యామిలీని చూసుకో’ అని చెప్పి అహ్మద్ వెళ్లాడని తెలిపారు. తన కొడుకు నిజమైన హీరో అని, అతనిని చూసి గర్విస్తున్నట్లు తండ్రి చెప్పారు.