News June 12, 2024

ఎన్నికల వేళ హెలికాప్టర్లతో 1000 గంటలకుపైగా సేవలు: వాయుసేన

image

సార్వత్రిక ఎన్నికల సమయంలో తమ హెలికాప్టర్లతో దేశవ్యాప్తంగా 1750 ప్రదేశాల్లో 1000 గంటలకు పైగా సేవలందించామని వాయుసేన వెల్లడించింది. ఈ సేవలకు తేలికపాటి చేతక్, ALH ధ్రువ్, ఎంఐ-17 మీడియం లిఫ్ట్ హెలికాప్టర్లను విస్తృతంగా ఉపయోగించినట్లు పేర్కొంది. పోలింగ్‌కు ముందు మారుమూల ప్రాంతాలకు ఎన్నికల సిబ్బంది, సామగ్రిని తరలించడం, తిరిగి తీసుకురావడం సవాలుతో కూడుకున్నదని తెలిపింది.

Similar News

News March 24, 2025

సీఎం పుట్టినరోజున ‘చంద్రన్న నాటకోత్సవాలు’

image

AP: వచ్చే నెల 20న సీఎం చంద్రబాబు పుట్టినరోజు పురస్కరించుకొని వారం పాటు ‘చంద్రన్న నాటకోత్సవాలు’ నిర్వహించనున్నట్లు ఏపీ నాటక అకాడమీ ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 20-26 వరకు జరిగే వేడుకల్లో నాటికలు, పౌరాణిక/సాంఘిక నాటకాలు, పద్య నాటకాలను జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రదర్శిస్తామని పేర్కొంది. ఆసక్తిగలవారు వివరాలు, సాధించిన విజయాలు, ప్రదర్శించే నాటక వివరాలను వెల్లడిస్తూ నాటక <>అకాడమీ చిరునామాకు<<>> పంపాలని కోరింది.

News March 24, 2025

రేపు 52 మండలాల్లో వడగాలులు

image

AP: రాష్ట్రంలో రేపు 52, ఎల్లుండి 88 మండలాల్లో <>వడగాలులు<<>> వీచే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూ.గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ALERT జారీ చేసింది. ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించింది. అలాగే పలు ప్రాంతాల్లో అకాల వర్షాలతోపాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

News March 24, 2025

ఆవు పాలు తాగడంతో మహిళకు రేబిస్.. మృతి

image

ఆవు పాలు తాగిన మహిళకు రేబిస్ సోకి మృతి చెందిన ఘటన UP నోయిడాలో జరిగింది. దీనిపై ప్రముఖ వైద్యుడు సుధీర్ అవగాహన కల్పించారు. ‘నోయిడాలో వీధి కుక్క కరవడంతో ఆవుకు రేబిస్ సోకింది. దాని పచ్చి పాలు తాగడంతో మహిళ కూడా ఆ వ్యాధి బారిన పడింది. ఇలాంటి కేసు ఇదే తొలిసారి. రేబిస్ సోకిన ఆవు పచ్చి పాలు తాగితే టీకా వేసుకోవాలి. పచ్చి పాలు ఎప్పుడూ తీసుకోవద్దు. మరగబెట్టాక తాగడమే సురక్షితం’ అని ఆయన ట్వీట్ చేశారు.

error: Content is protected !!