News March 19, 2024

2025 చివరి నాటికి 20కిపైగా మోడళ్లు రిలీజ్ చేస్తాం: ఆడీ

image

2025 చివరిలోగా 20కిపైగా మోడళ్లను రిలీజ్ చేస్తామని ఆడీ సంస్థ వెల్లడించింది. 2027కు అన్ని మోడల్స్‌లోనూ EV వెర్షన్‌లను తెస్తామని తెలిపింది. 2024-2028 మధ్య తయారీకి ఏకంగా 41 బిలియన్ యూరోల (రూ.3.6లక్షల కోట్ల)ను ఖర్చు చేయనుంది. వీటిలో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వెహికిల్స్ (PHEV) కోసం 11.5 బిలియన్ యూరోలు వెచ్చించనుంది. బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం 29.5 బిలియన్ యూరోలు ఖర్చు చేయనుంది.

Similar News

News February 16, 2025

WPL: ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం

image

ముంబైతో జరిగిన మ్యాచులో ఢిల్లీ విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు ఆఖరి బంతికి అందుకుంది. చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా తొలి బంతికి నిక్కీ ప్రసాద్ ఫోర్ బాదారు. ఆ తర్వాతి 3 బంతులకు నాలుగు పరుగులు రాగా ఐదో బంతికి నిక్కీ ఔటయ్యారు. చివరి బంతికి అరుంధతి రెండు పరుగులు తీసి ఢిల్లీకి విజయాన్ని అందించారు.

News February 16, 2025

మహిళలు ఎక్కువగా మద్యం తాగే రాష్ట్రమిదే

image

మద్యం తాగే మహిళల సంఖ్య అస్సాంలో ఎక్కువగా ఉందని కేంద్ర సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 15-49ఏళ్ల స్త్రీల సగటు మద్యపానం 1.2% ఉండగా, అస్సాంలో ఇది 16.5% ఉంది. తర్వాతి స్థానాల్లో మేఘాలయ(8.7%), అరుణాచల్(3.3%) ఉన్నాయి. గతంలో టాప్‌లో ఉన్న ఝార్ఖండ్(9.9%), త్రిపుర(9.6%) తాజా సర్వేలో వరుసగా 0.3, 0.8 శాతానికి తగ్గిపోయాయి. మెట్రోపాలిటన్ రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక ఈ లిస్టులో లేకపోవడం గమనార్హం.

News February 16, 2025

OTTలోకి వచ్చేసిన కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’

image

కిచ్చా సుదీప్ నటించిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మ్యాక్స్’ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫిబ్రవరి 22న రిలీజ్ చేస్తామని గతంలో చెప్పిన సంస్థ వారం ముందుగానే ఓటీటీలోకి తీసుకురావడం విశేషం. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం DEC 25న విడుదలై దాదాపు రూ.65 కోట్లు కలెక్ట్ చేసింది. ఇందులో సునీల్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు.

error: Content is protected !!