News March 17, 2024
ప.గో. జిల్లాలో YCP నుంచి ఐదుగురు కొత్తగా

ఉమ్మడి జిల్లాలో ఈసారి ఐదుగురు కొత్తవారికి వైసీపీ అవకాశం కల్పించింది. ఏలూరు ఎంపీ అభ్యర్థి సునీల్కుమార్ యాదవ్, నరసాపురం ఎంపీ అభ్యర్థి ఉమాబాల, చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి విజయరాజు (రిటైర్డ్ రవాణా శాఖ అధికారి), పోలవరం అసెంబ్లీ అభ్యర్థి రాజ్యలక్ష్మి (ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ), పాలకొల్లు అసెంబ్లీ అభ్యర్థి గుడాల గోపికి పార్టీ అవకాశం ఇచ్చింది.
Similar News
News April 3, 2026
ప.గో: ఇన్ఛార్జ్ల పాలనలో దేవస్థానాల ఆస్తులకు రక్షణేది..?

జిల్లాలో దేవాదాయ శాఖ ఆలయాలు ఇన్ఛార్జ్ అధికారుల పాలనలో ఇబ్బందులు పడుతున్నాయి. ఒక్కో అధికారి పలు దేవాలయాలను పర్యవేక్షిస్తుండటంతో హుండీ లెక్కింపు, భూముల రక్షణలో పారదర్శకత లోపించిందని భక్తులు వాపోతున్నారు. వందలాది ఎకరాల ఆలయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని, గోశాలల నిర్వహణ దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పూర్తిస్థాయి అధికారులను నియమించి, దేవాలయ ఆస్తులను కాపాడాలని కోరుతున్నారు.
News April 3, 2026
విద్యాసంస్థల్లో ‘జీరో వేస్ట్’ విధానం అమలు చేయాలి: కలెక్టర్

పాఠశాలలు, వసతి గృహాల్లో వ్యర్థాల నియంత్రణకు శాస్త్రీయ ప్రణాళికలు అమలు చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో ‘జీరో వేస్ట్ ఇనిషియేటివ్’పై ఆమె సమీక్ష నిర్వహించారు. వ్యర్థాల పునర్వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, విద్యాసంస్థలను చెత్తరహిత నిలయాలుగా తీర్చిదిద్దేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.
News April 3, 2026
విద్యాసంస్థల్లో ‘జీరో వేస్ట్’ విధానం అమలు చేయాలి: కలెక్టర్

పాఠశాలలు, వసతి గృహాల్లో వ్యర్థాల నియంత్రణకు శాస్త్రీయ ప్రణాళికలు అమలు చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో ‘జీరో వేస్ట్ ఇనిషియేటివ్’పై ఆమె సమీక్ష నిర్వహించారు. వ్యర్థాల పునర్వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, విద్యాసంస్థలను చెత్తరహిత నిలయాలుగా తీర్చిదిద్దేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.


