News March 17, 2024

ప.గో. జిల్లాలో YCP నుంచి ఐదుగురు కొత్తగా

image

ఉమ్మడి జిల్లాలో ఈసారి ఐదుగురు కొత్తవారికి వైసీపీ అవకాశం కల్పించింది. ఏలూరు ఎంపీ అభ్యర్థి సునీల్‌కుమార్‌ యాదవ్‌, నరసాపురం ఎంపీ అభ్యర్థి ఉమాబాల, చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి విజయరాజు (రిటైర్డ్‌ రవాణా శాఖ అధికారి), పోలవరం అసెంబ్లీ అభ్యర్థి రాజ్యలక్ష్మి (ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ), పాలకొల్లు అసెంబ్లీ అభ్యర్థి గుడాల గోపికి పార్టీ అవకాశం ఇచ్చింది.

Similar News

News January 7, 2026

జిల్లాలో 46 రైల్వే వంతెనలకు లైన్ క్లియర్: జేసీ రాహుల్

image

జిల్లాలో ప్రతిపాదించిన 50 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిల పనుల్లో పురోగతి లభించింది. ఇందులో 46 నిర్మాణాలకు మంజూరు లభించినట్లు జేసీ రాహుల్ వెల్లడించారు. బుధవారం భీమవరంలో తన ఛాంబర్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వీటి నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. రైల్వే సెంటర్ లైన్ నుంచి ఇరువైపులా 30 మీటర్ల పరిధిలో త్వరితగతిన కొలతలు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

News January 7, 2026

శాఖాపరమైన పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు: డీఆర్ఓ

image

భీమవరం డీఎన్ఆర్ స్వయంప్రతిపత్తి కళాశాలలో ఈనెల 8న జరగనున్న ప్రభుత్వ ఉద్యోగుల శాఖాపరమైన అర్హత పరీక్షలను ప్రశాంత వాతావరణంలో, పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి ఆదేశించారు. ఈ పరీక్షకు సుమారు 100 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన ఏర్పాటు చేయాలన్నారు.

News January 7, 2026

ఏలూరు: నిర్లక్ష్యం ఖరీదు.. రూ.900 కోట్లు!

image

పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాపర్ డ్యామ్‌ నిర్మాణ సమయంలో 2019 నాటికి ఇరువైపులా ఖాళీలు వదిలేశారు. ఖాళీల గుండా 2020లో వచ్చిన వరదకి డయాఫ్రం వాల్‌ పూర్తిగా దెబ్బతింది. దీనిపై గత, ప్రస్తుత ప్రభుత్వాలు పరస్పర విమర్శలు గుప్పించుకున్నాయి. పాలకుల నిర్లక్ష్యం ఖజానాకు భారీగా చిల్లులు పెట్టింది. దెబ్బతిన్న వాల్‌ స్థానంలో కొత్త నిర్మాణం చేపట్టేందుకు రూ.900 కోట్లు అదనంగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది.