News January 25, 2025
శ్రీజేశ్కు పద్మభూషణ్.. అశ్విన్కు పద్మశ్రీ

క్రీడా విభాగంలో పలువురు ప్లేయర్లకు పద్మ అవార్డులు వరించాయి. హాకీ మాజీ గోల్ కీపర్ శ్రీజేశ్కు కేంద్రం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన భారత స్పిన్నర్ అశ్విన్కు, హర్వీందర్ సింగ్(పారా అథ్లెట్-హరియాణా), మణి విజయన్(ఫుట్ బాల్-కేరళ), సత్యపాల్ సింగ్(కోచ్- యూపీ) పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు.
Similar News
News February 11, 2025
బర్డ్ఫ్లూ ఎఫెక్ట్… ఆ వాహనాలకు నో ఎంట్రీ

APలో బర్డ్ఫ్లూ వెలుగుచూడటంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఆ రాష్ట్రం నుంచి వస్తున్నకోళ్ల వాహనాలకు అనుమతి నిరాకరించింది. అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 24చెక్పోస్ట్లను ఏర్పాటు చేసి ఏపీ నుంచి వచ్చే కోళ్ల వాహనాలను తిరిగి పంపిస్తున్నారు. బర్డ్ఫ్లూ పై పౌల్ట్రీ రైతులకు అవగాహన కల్పించాలని పశుసంవర్ధక శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. ఏపీలో ఈవైరస్ సోకి వేలసంఖ్యలో కోళ్లు మృతిచెందిన సంగతి తెలిసిందే.
News February 11, 2025
సీఎం చంద్రబాబు ఆగ్రహం

AP: సచివాలయంలో నిర్వహించిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సమావేశానికి ఆయన వచ్చిన 10 నిమిషాల తర్వాత మంత్రులు, అధికారులు తాపీగా రావడంతో సీబీఎన్ వారందరికీ క్లాస్ తీసుకున్నారు. సమయపాలన లేకపోవడమేంటని ప్రశ్నించారు. ఇక నుంచి ఇలాంటివి సహించేది లేదని తేల్చిచెప్పారు.
News February 11, 2025
మద్యం ధరల పెంపుతో రూ.150 కోట్ల ఆదాయం: కొల్లు

AP: YCP హయాంలో నకిలీ బ్రాండ్లతో మద్యం విక్రయాలు చేశారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. మద్యం డిపోలను తాకట్టుపెట్టి తెచ్చిన అప్పుల్లో ₹12K కోట్లు తాము చెల్లించామన్నారు. నాణ్యతలో రాజీ లేకుండా లిక్కర్ విక్రయాలు చేస్తున్నామని తెలిపారు. బాటిల్పై రేటు ₹10 పెంచామని, దీనివల్ల ప్రభుత్వానికి ₹150 కోట్ల వరకు ఆదాయం వస్తుందని చెప్పారు. త్వరలో నవోదయం కార్యక్రమం ద్వారా అక్రమ మద్యాన్ని అరికడతామన్నారు.