News January 26, 2025
పెద్ద కర్మ రోజే ‘పద్మశ్రీ’ ప్రకటన

AP: బుర్రకథ కళాకారుడు మిరియాల అప్పారావుకు కేంద్రం ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించింది. కొద్దిరోజులుగా ఆయన కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఇటీవల మరణించారు. నిన్న ఆయన పెద్ద కర్మ జరుగుతుండగానే అవార్డు ప్రకటన వచ్చింది. కోనసీమ జిల్లా రావులపాలేనికి చెందిన అప్పారావు చిన్నప్పటి నుంచే బుర్రకథ ప్రదర్శనలు ఇచ్చారు. సింగపూర్, కువైట్లో కూడా ఆయన గాత్రం వినిపించారు. అప్పారావు దాదాపు 5వేలకుపైగా ప్రదర్శనలు ఇచ్చారు.
Similar News
News December 9, 2025
హీరో రాజశేఖర్కు గాయాలు

హీరో రాజశేఖర్ కొత్త సినిమా షూటింగ్లో గాయపడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 25న మేడ్చల్ సమీపంలో యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా ఆయన కుడి కాలి మడమ వద్ద గాయమైంది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా 3గంటల పాటు మేజర్ సర్జరీ చేసినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. శస్త్రచికిత్స సక్సెస్ అయిందని, 4 వారాలు విశ్రాంతి తర్వాత ఆయన మళ్లీ మూవీ షూటింగ్లో పాల్గొంటారని చెప్పాయి.
News December 9, 2025
పవన్ దిష్టి వ్యాఖ్యలపై మంత్రి మనోహర్ ఏమన్నారంటే?

AP: Dy.CM పవన్ వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కోనసీమకు దిష్టి తగిలిందని రైతులతో మాట్లాడిన సందర్భంలోనే అన్నారని, ఇది రాజకీయం చేయాల్సిన అంశం కాదని తెలిపారు. పవన్కు TG ప్రజలపై ఎంతో నమ్మకం, ప్రేమ ఉన్నాయని చెప్పారు. ఆ మాటలపై అనవసర రాద్దాంతం చేశారని పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యలపై ఇప్పటికే జనసేన ప్రకటన విడుదల చేయగా, మరో మంత్రి కందుల దుర్గేశ్ సైతం వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.
News December 9, 2025
మా కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్: గల్లా జయదేవ్

TG: పెట్టుబడులకు హైదరాబాద్ బెస్ట్ డెస్టినేషన్ అని మాజీ ఎంపీ, అమర్రాజా గ్రూప్ ఛైర్మన్ గల్లా జయదేవ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కంపెనీలకు మంచి సహకారం అందిస్తున్నారని గ్లోబల్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన తెలిపారు. ఫ్యూచర్ సిటీలో రూ.9వేల కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని, తమ కంపెనీ చరిత్రలోనే ఇదే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ అని పేర్కొన్నారు. మరోవైపు అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తాయని ఆయన ప్రకటించారు.


