News January 26, 2025

పెద్ద కర్మ రోజే ‘పద్మశ్రీ’ ప్రకటన

image

AP: బుర్రకథ కళాకారుడు మిరియాల అప్పారావుకు కేంద్రం ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించింది. కొద్దిరోజులుగా ఆయన కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఇటీవల మరణించారు. నిన్న ఆయన పెద్ద కర్మ జరుగుతుండగానే అవార్డు ప్రకటన వచ్చింది. కోనసీమ జిల్లా రావులపాలేనికి చెందిన అప్పారావు చిన్నప్పటి నుంచే బుర్రకథ ప్రదర్శనలు ఇచ్చారు. సింగపూర్, కువైట్‌లో కూడా ఆయన గాత్రం వినిపించారు. అప్పారావు దాదాపు 5వేలకుపైగా ప్రదర్శనలు ఇచ్చారు.

Similar News

News November 8, 2025

అశ్వని కురిస్తే అంతా నష్టం

image

అశ్వని కార్తె వేసవి ప్రారంభంలో(ఏప్రిల్-13/14) నుంచి వస్తుంది. ఈ సమయంలో వర్షాలు పడితే, దాని ప్రభావం తర్వాత ముఖ్యమైన వర్షాధార కార్తెలైన భరణి, కృత్తిక, రోహిణిపై పడుతుందని, ఫలితంగా వర్షాలు సరిగ్గా కురవవని నమ్ముతారు. దీని వల్ల వ్యవసాయ పనులకు ఆటకం కలిగి పంట దిగుబడి తగ్గుతుందని, అన్నదాతలకు నష్టం వాటిల్లుతుందని ఈ సామెత వివరిస్తుంది.

News November 8, 2025

సంకటహర గణపతి ఎలా ఉంటాడంటే..?

image

ముద్గల పురాణం ప్రకారం.. విఘ్నేశ్వరుడికి మొత్తం 32 దివ్య స్వరూపాలున్నాయి. అందులో చివరిది, విశిష్టమైనది సంకటహర గణపతి. ఈ స్వామి రూపం ప్రశాంతంగా ఉంటుంది. కుడి చేయి వరద హస్త భంగిమలో, ఎడమ చేతిలో పాయస పాత్రతో, దేవేరిని ప్రేమగా ఎడమ తొడపై కూర్చోబెట్టుకుని కన్పిస్తారు. కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థి అంటే గణపతికి చాలా ఇష్టమట. ఈ రోజున భక్తితో ఆయన వ్రతం చేస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

News November 8, 2025

కీలక పోరు.. సూర్య రాణిస్తారా?

image

AUS-IND మధ్య బ్రిస్బేన్ వేదికగా ఇవాళ ఆఖరి T20 జరగనుంది. భారత్ సిరీస్ కైవసం చేసుకోవాలంటే ఈ మ్యాచులో గెలిచి తీరాల్సిందే. ఈ కీలక పోరులో కెప్టెన్ సూర్య, తిలక్ ఫామ్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ మ్యాచులో భారత్ పలు మార్పులు చేసే ఛాన్సుంది. గిల్ స్థానంలో శాంసన్‌, దూబే స్థానంలో నితీశ్‌ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మ్యాచ్ 1:45PMకి ప్రారంభమవుతుంది. కాగా ఐదు T20ల సిరీస్‌లో IND 2-1తో ఆధిక్యంలో ఉంది.