News March 28, 2024

PADMARAJAN: 238 సార్లు ఓడినా.. మళ్లీ పోటీ!

image

దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తమిళనాడుకు చెందిన పద్మరాజన్ పోటీ చేస్తుంటారు. సర్పంచ్ నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకూ బరిలోకి దిగుతారు. ఇప్పటివరకు ఆయన 238 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఎలక్షన్ కింగ్‌గా పిలిచే పద్మరాజన్ 1988 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వాజ్‌పేయీ, మన్మోహన్, మోదీ, రాహుల్ మీద పోటీకి దిగారు. డిపాజిట్ల రూపంలో రూ.లక్షలు నష్టపోయారు. ప్రస్తుతం ఆయన ధర్మపురి నుంచి MPగా పోటీ చేస్తున్నారు.

Similar News

News January 22, 2025

GREAT: పొద్దున పోలీస్.. సాయంత్రం టీచర్

image

హరియాణాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ అజయ్ గ్రేవాల్ రోజంతా ఉద్యోగం చేసి, సాయంత్రం ఉపాధ్యాయుడిగా మారుతారు. 2016 నుంచి ఆర్థికంగా వెనుకబడిన యువకులకు ఉచితంగా UPSC, తదితర ప్రభుత్వ ఉద్యోగాలకు కోచింగ్ అందిస్తున్నారు. ఇంటి టెర్రస్‌పైనే జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, గణితం, ఇంగ్లిష్, హిందీ వంటి సబ్జెక్టులను బోధిస్తారు. ఇప్పటివరకు ఆయన కోచింగ్ వల్ల 3వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినట్లు సమాచారం.

News January 22, 2025

BIG BREAKING: రాష్ట్రానికి భారీ పెట్టుబడి

image

తెలంగాణలో రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. ఇందులో భాగంగా ఆ కంపెనీ భారీ పంప్డ్ స్టోరేజీ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టు చేపట్టనుంది. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ప్రాజెక్టులు రానున్నాయి. 7వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో ఈ ఎంవోయూ జరిగింది.

News January 22, 2025

దారుణం.. భార్యను ముక్కలుగా నరికి కుక్కర్‌లో ఉడికించాడు!

image

హైదరాబాద్ మీర్‌పేట్‌లో వెంకట మాధవి (35) అనే మహిళ హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి. ఆమెపై అనుమానంతో భర్త గురుమూర్తే చంపి, మృతదేహాన్ని ముక్కలుగా చేసినట్లు దర్యాప్తులో తేలింది. వాటిని కుక్కర్‌లో ఉడికించి, ఆ తర్వాత జిల్లెలగూడ చెరువులో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈనెల 18 నుంచి మాధవి కనిపించకుండా పోయింది. ఆమె తల్లిదండ్రులతో కలిసి భర్త కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.