India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కొందరు అమ్మాయిలు కొరియన్ కల్చర్ అంటే పిచ్చెక్కిపోతున్నారు. ఘజియాబాద్లో <<19055978>>ముగ్గురు<<>> అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యకు కారణం కొరియన్ గేమ్స్ ఆడనివ్వకపోవడమే. ‘నా కూతుళ్లు కొరియాకు తీసుకెళ్లమని అడిగేవారు. మనం ఇండియన్స్ అని చెబితే కోప్పడేవారు. ఒరిజినల్ పేర్లను అలిజా, సిండీ, మారియాగా మార్చేసుకున్నారు’ అని తండ్రి చెప్పారు. దీంతో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలనే డిమాండ్స్ పెరుగుతున్నాయి. Comment?

క్రమశిక్షణతో కూడిన భక్తి ఉన్న ఇల్లు ఆలయంతో సమానమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు అన్నారు. అచంచలమైన నమ్మకంతో ఇంటి పూజా మందిరంలో కొలువైన దేవతలను పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నారు. ‘ఆగమశాస్త్రయుక్తంగా ప్రాణప్రతిష్ట జరిగిన గుడిలోని మూర్తుల నుంచి శక్తి తరంగాలు వెలువడతాయి. ఇంట్లో వాస్తు రీత్యా దైవపటాలను ఉంచి భక్తితో పూజించినప్పుడు, ఆ ఏకాగ్రతే అక్కడ సాత్విక శక్తిని నింపుతుంది’ అని చెప్పారు. <<-se>>#VASTHU<<>>

TG: మున్సిపల్ ఎన్నికల వేళ ఓటర్లు అప్రమత్తంగా ఉండాలి. గత ఐదేళ్లలో మీ వార్డులో మౌలిక వసతులు మెరుగయ్యాయా? గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చారా? అని ఒక్కసారి ఆలోచించుకోవాలి. మళ్లీ ఓటు అడిగేందుకు వచ్చిన వారికి గత హామీలను గుర్తుచేయండి. డ్రైనేజీ, రోడ్డు, నీటి వసతులపై పట్టుబట్టండి. అభివృద్ధిని కాంక్షించే, ప్రజలకు అందుబాటులో ఉండే సమర్థుడైన నాయకుడికి జై కొట్టండి. మరి ఐదేళ్లలో మీ ఊరు ఏమైనా మారిందా? COMMENT

AP: ప్రైవేటు స్కూళ్లలో RTE చట్టం కింద పేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు 25% సీట్లు ఉచితంగా కేటాయిస్తున్నారు. ఇందులో భాగంగా 2026-27 ఏడాదికి 1వ తరగతిలో ప్రవేశానికి షెడ్యూల్ విడుదల అయ్యింది. FEB 6-16 వరకు పోర్టల్లోని స్కూళ్ల డేటాను అప్డేట్ చేస్తారు. FEB 20-MAR 10 వరకు విద్యార్థుల నమోదు ఉంటుంది. MAR 25న మొదటి విడత లాటరీ ద్వారా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తామని SSA డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

AP: నీతి ఆయోగ్ CEO సుబ్రహ్మణ్యం ఇవాళ సచివాలయంలో CS విజయానంద్ను కలిసి ఎనర్జీ ట్రాన్సిషన్ డ్రాఫ్ట్ బ్లూప్రింట్ను అందించారు. దీని అమలు ద్వారా రూ.7.5 లక్షల కోట్ల పెట్టుబడితో AP రెన్యువబుల్ ఎనర్జీ కేంద్రంగా మారుతుంది. 5 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. పగటి పూట నిరాటంక సరఫరాతోపాటు యూనిట్ విద్యుత్ కొనుగోలు ధర రూ.4కి, సరఫరా ఖర్చు రూ.6కు తగ్గుతుంది. కాగా దీని అమలుకు వార్ రూమ్ను ఏర్పాటు చేయనున్నారు.

సీనియర్ టీచర్ కాంపిటీటివ్ ఎగ్జామ్-2024కు సంబంధించి రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షాకింగ్ రిజల్ట్స్ వెల్లడించింది. 320 సైన్స్ లెక్చరర్ పోస్టులకు 1.68 లక్షల మంది అప్లై చేశారు. గత SEPలో 25జిల్లా కేంద్రాల్లో 1.17 లక్షల మంది పరీక్ష రాశారు. వారిలో కేవలం 296 మంది అభ్యర్థులే క్వాలిఫై అయ్యారు. ఎంపిక విధానంపై హైకోర్టులో పిటిషన్ వేయగా ‘అభ్యర్థులు రూల్స్ తెలిసే పరీక్షకు హాజరవుతారు’ అని తోసిపుచ్చింది.

తన కొడుకు ఇషాన్ను వాషింగ్టన్ పోస్ట్ <<19054288>>తొలగించడంపై<<>> కాంగ్రెస్ MP శశిథరూర్ ఫైరయ్యారు. ‘వాషింగ్టన్ పోస్ట్ తీసుకున్న ఈ నిర్ణయంలో వింత ఏంటంటే.. ఇషాన్ కాలమ్ ప్రాచుర్యం పొందింది. ఆయన WorldViewకు 5లక్షల ఫాలోవర్లు ఉన్నారు. విదేశీ మంత్రులు, రాయబారులు చదువుతారు. ఈ ఫాలోయింగ్ను ధనార్జనకు వాడుకోవచ్చు. కానీ కాలమ్ను తీసేయడం ఆత్మహత్యలా కనిపిస్తోంది’ అని ట్వీట్ చేశారు.

మనిషి వ్యక్తిత్వంపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చేసిన ట్వీట్ అందరినీ ఆలోచింపజేస్తోంది. ‘మాట్లాడేటప్పుడు నోరు, ఆలోచించేటప్పుడు మనసు అదుపులో ఉండాలి. ఇతరులను కలిసినప్పుడు ప్రవర్తన మర్యాదగా ఉండాలి. భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహనతో భయం లేకుండా ముందడుగు వేయాలి. మనిషి ఎదుగుదలకు క్రమశిక్షణ, సంస్కారం ఎంతో అవసరం’ అని ఆయన పేర్కొన్న తీరు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ తీవ్రంగా గాయపడ్డారు. బాల్ తగలడంతో తన ముఖానికి గాయమైనట్లు ఇన్స్టాలో ఫొటోను షేర్ చేశారు. అందులో కన్ను బాగా వాచిపోవడంతో పాటు పెదవి, ముక్కుకు గాయమైనట్లు కనిపిస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో “Get well soon” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అమెరికాలో దారుణ ఘటన జరిగింది. గర్భిణీ సమయంలో ఓ మహిళ పచ్చి పాలను తాగేది. అందులోని బాక్టీరియా కారణంగా లిస్టీరియా అనే ఇన్ఫెక్షన్ సోకి నవజాత శిశువు మృతి చెందింది. అన్పాశ్చరైజ్డ్/ వేడి చేయని మిల్క్ తాగితే గర్భిణులు, శిశువులు, పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సార్లు గర్భస్రావం అవ్వొచ్చని అంటున్నారు. వేడి చేసిన పాలనే తాగాలని సూచిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.