News July 7, 2024

అసంపూర్తి ప్రాజెక్టులపై సీఎం స్పెషల్ ఫోకస్

image

TG: కృష్ణా, గోదావరి బేసిన్‌లోని అర్ధాంతరంగా ఆగిపోయిన 6 సాగునీటి ప్రాజెక్టులపై CM రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. వాటిని త్వరగా వినియోగంలోకి తేవాలని నిర్ణయించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. నీలంవాగు, పింప్రి, పాలెంవాగు, మత్తడివాగు, SRSP స్టేజ్-2, సదర్మాట్ ప్రాజెక్టును 2025 మార్చి నాటికి పూర్తిచేయాలని CM ఆదేశించారు.

News July 7, 2024

పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ ఏజెన్సీ: బెస్ట్ ఎంపీగా RRR

image

2019-2024లో ఏపీ ఎంపీల్లో రఘురామ కృష్ణరాజు ఉత్తమ పనితీరు కనబరిచారని ‘పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్’ ఏజెన్సీ తెలిపింది. పార్లమెంటులో హాజరు శాతం, లేవనెత్తిన ప్రశ్నల ఆధారంగా ర్యాంకులను వెల్లడించింది. 100 పర్సంటైల్‌తో రఘురామ టాప్‌ ర్యాంకు సాధించారని పేర్కొంది. ఈ లిస్టులో గల్లా జయదేవ్, వంగా గీత, రామ్మోహన్ తర్వాతి 3 స్థానాల్లో ఉన్నారని తెలిపింది. కాగా 2024 ఎన్నికల్లో RRR ఉండి MLAగా గెలుపొందిన సంగతి తెలిసిందే.

News July 7, 2024

గోదావరికి ‘కొత్త నీరు’

image

AP: భారీ వర్షాలతో గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతోంది. కొండల నుంచి వరద వస్తుండటంతో రాజమండ్రి బ్రిడ్జి వద్ద గోదావరి ఎరుపెక్కింది. రెండు, మూడు రోజుల క్రితం నీలిరంగులో ఉన్న నది ఎర్రగా మారడంతో స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

News July 7, 2024

BREAKING: భారత్ ఘన విజయం

image

రెండో టీ20లో జింబాబ్వేపై భారత్ 100 పరుగుల భారీ తేడాతో గెలిచింది. 235 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆ జట్టును టీమ్ ఇండియా బౌలర్లు 134 పరుగులకే ఆలౌట్ చేశారు. ముకేశ్, అవేశ్ తలో 3, బిష్ణోయ్ 2, సుందర్ ఒక వికెట్ పడగొట్టారు. అంతకుముందు అభిషేక్(100), రుతురాజ్(77*), రింకూ(48*) విజృంభించడంతో భారత్ 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ విజయంతో 5 టీ20ల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది.

News July 7, 2024

రోహిత్ శర్మ వెళ్లాడు.. అభిషేక్ శర్మ వచ్చాడు

image

WC గెలిచిన తర్వాత రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అయితే జింబాబ్వేతో రెండో టీ20లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ ఆ లోటును తీరుస్తాడంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. పైగా రోహిత్ లాగే అభిషేక్ కూడా తొలి సెంచరీ జింబాబ్వేపైనే చేయడం విశేషం. ఇద్దరూ సిక్స్‌తోనే సెంచరీ పూర్తిచేయడం మరో హైలైట్. భవిష్యత్తులో రోహిత్ స్థానాన్ని అభిషేక్ భర్తీ చేస్తారా? కామెంట్ చేయండి.

News July 7, 2024

కారు ఆపితే నా భార్య బతికి ఉండేది.. బాధితుడి ఆవేదన

image

నిందితుడు BMW కారు ఆపి ఉంటే తన భార్య బతికి ఉండేదని <<13583473>>హిట్ అండ్ రన్<<>> ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కావేరి భర్త ప్రదీప్ అన్నారు. నిందితులు పెద్ద వాళ్లని, వారిని ఎవరూ ఏం చేయలేరని ఆవేదన వ్యక్తం చేశారు. చేపలు విక్రయిస్తూ జీవనం సాగించే ఈ దంపతులు బైక్‌పై వెళుతుండగా శివసేన నేత కుమారుడు కారుతో ఢీకొట్టడంతో భార్య కావేరి మరణించారు. కాగా నిందితుడు మద్యం తాగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

News July 7, 2024

జనసేన శ్రేణులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్

image

AP: రాష్ట్రంలోని NDA సర్కార్‌కు జనసేన శ్రేణులు వెన్నుదన్నుగా నిలబడాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పార్టీ రూల్స్‌ను ఉల్లంఘించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఆధారాల్లేకుండా ఆరోపణలు చేసినా కఠిన చర్యలు ఉంటాయన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘించి అధికారిక సమావేశాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనడం కూడా నిబంధనల అతిక్రమణ కిందికే వస్తుందని, అలాంటి వారిపైనా చర్యలు ఉంటాయని ఓ ప్రకటనలో తెలిపారు.

News July 7, 2024

అందర్నీ ముస్లింలుగా మార్చాలి.. మేయర్ సెన్సేషనల్ కామెంట్స్

image

ముస్లిమేతరులను ముస్లింలుగా మార్చాలని కోల్‌కతా TMC మేయర్ ఫిర్హాద్ హకీం సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అవి వివాదాస్పదం కాగా మళ్లీ స్పందిస్తూ తన వ్యాఖ్యల్లో తప్పులేదని, తాను లౌకికవాదినని, అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పుకొచ్చారు. ఆల్ ఇండియా ఖురాన్ కాంపిటిషన్‌ను ఉద్దేశిస్తూ ప్రసంగించే సమయంలో ‘ముస్లిమేతరులుగా పుట్టినవారు దురదృష్టవంతులు. వారిని ఇస్లాంలోకి తీసుకురావాలి’ అని అన్నారు.

News July 7, 2024

SIM కార్డులు చెక్ చేసుకోండి.. లేకుంటే రూ.2లక్షల ఫైన్

image

మీ పేరుతో 9కంటే ఎక్కువ SIM కార్డులుంటే రూ.2లక్షల ఫైన్, జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. టెలికామ్ యాక్ట్ 2023 కొత్త నిబంధనల ప్రకారం J&K, అస్సాం, నార్త్ ఈస్ట్ ఇండియాలోని లైసెన్సుడ్ సర్వీస్ ఏరియాల్లో మినహా ఎక్కడా పరిమితికి మించి SIM కార్డులు వాడటం చట్టరీత్యా నేరం. మీ పేరిట ఎన్ని SIMలు ఉన్నాయో <>sancharsaathi.gov.in<<>>లో చెక్ చేసుకోవచ్చు. మీకు తెలియనివి, అనవసరమైన SIMలున్నా వాటిని రిపోర్ట్ కొట్టవచ్చు.

News July 7, 2024

‘సరిపోదా శనివారం’ హీరోయిన్ ఫస్ట్ లుక్ రివీల్

image

నాని హీరోగా తెరకెక్కుతున్న ‘సరిపోదా శనివారం’ నుంచి హీరోయిన్ ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ మూవీలో ఆమె పోలీసుగా ‘చారులత’ అనే పాత్రలో కనిపించనున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో ఆగస్టు 29న రిలీజ్ కానుంది.