India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తూర్పుగోదావరి జిల్లాలోని స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ కోర్టుల్లో 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. పోస్టును బట్టి డిగ్రీ, టెన్త్, 7వ తరగతి అర్హతగల వారు FEB 16వరకు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 -42ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. కోర్టు అసిస్టెంట్కు నెలకు రూ.10వేలు, అటెండెంట్కు రూ.6వేలు చెల్లిస్తారు. సైట్: eastgodavari.dcourts.gov.in

AP: క్యాన్సర్… రోగుల్ని, వారి ఫ్యామిలీలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఈ క్యాన్సర్ కేసులు APలో భారీగా పెరుగుతున్నాయి. 2021-2025 మధ్య 1.6L కేసులు తేలాయి. గ్రామీణ, చిన్న పట్టణాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. రోగుల్లో 65% మహిళలే. వీటి వైద్యంలో 12.6 లక్షల ఎపిసోడ్స్(చికిత్స)లు నమోదు కాగా ₹3061CR ఖర్చయినట్లు అంచనా. దీనిపై సలహాదారు, ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు GOVTకి నివేదిక ఇచ్చారు.

USతో ట్రేడ్ డీల్ వల్ల భారత వ్యవసాయ, డెయిరీ రంగాలకు నష్టం వాటిల్లుతుందని వస్తోన్న విమర్శలను కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కొట్టిపారేశారు. ఇలాంటి సెన్సిటివ్ సెక్టార్స్కు పూర్తి రక్షణ కల్పించేలా డీల్ కుదుర్చుకొన్నామని పార్లమెంట్లో ప్రకటించారు. దాదాపు ఏడాది పాటు సాగిన సుదీర్ఘ చర్చల్లో ఇరు దేశాలూ తమ తమ సున్నితమైన అంశాలను రక్షించుకునేలాగే నియమ నిబంధనలను పొందుపర్చామని స్పష్టం చేశారు.

SS రాజమౌళి, మహేశ్ బాబుల క్రేజీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ డిజిటల్ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ ఏకంగా రూ.650 కోట్ల భారీ ఆఫర్ను ప్రకటించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే భారతీయ సినిమా చరిత్రలోనే ఇదే అతిపెద్ద ఓటీటీ డీల్ అవుతుంది. థియేట్రికల్ రన్ను కాపాడేందుకు సినిమా విడుదలైన 8 వారాల తర్వాతే OTTలో స్ట్రీమింగ్ అయ్యేలా మేకర్స్ ఒప్పందం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది.

వేదాంతా గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ తన మొత్తం ఆస్తిలో 75% సమాజానికి విరాళంగా ఇస్తానని ప్రకటించారు. సుమారు $4.9B నికర విలువ కలిగిన ఆయన ప్రమోటర్ హోదా నుంచి వైదొలగి ఇకపై ట్రస్టీగా సేవలు అందించనున్నారు. ఇటీవల మరణించిన తన కుమారుడు అగ్నివేశ్ జ్ఞాపకార్థం విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధికి ₹15 వేల కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీని కలిసిన అనంతరం తన నిర్ణయాన్ని ఆయన అధికారికంగా వెల్లడించారు.

స్పేస్ఎక్స్, xAI విలీనంతో ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. ఫోర్బ్స్ ప్రకారం.. ఈ డీల్ తర్వాత ఆయన నెట్ వర్త్ $852 బిలియన్లకు చేరింది. దీంతో ప్రపంచ చరిత్రలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా ఆయన నిలిచారు. విలీనం తర్వాత ఏర్పడిన కొత్త సంస్థ విలువ $1.25 ట్రిలియన్లుగా ఉండగా ఈ ఒక్క ఒప్పందం వల్లే మస్క్ సంపదకు అదనంగా $84 బిలియన్లు తోడయ్యాయి. మస్క్ తర్వాత లారీ పేజ్ $278 బిలియన్లతో రెండో స్థానంలో ఉన్నారు.

బెంగాల్లో ఓటర్ల జాబితా సవరణ కోసం భారత ఎన్నికల సంఘం చేపట్టిన SIR ప్రక్రియపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ ప్రక్రియ వల్ల లక్షలాది మంది ఓటర్ల హక్కులకు భంగం కలుగుతుందని ఆరోపిస్తూ CM మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం ECIకి నోటీసులిచ్చింది. ముఖ్యమంత్రే స్వయంగా హాజరై తన వాదనలు వినిపించారు. ఒక సిట్టింగ్ సీఎం ఇలా నేరుగా కోర్టులో వాదించడం భారత న్యాయ చరిత్రలో ఇదే తొలిసారి.

జొన్న విత్తిన 30-35 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 48 గంటలలోపు ఎకరాకు 800 గ్రా. అట్రజిన్ (50%) పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై సమంగా పిచికారీ చేస్తే 35 రోజుల వరకు కలుపు సమస్య ఉండదు. విత్తిన 30, 60 రోజులకు గుంటక లేదా దంతితో వరుసల మధ్య అంతర కృషి చేసుకోవాలి. దీని వలన కలుపు నివారణతో పాటు తేమ నిలిచి పంట చివరి దశలో బెట్టకు గురికాకుండా ఉంటుంది.

SBIలో 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు 21-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్ ఉన్న వారికి వయసులో సడలింపు ఉంటుంది. స్థానిక భాష చదవడం, రాయడం వచ్చి ఉండాలి. అభ్యర్థులు FEB 18 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: sbi.bank.in

<
Sorry, no posts matched your criteria.