News October 5, 2024

గుర్రంపై వచ్చి ఓటేసిన ఎంపీ జిందాల్

image

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు BJP MP నవీన్ జిందాల్ గుర్రంపై పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఇది శుభమని నమ్మడమే కాక ప్రజల్లో ఓటుపై అవగాహన కల్పించేందుకే ఇలా చేసినట్లు ఆయన వివరించారు. ‘ప్రజల్లో చాలా చైతన్యం కనిపిస్తోంది. వారు బీజేపీకి ఓటేసి తమ దీవెనల్ని అందిస్తారని నమ్మకంతో ఉన్నాం. నయబ్ సింగ్ మళ్లీ CM అవుతారు’ అని పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో 90 స్థానాలకు ఈరోజు ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతోంది.

News October 5, 2024

నేనిప్పుడు గాంధేయవాదిని: ఉగ్రవాది యాసిన్ మాలిక్

image

తాను 1994 నుంచే హింసను వదిలేశానని, ఇప్పుడు గాంధేయవాదినని ఉగ్రవాది, వేర్పాటువాది యాసిన్ మాలిక్ చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం(UAPA) ట్రిబ్యునల్‌కు తెలిపారు. శాంతియుత విధానాల్లోనే స్వతంత్ర, ఐక్య కశ్మీర్‌ను సాధించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. మాలిక్ ప్రస్తుతం తిహార్‌ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. 1990లో భారత వాయుసేనకు చెందిన నలుగురు అధికారుల హత్యలో మాలిక్ ప్రధాన నిందితుడు.

News October 5, 2024

అత్యంత అరుదైన ఖగోళ దృశ్యం.. మళ్లీ 80వేల ఏళ్ల తర్వాతే!

image

మరికొన్ని రోజుల్లో ఆకాశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. సుచిన్‌షాన్-అట్లాస్ అనే తోకచుక్క భూమికి 44 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్లనుందని నాసా వెల్లడించింది. 2023లో సూర్యుడికి అత్యంత సమీపంగా ప్రయాణించినప్పుడు దీన్ని తొలిసారి గుర్తించామని పేర్కొంది. ఈ నెల 9-10 తేదీల మధ్య స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని వివరించింది. ఈ తోకచుక్క భూమి సమీపానికి మళ్లీ వచ్చేది మరో 80వేల సంవత్సరాల తర్వాతే!

News October 5, 2024

హర్షసాయి‌పై లుక్‌అవుట్ నోటీసులు

image

TG: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కోసం HYD నార్సింగి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అతడిపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని, రూ.2 కోట్ల డబ్బు కూడా తీసుకున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News October 5, 2024

రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటి?

image

ఏదైనా ప్రాజెక్టుకు ఖరారైన కాంట్రాక్ట్‌కు మళ్లీ టెండర్లు పిలవడాన్ని రివర్స్ టెండరింగ్ అంటారు. మొదటిసారి పిలిచిన టెండర్లలో అవకతవకలు జరగడం లేదా ఆ పనిని మరింత చౌకగా చేయడానికి అవకాశం ఉందని తేలితే రివర్స్ టెండరింగ్‌కు పిలుస్తారు. జాతీయ స్థాయిలో NTPC, కోల్ ఇండియా, సోలార్ పవర్ కార్పొరేషన్ అమలు చేస్తున్న ఈ విధానాన్ని YCP ప్రభుత్వం తొలిసారి ఏపీలో తీసుకొచ్చింది. దాన్ని కూటమి సర్కార్ రద్దు చేసింది.

News October 5, 2024

TTDలో రివర్స్ టెండరింగ్ రద్దు

image

AP: TTDలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ EO శ్యామలరావు ఉత్తర్వులిచ్చారు. దీంతో పాత పద్ధతిలోనే టెండర్ల ప్రక్రియ కొనసాగనుంది. అన్ని రకాల పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను NDA ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో ఎన్టీపీసీ, కోల్ ఇండియా, సోలార్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ తదితర సంస్థలు అమలుచేస్తున్న ఈ విధానాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది.

News October 5, 2024

కంపెనీల వెబ్‌సైట్లకూ బ్లూటిక్.. త్వరలో గూగుల్ కొత్త ఫీచర్

image

ఫేక్ వెబ్‌సైట్లను సులభంగా గుర్తించడం, అందులోని సమాచారం ఆధారంగా యూజర్లు మోసపోకుండా ఉండేందుకు గూగుల్ చర్యలు తీసుకుంటోంది. సోషల్ మీడియా అకౌంట్ల మాదిరిగానే కంపెనీల వెబ్‌సైట్లకు వెరిఫైడ్ బ్లూటిక్ ఇచ్చే ఫీచర్‌పై పనిచేస్తోంది. మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్ వెబ్‌సైట్ లింక్‌లకు బ్లూటిక్ ఇచ్చి పరీక్షించింది. త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని గూగుల్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

News October 5, 2024

రికార్డు సృష్టించిన హర్మన్ ప్రీత్

image

మహిళల టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక ఎడిషన్లకు కెప్టెన్సీ చేసిన భారత కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ రికార్డు నెలకొల్పారు. ఆమె ఇప్పటివరకు 4 ఎడిషన్లలో (2018, 2020, 2023, 2024) టీమ్‌ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆమె తర్వాత మిథాలీ రాజ్(2012, 2014, 2016), జులన్ గోస్వామి (2009, 2010) ఉన్నారు.

News October 5, 2024

RECORD: $700 బిలియన్లు దాటిన విదేశీ మారకనిల్వలు

image

భారత విదేశీ మారకనిల్వలు వరుసగా ఏడోవారం పెరిగాయి. సెప్టెంబర్ 27తో ముగిసిన వారంలో నిల్వలు $12.59 బిలియన్లు పెరిగి కొత్త జీవితకాల గరిష్ఠ స్థాయి $704.88 బిలియన్లకు చేరుకున్నాయి. చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తర్వాత ఈస్థాయి నిల్వలను కలిగిన నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్ రికార్డు సృష్టించింది. ఒక వారంలో $12.59 బిలియన్లు పెరగడమూ ఇదే తొలిసారి.

News October 5, 2024

ఇంగ్లండ్‌లో నవజాత శిశువులకు జన్యుపరీక్షలు.. ఎందుకంటే..

image

వందలాదిమంది నవజాత శిశువులకు ఇంగ్లండ్‌ జన్యుపరీక్షలు నిర్వహిస్తోంది. దీని ద్వారా జన్యుపరంగా తలెత్తే అరుదైన ఆరోగ్య సమస్యల్ని ముందుగా గుర్తించి తగిన చికిత్స అందించవచ్చని అక్కడి అధికారులు తెలిపారు. దీనికోసం బొడ్డుతాడు నుంచి జన్యువుల్ని సేకరిస్తారు. NHS, జెనోమిక్స్ ఇంగ్లండ్ సంస్థలు కలిసి ఈ కార్యక్రమం చేపట్టాయని, లక్షమంది శిశువులకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.