News August 15, 2025

పులివెందులలో వైసీపీకి 8% ఓట్లా?: రోజా

image

AP: గత ఎన్నికల్లో పులివెందుల పరిధిలో YCP 64% ఓట్లు సాధించిందని, ఇప్పుడు 8.95% ఓట్లు రావడమేంటని ఆ పార్టీ నేత రోజా ప్రశ్నించారు. గత ఎన్నికల్లో 24% ఓట్లు వచ్చిన TDPకి ఇప్పుడు 88% ఓట్లు రావడమేంటని మండిపడ్డారు. ‘ఐదుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులకు 0, 1, 2, 3, 4 ఓట్లు రావడం ఏమిటో? పోటీలో ఉన్న అభ్యర్థికి వారి కుటుంబసభ్యులు అయినా ఓటు వేయరా? ఈ ఫలితాలను మనం నమ్మాలా?’ అంటూ ఆమె సందేహం వ్యక్తం చేశారు.

News August 15, 2025

రానున్న 2-3గంటల్లో ఈ జిల్లాల్లో వర్షం

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మేడ్చల్, మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు వర్షం కురుస్తుందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, భద్రాద్రి, జనగామ, ఖమ్మం, మెదక్, మహబూబాబాద్, ములుగు, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, యాదాద్రి తదితర జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. గంటకు 40కి.మీ. వేగంతో గాలులు వీస్తాయంది.

News August 14, 2025

తెలుగు రాష్ట్రాల న్యూస్ రౌండప్

image

☛ తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం
☛ ప్రమాదకర స్థితికి TG ద్రవ్యోల్బణం: హరీశ్ రావు
☛ MP పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేస్తే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తాం: రఘునందన్ రావు
☛ తాడిపత్రి మాజీ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఊరట.. ఈ నెల 18న తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి
☛ ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక

News August 14, 2025

ఈ నెల 19న భారత జట్టు ప్రకటన?

image

ఈ నెల 19న ఆసియా కప్ కోసం భారత జట్టును ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. జట్టు సెలక్షన్ అనంతరం చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మీడియా సమావేశం నిర్వహిస్తారని సమాచారం. ఆ సమావేశంలోనే జట్టును ప్రకటిస్తారని తెలుస్తోంది. ప్రాబబుల్ జట్టు అంచనా: అభిషేక్, శాంసన్, సూర్య, తిలక్, హార్దిక్, గిల్, దూబే, అక్షర్, సుందర్, వరుణ్, కుల్దీప్, బుమ్రా, అర్ష్‌దీప్, హర్షిత్/ప్రసిద్ధ్, జితేశ్/జురేల్.

News August 14, 2025

DSC అభ్యర్థులకు అలర్ట్

image

AP: మెగా డీఎస్సీ స్కోర్ కార్డులు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత సవరించిన టెట్ మార్కులతో అనుసంధానించిన స్కోర్ కార్డులను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. టెట్ మార్కుల స్కోరు కార్డులో ఏవైనా అభ్యంతరాలుంటే అభ్యర్థులు డీఎస్సీ <>వెబ్‌సైట్‌లో<<>> సరిచేసుకోవాలని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి సూచించారు. ఇందుకోసం రేపటి వరకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

News August 14, 2025

అలాగైతే భారత్‌పై మరింత టారిఫ్స్: US హెచ్చరిక

image

భారత్‌పై టారిఫ్స్‌ను US మరింత పెంచవచ్చని ఆ దేశ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ హెచ్చరించారు. అలస్కాలో శుక్రవారం జరిగే ట్రంప్-పుతిన్ భేటీ రిజల్ట్‌పై ఇది ఆధారపడి ఉంటుందన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు రష్యా అంగీకరిస్తే టారిఫ్స్ పెంపు ఉండకపోవచ్చని, లేదంటే సుంకాలు పెంపు తప్పదన్నారు. రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటోందని ఇప్పటికే INDపై US 25% అదనపు టారిఫ్స్ విధించిన సంగతి తెలిసిందే.

News August 14, 2025

నీటి నిర్వహణపై జిల్లాలకు రేటింగ్: సీఎం

image

AP: నీటివనరుల సంరక్షణతోనే భూగర్భ జలాలు పెరుగుతాయని CM CBN అన్నారు. సమర్థ నీటి నిర్వహణతో కరవును తరిమేయవచ్చని చెప్పారు. సాగునీటిశాఖలో ఇంజినీరింగ్ వ్యవస్థను రీస్ట్రక్చర్ చేస్తామని తెలిపారు. నీటి నిర్వహణలో సాగునీటి సంఘాల భాగస్వామ్యం ఉండాలని ఆ శాఖ సమీక్షలో CM అన్నారు. నీటి నిర్వహణపై జిల్లాలకు రేటింగ్ ఇస్తామని తెలిపారు. వెలిగొండ, గాలేరు నగరి సుజల స్రవంతిపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.

News August 14, 2025

SC తీర్పు ప్రజాస్వామ్య విజయం: మహేశ్ కుమార్

image

TG: బిహార్‌లో ఓటర్ల తొలగింపుపై సుప్రీంకోర్టు <<17403517>>తీర్పు<<>> ప్రజాస్వామ్య విజయమని TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. LoP రాహుల్ లేవనెత్తిన ఓటు చోరీ ఆరోపణ ఈ తీర్పుతో రుజువైందన్నారు. దీనిపై పార్లమెంట్‌లో చర్చకు పట్టుబట్టినా కేంద్రం స్పందించకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. ఆధార్ లింక్‌తో ‘ఒక ఓటు-ఒక మనిషి’ విధానం అమలు చేయాలన్న రాహుల్ డిమాండ్‌పై EC స్పందించాలని డిమాండ్ చేశారు.

News August 14, 2025

‘కూలీ’ సినిమా ఆల్ టైమ్ రికార్డు

image

ఓవర్సీస్ వసూళ్లలో ‘కూలీ’ <<17400697>>సినిమా<<>> ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా అత్యధిక గ్రాస్ వసూళ్లు ($3,042,756= ₹24.26Cr) సాధించిన తమిళ సినిమాగా నిలిచింది. ఈ విషయాన్ని డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ప్రత్యంగిరా సినిమాస్ ప్రకటించింది. రజినీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. మీరు ఈ సినిమా చూశారా? ఎలా అనిపించింది?

News August 14, 2025

ఇంటర్‌తోపాటు నాలుగేళ్లు APలో చదివినవారే లోకల్: హైకోర్టు

image

AP: విద్యార్థుల స్థానికతపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలో ఇంటర్‌తోపాటు నాలుగేళ్లు చదివినవారే స్థానికులని తేల్చిచెప్పింది. లోకల్ అంశంపై రాష్ట్రపతి ఉత్తర్వుల్లో స్పష్టంగా నిర్వచించారని పేర్కొంది. ఆ ఉత్తర్వులకు అనుగుణంగా ఉంటేనే లోకల్ అభ్యర్థులని, లేదంటే నాన్ లోకల్‌గా పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది. స్థానికతపై పలువురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది.