India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హై కొలెస్ట్రాల్ బయటకు కనిపించని ప్రమాదం. ప్రత్యేకమైన లక్షణాలేమీ ఉండవు. కానీ మన శరీరంలో కొన్ని మార్పులు గమనించొచ్చు. కళ్ల దగ్గర పసుపు రంగు మచ్చలు, కొన్ని భాగాల్లో చర్మం కింద కొవ్వు గడ్డలు, కంటి పాప చుట్టూ తెల్లటి రింగ్ కనిపిస్తే అలర్ట్ అవ్వాలి. ఛాతీలో నొప్పి, నీరసం, ఆయాసం వచ్చినా నిర్లక్ష్యం చేయొద్దు. ఇవన్నీ కేవలం సూచనలు మాత్రమే. బ్లడ్ టెస్ట్ చేయించుకొని డాక్టర్ని సంప్రదించడం చాలా ముఖ్యం.

2026-27 విద్యాసంవత్సరానికి గాను కేంద్రీయ విద్యాలయాల్లో(KV) అడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగియనుంది. ఒకటో తరగతితో పాటు బాల వాటికల్లో ప్రవేశాలకు https://kvsangathan.nic.in/లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బాల వాటికలకు ఏప్రిల్ 8న, ఒకటో తరగతికి 9న తొలి జాబితాను విడుదల చేస్తారు. సీట్ల ఖాళీలను బట్టి 16న రెండో, 21న మూడో లిస్టును ప్రకటిస్తారు.

దేశంలో వివాహ బంధాల తీరు మారుతోంది. ఒక ప్రముఖ వివాహేతర డేటింగ్ యాప్ రిపోర్ట్ ప్రకారం భారత్లో మహిళా యూజర్ల సంఖ్య రెండేళ్లలో 148% పెరిగింది. మోడ్రన్ లైఫ్స్టైల్, ఎమోషనల్గా సంతృప్తి లేకపోవడం వల్ల పెళ్లి తర్వాత బయటి సంబంధాల కోసం వెతుకుతున్నారని తేలింది. టెక్నాలజీ పుణ్యమా అని ‘సీక్రెట్ అఫైర్స్’ ఈజీ అవ్వడంతో వివాహ వ్యవస్థ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోందని సామాజిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగింది. ఈ తరుణంలో పంటల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఎండ వేడి నుంచి నేల ఉష్ణోగ్రతను తగ్గించడానికి మొక్కల చుట్టూ ఎండిన ఆకులు, వరి గడ్డి లేదా సేంద్రీయ వ్యర్థాలను మల్చింగ్గా వేయాలి. దీని వల్ల నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. అలాగే నిపుణుల సూచన మేరకు పంట దశను బట్టి నీటిని తప్పక అందించాలి.

భారత పార్లమెంటులో రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ అనే 3 విభాగాలు ఉంటాయి. *దిగువ సభ అయిన LSలో గరిష్ఠ సభ్యుల సంఖ్య 550. సభ్యుల పదవీ కాలం 5 ఏళ్లు. పోటీ చేయడానికి కనీస వయస్సు 25 ఏళ్లు.
*రాజ్యసభలో గరిష్ఠ సభ్యుల సంఖ్య 250. ఇది ఒక శాశ్వత సభ (దీనిని రద్దు చేయడం వీలుకాదు). సభ్యుల పదవీ కాలం: 6 సంవత్సరాలు (ప్రతి 2 ఏళ్లకు 1/3 వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు). పోటీ చేయడానికి కనీస వయస్సు 30 ఏళ్లు.

వాతావరణ పరిస్థితులు, పురుగులు, పండు ఈగ, ఇతర కీటకాల వల్ల మామిడి పంటకు నష్టం ఎక్కువగా ఉంటుంది. అందుకే నిమ్మ లేదా కోడి గుడ్డు సైజుకు మామిడి కాయ వచ్చాక ‘ఫ్రూట్ కవర్స్’ కట్టాలి. దీని వల్ల చెట్టుపై రసాయనాలు పిచికారీ చేసినా అవి పండుపై పడవు. అలాగే కవర్ కట్టిన కాయపై ఎలాంటి మచ్చలు, చీడపీడల లక్షణాలు కనిపించవు. ఇతర కాయల కంటే ఎక్కువ బరువు పెరిగి మంచి ధర పలుకుతాయి. ఈ కవర్స్ వాటర్ ప్రూఫ్. నీరు పడినా ఏమీ కావు.

LSG కెప్టెన్ పంత్ బ్యాటింగ్ పొజిషన్పై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఓపెనర్గా విఫలమైనప్పటికీ పంత్ ఆ స్థానాన్ని వదలొద్దని సూచించారు. పవర్ ప్లే తర్వాత వస్తే బౌలర్లు ఈజీగా కట్టడి చేస్తారని, అందుకే 14 మ్యాచ్ల్లోనూ ఓపెనర్గానే రావాలని కోరారు. కోచ్ లాంగర్, LSG మేనేజ్మెంట్లో ఎవరైనా ఈ విషయంపై పంత్కు నచ్చజెప్పి స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వాలని సూచించారు.

TG: రెంటల్ సిస్టమ్ స్థానంలో పర్సెంటేజీ విధానం అమలు చేయాలని 23 థియేటర్ల యాజమాన్యాలు నిర్ణయించాయి. దీని ప్రకారం కలెక్షన్లలో తొలివారం 60%, రెండో వారం 50%, మూడో వారం 40% థియేటర్లకు అందనుంది. ఇది రేపటి నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటిదాకా డిస్ట్రిబ్యూటర్లు అద్దె ప్రాతిపదికన చెల్లింపులు చేసే వారు. దీంతో లగ్జరీ సదుపాయాలు కల్పిస్తున్న తాము నష్టపోతున్నామని సదరు థియేటర్ల ఓనర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.

UP కాన్పూర్లో వెలుగుచూసిన కిడ్నీ రాకెట్ ఉదంతం సినిమా స్టోరీని తలపిస్తోంది. ఓ యువకుడు తన కిడ్నీని రూ.10లక్షలకు అమ్మేందుకు ముఠాతో ఒప్పందం చేసుకున్నాడు. అయితే ఆపరేషన్ పూర్తయ్యాక అతనికి రూ.9.5లక్షలే ఇవ్వడంతో మిగిలిన డబ్బు కోసం గొడవ జరిగింది. ఆ కోపంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విచారణలో అంతర్జాతీయ ముఠా గుట్టురట్టైంది. వీరు రూ.10లక్షలకు కొని రోగికి రూ.60లక్షలకు అమ్ముతున్నట్లు విచారణలో తేలింది.

AP: ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.7,358 CR బకాయిల విడుదలకు GOVT చర్యలు చేపట్టింది. CM ఆదేశాలతో చెల్లింపు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. గ్రాట్యుటీ ₹3,411CR, లీవ్ ఎన్క్యాష్మెంటు ₹1800CR ఇవ్వాల్సి ఉండగా నిధుల అందుబాటును అనుసరించి విడుదల చేస్తున్నామంది. ఇప్పటికే PF కింద ₹1,848CR, GLI కింద ₹76CR, పోలీసుల సరెండర్ లీవులకు ₹223CR జమ చేశామని ఫైనాన్స్ విభాగం తెలిపింది.
Sorry, no posts matched your criteria.