India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వరల్డ్ లెజెండ్స్ ప్రొ T20 లీగ్లో అభిమన్యు మిథున్(రాజస్థాన్ లయన్స్) విధ్వంసం సృష్టించారు. పవన్ నేగీ(ఢిల్లీ వారియర్స్) వేసిన 20వ ఓవర్లో వరుసగా 4, 6, 6, 6, 4, 6 బాదారు. 7 బంతుల్లో 33 రన్స్(471.43 స్ట్రైక్ రేటు) చేశారు. మరో ప్లేయర్ మోర్గాన్ 87 రన్స్(10 సిక్సులు, 1 ఫోర్) బాదడంతో రాజస్థాన్ 185-7 స్కోర్ చేసింది. ఛేజింగ్లో ఢిల్లీ 162 పరుగులకే ఆలౌటైంది.

TG: కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న పెట్టుబడులన్నీ కట్టు కథలేనని జాగృతి చీఫ్ కవిత విమర్శించారు. ‘సింగపూర్ గేట్వే సంస్థకు వెబ్సైటూ లేదు. ₹70వేల CR పెట్టుబడి అన్న ఇన్ఫ్రా కీ డేటా సెంటర్ పార్క్ కంపెనీ USలో ₹90వేల CR, బ్రెజిల్లో ₹70వేల CRకు MOU చేసింది. గతేడాదే ఏర్పాటైన ఇది MOUల కోసమే పుట్టినట్లుంది. జయవీర్ రెడ్డి కంపెనీ నిజమైనదో కాదో చెప్పాలి. ₹10L లేని కంపెనీలు ₹వేలకోట్ల MOUలు చేశాయి’ అని అన్నారు.

బడ్జెట్లో గోల్డ్ బాండ్ల పన్ను మినహాయింపును కుదించారు. ఇకపై RBI ఈ బాండ్లను ఇష్యూ చేసినప్పుడే నేరుగా కొని మెచ్యూరిటీ వరకు ఉంచుకుంటేనే పన్ను ఉండదు. ఒకవేళ స్టాక్ మార్కెట్లో ఇతరుల దగ్గర కొనుగోలు చేస్తే మెచ్యూరిటీ సమయంలో వచ్చే లాభంపై కచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిందే. అలాగే మెచ్యూరిటీ కంటే ముందు అమ్మినా పన్ను తప్పదు. అయితే ఏటా వచ్చే 2.5% వడ్డీపై పాత పద్ధతిలోనే పన్ను వర్తిస్తుంది.

T20 WCలో భారత స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టాప్ స్కోరర్గా నిలుస్తాడని ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ జోస్యం చెప్పారు. అతడే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం T20 నంబర్ వన్ ర్యాంకర్గా ఉన్న అభిషేక్, తన మెరుపు బ్యాటింగ్తో భారత్ను విజేతగా నిలుపుతాడని పాంటింగ్ అభిప్రాయపడ్డారు. భారత్, శ్రీలంక వేదికలుగా FEB 7 నుంచి మొదలవనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు తలపడుతున్నాయి.

<

తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో సందకరి మూవీ 3 పురస్కారాలు గెలుచుకోవడం చర్చనీయాంశమైంది. 2020 సంవత్సరానికి గానూ ఉత్తమ చిత్రం సహా మరో 2 విభాగాల్లో అవార్డులు దక్కాయి. అయితే ఈ సినిమా అసలు థియేటర్లలోనే విడుదల కాలేదని, అలాంటప్పుడు అవార్డులు ఎలా ఇస్తారని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. థియేటర్స్లో రిలీజైన మూవీస్నే పరిగణనలోకి తీసుకోవాలన్న నిబంధనను అతిక్రమించారంటూ విమర్శిస్తున్నారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డాక్టర్ BR అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలను వాయిదా వేసింది. ఫిబ్రవరి 11న పోలింగ్ ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వాయిదా పడిన పరీక్షలు తిరిగి ఫిబ్రవరి 17 నుంచి మార్చి 10 వరకు జరుగుతాయి. హాల్టికెట్లను పరీక్షకు 3 రోజుల ముందు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ లేదా స్టడీ సెంటర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

AP: మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటి వద్ద భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. జోగి రోహిత్ వేసిన పిటిషన్పై కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. రమేశ్పై ఎలాంటి దాడులు జరిగినా పోలీసులదే బాధ్యత అని స్పష్టం చేసింది. కాగా ఇప్పటికే భద్రత కల్పించారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. కాగా జోగి రమేశ్ ఇంటిపై <<19023109>>దాడి ఘటనలో<<>> పోలీసులు 40 మందిపై కేసులు నమోదు చేశారు. నిందితుల్లో 11 మందిని అరెస్టు చేశారు.

కన్నతండ్రి జ్ఞాపకం కళ్లెదుటే ఉండాలని నల్గొండ జిల్లా కోతులారానికి చెందిన గౌరవతి, మమత తమ నాన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తమను కొడుకుల్లా పెంచి, కంటిపాపలా చూసుకున్న వీరమళ్ల నర్సింహ గతేడాది అనారోగ్యంతో మరణించారు. నవమాసాలు మోయకపోయినా, తమ జన్మకు కారణమైన నాన్నే దైవమని నమ్మిన ఆ కుమార్తెలు రూ.6 లక్షలతో విగ్రహాన్ని ఏర్పాటు చేసి తండ్రీకూతుళ్ల బంధానికి నిలువుటద్దంగా నిలిచారు.

లలితా దేవి కొలువులో సరస్వతీ దేవి తన వీణతో అమృతతుల్యమైన సంగీతాన్ని వినిపించగా, ముక్కోటి దేవతలు పరవశించిపోయారు. ఆ గానాన్ని మెచ్చిన లలితాంబిక ‘బాగుంది’ అని పలికింది. ఆ ఒక్క మాటలోని మాధుర్యం, తన వీణా స్వరాల కంటే మిన్నగా ఉందని గ్రహించిన సరస్వతి దేవి వినమ్రంగా తన వీణను పక్కన పెట్టేసింది. సాక్షాత్తు సంగీతానికి అధిదేవత అయిన సరస్వతి వీణ నాదాన్ని సైతం మించిపోయేంత కమ్మని కంఠస్వరం లలితా దేవిది.
Sorry, no posts matched your criteria.