News May 7, 2025

ఇక సెలవు.. ముగిసిన పోప్ అంత్యక్రియలు

image

రోమన్ క్యాథలిక్ క్రైస్తవుల మతాధిపతి పోప్ ఫ్రాన్సిస్(88) అంత్యక్రియలు ముగిశాయి. ఈనెల 21న ఆయన కన్నుమూయగా ఇవాళ వాటికన్ సిటీలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సుమారు 2.50 లక్షల మంది ఆయన భౌతికకాయాన్ని సందర్శించారు. అంత్యక్రియలకు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, US, ఫ్రాన్స్, ఉక్రెయిన్ అధ్యక్షులు ట్రంప్, మేక్రాన్, జెలెన్‌స్కీ, బ్రిటన్ ప్రిన్స్ విలియం వివిధ దేశాలకు చెందిన ప్రముఖ నేతలు హాజరయ్యారు.

News May 7, 2025

అన్ని రంగాల్లో పెరుగుతున్న మహిళల పాత్ర: మోదీ

image

దేశంలో అన్ని రంగాల్లో మహిళల పాత్ర పెరుగుతోందని ప్రధాని మోదీ కొనియాడారు. 15వ ఎడిషన్ రోజ్‌గార్ మేళాలో 51,000 మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించిన అనంతరం ఆయన ప్రసంగించారు. 90 లక్షల స్వయం సహాయక సంఘాల్లో 10 కోట్ల మంది మహిళలు చేరారని పేర్కొన్నారు. ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. అన్ని రంగాల్లో యువతకు ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు.

News May 7, 2025

అప్పుడు లోకల్ ట్రైన్లలో ప్రయాణించా: శ్రుతి హాసన్

image

తన తల్లిదండ్రులు కమల్ హాసన్, సారిక విడాకులు తనను ఎంతో బాధించాయని హీరోయిన్ శ్రుతి హాసన్ తెలిపారు. దీంతో అప్పటివరకు ఉన్న జీవితం ఒక్కసారిగా తలకిందులైందని చెప్పారు. ‘వారు విడిపోయాక నేను అమ్మతో చెన్నై నుంచి ముంబై వెళ్లిపోయా. అప్పటివరకు బెంజ్ కార్లలో తిరిగిన నేను లోకల్ ట్రైన్లలో ప్రయాణించా. ఇండస్ట్రీకి వచ్చాక నాన్నతో కలిసి ఉంటున్నా. సినిమాల్లో నాకంటూ గుర్తింపు తెచ్చుకున్నా’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

News May 7, 2025

వాటికన్ సిటీలోనూ ట్రంప్, జెలెన్‌స్కీ చర్చలు

image

పోప్ ఫ్రాన్సిస్ అంతిమ సంస్కారాలు వాటికన్ సిటీలో కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన US అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధినేత జెలెన్ స్కీ పోప్‌ పార్థివ‌దేహానికి నివాళి అర్పించారు. ఆ తర్వాత వారు అక్కడే చర్చలు జరిపినట్లు ఓ ఫొటో SMలో వైరలవుతోంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు ట్రంప్ శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదే అంశంపై వీరిద్దరు పలుమార్లు భేటీ అయ్యారు.

News May 7, 2025

ప్రజల ఆకాంక్షలు తీర్చడమే మా లక్ష్యం: రేవంత్ రెడ్డి

image

TG: రాష్ట్రంలోని రైతులకు రూ.20వేల కోట్ల రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వంపై ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారని భారత్ సమ్మిట్ కార్యక్రమంలో తెలిపారు. సమాజంలో అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేర్చడమే తమ లక్ష్యమని, అందుకోసం అనేక పథకాలు తీసుకొచ్చినట్లు చెప్పారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు వివరించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తదితర నేతలు పాల్గొన్నారు.

News May 7, 2025

IPLతో జియో హాట్‌స్టార్‌కు ఊహించని ఆదాయం?

image

ఐపీఎల్ 2025 ద్వారా జియో హాట్‌స్టార్ ఊహించని విధంగా భారీగా ఆర్జించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ యాప్ 100 మిలియన్ల పెయిడ్ యూజర్లను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో రూ.10,006 కోట్ల ఆదాయం ఆర్జించినట్లు సమాచారం. కాగా ఇటీవల జియో సినిమా, హాట్‌స్టార్ విలీనమైన విషయం తెలిసిందే. యూజర్లను ఆకట్టుకునేందుకు పలు ఆకర్షణీయ ప్యాక్‌లు అందిస్తోంది.

News May 7, 2025

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

image

TG: ప్రియుడితో కలిసి భార్య భర్తను చంపిన ఘటన రంగారెడ్డి(D) దన్నారంలో జరిగింది. ప్రవీణ్, ప్రమీల భార్యాభర్తలు. ప్రమీల ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి ప్రమీల భర్తకు ఉరేసి చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరించింది. అనుమానం వచ్చిన ప్రవీణ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

News May 7, 2025

కశ్మీర్‌లో ఉగ్రవాద రహస్య స్థావరాలు ధ్వంసం

image

జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మాచిల్‌లో ఉన్న ఉగ్రవాదుల రహస్య స్థావరాలపై భద్రతా బలగాలు దాడి చేశాయి. ఈ దాడుల్లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అర్ధరాత్రి నుంచి బోర్డర్‌లో కాల్పులకు తెగబడుతోంది. ఉరి, సుందర్‌బని, రాంపూర్ వద్ద కాల్పులకు పాల్పడింది. వీటికి భారత బలగాలు ధీటుగా బదులిస్తున్నాయి.

News May 7, 2025

14 మంది టెర్రరిస్టుల జాబితా విడుదల

image

పహల్గామ్ అటాక్‌కు సంబంధించి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు 14 మంది టెర్రరిస్టుల జాబితాను విడుదల చేశాయి. వీరు పాక్ ఆర్థిక సాయంతో జమ్మూకశ్మీర్‌లోనే ఉంటూ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిపాయి. 20-40 ఏళ్ల మధ్య వయసున్న వీరంతా హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ గ్రూపులకు చెందినవారని పేర్కొన్నాయి. ఇప్పటికే ముగ్గురు తీవ్రవాదుల స్కెచ్‌లను అధికారులు విడుదల చేసిన విషయం తెలిసిందే.

News May 7, 2025

TDPతోనే మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు: చంద్రబాబు

image

AP: TDP ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని మత్స్యకారుల దశదిశ మారిందని CM చంద్రబాబు అన్నారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తానని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెంలో ఆయన మాట్లాడారు. ‘వేట విరామ సమయంలో జాలర్లను ఆదుకునేందుకు కుటుంబానికి రూ.20 వేలు అందించాం. ఇందుకోసం రూ.258 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. గత ప్రభుత్వం మత్స్యకారుల సమస్యలు పరిష్కరించలేదు’ అని ఆయన విమర్శించారు.