News June 24, 2024

చరిత్ర పునరావృతమవుతుంది: కేటీఆర్

image

TG: అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి ఎప్పుడూ బలంగానే ఉంటుందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ <<13498328>>ఎమ్మెల్యేలు<<>> కాంగ్రెస్‌లో చేరడంపై X వేదికగా స్పందించారు. ‘2004-06లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేకసార్లు ఎమ్మెల్యేల ఫిరాయింపులను ఎదుర్కొన్నాం. ఆ తర్వాత తెలంగాణ ప్రజలు దీటుగా స్పందించారు. చివరికి కాంగ్రెస్ తల వంచాల్సి వచ్చింది. మరోసారి చరిత్ర పునరావృతమవుతుంది’ అని పేర్కొన్నారు.

News June 24, 2024

చంద్రన్న బీమా రూ.10లక్షలకు పెంపు

image

AP: చంద్రన్న బీమా పరిహారాన్ని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రకటించారు. త్వరలో పాత్రికేయులు, న్యాయవాదుల్ని కూడా ఈ బీమా కిందకు తీసుకొస్తామన్నారు. YCP ప్రభుత్వం పథకం పేరు మార్చడమే కాక ఎంతోమందికి పరిహారాన్ని ఆపిందని విమర్శించారు. కార్మికులు కార్మికశాఖలో రూ.15 కట్టి ఈ పథకంలో చేరొచ్చు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల పరిహారం అందుతుంది.

News June 24, 2024

నేటి నుంచి మరుగుదొడ్లపై సర్వే

image

TG: వ్యక్తిగత మరుగుదొడ్లపై సర్వే చేయించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో 100% మరుగుదొడ్లు ఉన్నాయా లేదా నిర్ధారించనుంది. లేని వారికి మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉత్తమ పంచాయతీలకు పురస్కారాల కోసం ప్రభుత్వం ఏటా మరుగుదొడ్లపై సమాచారం సేకరిస్తోంది. దీనిలో 100% ఉన్నట్లు గణాంకాలు నమోదవుతున్నాయి. మరోవైపు ప్రతి ఇంటికి మంచినీటి నల్లా కనెక్షన్‌‌పై సర్వే జరుగుతోంది.

News June 24, 2024

హజ్‌ యాత్రలో మృత్యుఘోష.. 1300 మంది మృతి!

image

ఈ ఏడాది హజ్ యాత్రలో దాదాపు 1300 మంది మరణించినట్లు తెలుస్తోంది. వీరిలో 130 మందికిపైగా భారతీయులు ఉన్నట్లు సమాచారం. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోలేక వీరంతా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువగా ఈజిప్టుకు చెందినవారే కావడం గమనార్హం. కాగా ఈసారి యాత్రలో 18లక్షల మంది పాల్గొన్నట్లు అంచనా. సౌదీ అరేబియాలో రికార్డు స్థాయిలో 51డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

News June 24, 2024

వారికి మాత్రమే రూ.2,500 ఆర్థికసాయం?

image

TG: ‘మహిళలకు రూ.2,500 ఆర్థికసాయం’ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పెన్షన్, ఎలాంటి ఆర్థిక సాయం పొందని మహిళలకు(కొత్త వారికి) మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారట. కొత్త రేషన్ కార్డుల జారీ తర్వాతే ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

News June 24, 2024

‘దిశ’ ఇక నుంచి Women Safety App

image

AP: మహిళల భద్రత కోసం జగన్ ప్రభుత్వం తెచ్చిన ‘దిశ’ యాప్ పేరును చంద్రబాబు ప్రభుత్వం Women Safety Appగా మార్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 2020 ఫిబ్రవరిలో దీన్ని ప్రారంభించగా, ఇప్పటివరకు 50 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. యువతులు, మహిళలు ఆపదలో ఉంటే ఈ యాప్‌లోని ఫీచర్లు పోలీసులు, కుటుంబసభ్యులకు తక్షణమే సమాచారం అందిస్తాయి.

News June 24, 2024

కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసిన విండీస్ బ్యాటర్లు

image

టీ20 వరల్డ్ కప్‌‌లో భాగంగా సౌతాఫ్రికాతో సూపర్‌8 మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 135/8కే పరిమితమైంది. రోస్టన్ చేజ్(52) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశారు. ఓపెనర్ కైల్ మేయర్స్(34బంతుల్లో 35 రన్స్) ఫరవాలేదనిపించారు. సఫారీ బౌలర్లలో షంసీ 3 వికెట్లు తీసి విండీస్ నడ్డి విరిచారు. జాన్‌సెన్, మార్క్‌రమ్, మహారాజ్, రబాడ ఒక్కో వికెట్ తీశారు.

News June 24, 2024

పదేళ్ల ‘ప్రతిపక్షనేత’ నిరీక్షణకు తెర

image

2014 నుంచి లోక్‌సభలో ప్రతిపక్షనేత లేరు. ఎందుకంటే ఆ హోదా పొందాలంటే ఏదైనా ఒక పార్టీ కనీసం 55 మంది ఎంపీలను కలిగి ఉండాలి. గత రెండు పర్యాయాల్లో బీజేపీ మినహా ఏ పార్టీ ఆ మార్క్ చేరుకోలేదు. ప్రతిపక్ష కాంగ్రెస్ 2014లో 44, 2019లో 52 ఎంపీ సీట్లు గెలిచింది. అందుకే అధికారికంగా ప్రతిపక్ష నేతను నియమించలేకపోయింది. ఈసారి 99 ఎంపీ సీట్లు గెలిచి పదేళ్ల తర్వాత ప్రతిపక్ష నేతను నియమించేందుకు సిద్ధమైంది.

News June 24, 2024

18వ లోక్‌సభ విశేషాలివే..

image

నేడు ప్రారంభమయ్యే 18వ లోక్‌సభ సమావేశాల్లో సగానికిపైగా కొత్త ఎంపీలు పాల్గొనబోతున్నారు. మొత్తం సభ్యుల్లో దాదాపు 52% అంటే 280 మంది కొత్తవారు ఎంపీలుగా సభలో అడుగుపెట్టనున్నారు. మిగిలిన వారిలో 216 మంది ఎంపీలు గత సభలో ఉన్నవారు కాగా మరికొందరు అంతకుముందు సభ్యులుగా ఎన్నికైనవారు. మొత్తం 41 పార్టీల నుంచి ఎంపీలున్నారు. సంఖ్యాపరంగా బీజేపీ(240), కాంగ్రెస్(99), సమాజ్ వాదీ పార్టీ(37) టాప్‌-3లో ఉన్నాయి.

News June 24, 2024

రాష్ట్రంలో నాలుగు రోజులు విస్తారంగా వర్షాలు

image

AP: రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం తేలికపాటి, మంగళ, బుధ, గురువారాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఇవాళ మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.