News June 24, 2024

గురుకులాలన్నీ ఒకేచోట.. నమూనాలను పరిశీలించిన సీఎం

image

TG: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలన్నీ ఒకేచోట ఉండే విధంగా నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌ నిర్మిస్తామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా తొలుత కొడంగల్, మధిరలో 20-25 ఎకరాల్లో వీటిని నిర్మిస్తామన్నారు. నిన్న ఆర్కిటెక్ట్‌లు రూపొందించిన పలు నమూనాలను సీఎం, డిప్యూటీ CM పరిశీలించారు. గురుకులాలన్నీ ఒకే చోట నిర్మించడం ద్వారా కుల, మత వివక్ష తొలగిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది.

News June 24, 2024

వారి రేషన్ కార్డులు, పెన్షన్లు కట్: మంత్రి

image

TG: అనర్హులు పొందుతున్న రేషన్ కార్డులు, పెన్షన్లను తొలగిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల్లో పేద కుటుంబాలకే ప్రథమ ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పారు. జులై 1 నుంచి ఆగస్టు చివరిలోపు అర్హత కలిగిన ప్రతి రైతుకూ రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని వివరించారు.

News June 24, 2024

నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా జూడాల సమ్మె

image

TG: నేటి నుంచి తెలంగాణ జూనియర్ డాక్టర్లు (జూడా)నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎమర్జెన్సీ మినహా ఓపీ, సర్జరీలు, వార్డ్ సేవలను నిలిపివేస్తున్నట్లు జూడా అసోసియేషన్ తెలిపింది. గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి ప్రతినెలా స్టైఫండ్ చెల్లింపు, సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకు రూ.1.25 లక్షల గౌరవ వేతనం వంటి డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే సమ్మెను ఉద్ధృతం చేస్తామని ప్రకటించింది.

News June 24, 2024

T20WC: ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకునేనా?

image

T20 WC సూపర్-8లో భాగంగా ఇవాళ భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. సెయింట్ లూసియాలోని డారెన్ సామీ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా గెలిస్తే సెమీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఆసీస్ ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. కాగా గతేడాది WTC ఫైనల్, ODI WC ఫైనల్‌లో భారత్‌ను ఆస్ట్రేలియా ఓడించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

News June 24, 2024

నేడు ఏపీ కేబినెట్ తొలి భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌, పింఛన్ల పెంపుపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విద్యుత్ ప్రాజెక్టులపై మంత్రులు సమాలోచనలు చేయనున్నారు. అలాగే సూపర్-6 పథకాల అమలుపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియపరిచేలా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవచ్చు.

News June 24, 2024

నేడు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల

image

తెలంగాణలో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు వెల్లడి కానున్నట్లు ఇంటర్ విద్యామండలి తెలిపింది. WAY2NEWSతో పాటు ప్రభుత్వ వెబ్‌సైట్లైన http://tgbie.cgg.gov.in, http://results.cgg.gov.inలలో ఫలితాలు చూసుకోవచ్చు. కాగా మే, జూన్‌లో జరిగిన సప్లిమెంటరీ పరీక్షలకు 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

News June 24, 2024

‘ఎన్టీఆర్ 31’లో అలియా భట్?

image

ఎన్టీఆర్ హీరోగా ‘ఎన్టీఆర్ 31’అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న మూవీలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా నటించనున్నట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్న ఈ మూవీలో బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నట్లు టాక్. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

News June 24, 2024

నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు

image

నేటి నుంచి పద్దెనిమిదో లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. రేపు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. తొలుత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణం చేయిస్తారు. అనంతరం కేబినెట్ మంత్రులు, స్వతంత్ర హోదా మంత్రులు, సహాయమంత్రులు ప్రమాణం పూర్తి చేస్తారు. ఆ తర్వాత సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

News June 24, 2024

Shocking: 14 ఏళ్లలో భూమితో గ్రహశకలం ఢీ?

image

మరో 14 ఏళ్లలో భూమిని ఓ ఆస్టరాయిడ్ ఢీకొట్టే ప్రమాదం ఉందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తమ తాజా నివేదికలో వెల్లడించింది. 2038 జులై 12న గ్రహశకలం భూమిని ఢీకొట్టేందుకు 72శాతం అవకాశాలున్నాయని స్పష్టం చేసింది. మేరీల్యాండ్‌లోని జాన్స్ హాప్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ లాబొరేటరీ చేసిన పరిశోధనల్లో ఈమేరకు తేలిందని పేర్కొంది. మరిన్ని అధ్యయనాల అనంతరం దాని దిశ ఎలా మార్చాలన్న దానిపై కృషి చేస్తామని వివరించింది.

News June 24, 2024

T20WC: పడి లేచిన కెరటం ఇంగ్లండ్..!

image

టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ జర్నీ పడుతూ లేస్తూ కొనసాగుతోంది. లీగ్ స్టేజీలోనే దాదాపు ఎలిమినేట్ అయ్యే దశకు ఆ జట్టు చేరుకుంది. మరో 15 నిమిషాలు వర్షం కురిసుంటే ఇంగ్లండ్ అప్పుడే టోర్నీ నుంచి నిష్క్రమించేది. చివరకు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో నమీబియాపై గెలిచింది. సూపర్-8కు చివరగా అర్హత సాధించింది ఇంగ్లండ్ జట్టే. అలాగే సెమీఫైనల్‌కు అర్హత సాధించిన తొలి జట్టు కూడా ఇదే.