India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: తమిళనాడులో కల్తీ సారా తాగి 38మంది మరణించిన ఘటనపై మాజీ మంత్రి KTR స్పందించారు. రాష్ట్రంలో అలాంటి ఘటనలు జరగవని ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం చీప్ లిక్కర్ బ్రాండ్లను తీసుకొచ్చి ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టదని భావిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. మరోవైపు కల్తీ సారా ఘటన తమిళనాడు అసెంబ్లీని కుదిపేసింది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ సభలో అన్నాడీఎంకే సభ్యులు ఆందోళనకు దిగారు.
విదేశాల్లోని భారతీయులు పెద్ద మొత్తంలో NRI డిపాజిట్ స్కీమ్స్లో మదుపు చేస్తున్నారు. ఏప్రిల్లో $1.08 బిలియన్లు డిపాజిట్ కావడంతో ఆ మొత్తం $152 బిలియన్లకు చేరినట్లు RBI వెల్లడించింది. ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ (బ్యాంక్స్)లో $26 బిలియన్లు, నాన్ రెసిడెంట్ ఎక్స్టెర్నల్ రూపీ అకౌంట్లో $99 బిలియన్లు, నాన్ రెసిడెంట్ ఆర్డినరీ డిపాజిట్ స్కీమ్స్లో $27 బిలియన్లు వెచ్చించినట్లు తెలిపింది.
AP: అటవీ సంపద పరిరక్షణ కోసం ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. మడ అడవుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, వాటిని ధ్వంసం చేసే వారిని ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. అటు ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం కాకుండా పక్కాగా పరిరక్షించాలన్నారు. గ్రామాల్లో మరింత విస్తృతంగా అభివృద్ధి జరిగేలా ఈ పథకం వినియోగించుకోవాలని సూచించారు.
UGC నెట్ పశ్నపత్రం లీకైనట్లు గుర్తించిన కేంద్రం పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం పరీక్ష జరగ్గా సోమవారమే క్వశ్చన్ పేపర్లు డార్క్వెబ్లో ప్రత్యక్షమయ్యాయి. ఒక్కో పేపర్ను రూ.5లక్షల నుంచి రూ.6లక్షలకు బేరానికి పెట్టారు. దీన్ని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ గుర్తించి కేంద్ర విద్యాశాఖను అలెర్ట్ చేసింది. అసలు ప్రశ్నపత్రాలతో అవి సరిపోలడంతో పరీక్షను రద్దు చేశారు.
TG: గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సీతక్క తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల విద్యార్థుల దుస్తులు మహిళా సంఘాలే సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఆగస్టు 15నాటికి విద్యార్థులకు రెండో జత స్కూల్ యూనిఫాంలు పంపిణీ చేస్తామని ఆమె వెల్లడించారు. అటు రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న మహిళాశక్తి క్యాంటీన్లు సైతం స్వయం సహాయక సంఘాలే నిర్వహిస్తాయని మంత్రి అన్నారు.
AP: రాష్ట్రంలో దివ్యాంగులకు రిజర్వ్ చేసిన బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులను మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఆదేశించారు. జిల్లా స్థాయి దివ్యాంగ కమిటీలు 3 నెలలకోసారి నిర్వహించాలన్నారు. ప్రభుత్వ సంస్థల్లోని ఉద్యోగాల్లో 4%, ఉన్నత విద్యాసంస్థల్లో 5% సీట్లు వారికి కేటాయిస్తున్నారా? లేదా వివరాలను సేకరించాలన్నారు. హిజ్రాల జీవనోపాధికి స్వయం సహాయక బృందాల ఏర్పాటును ప్రోత్సహించాలన్నారు.
AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేడ్కర్ కొనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో వానలు పడొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
తెలంగాణలో నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని TJS అధ్యక్షుడు ప్రొ.కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు. ‘NCERT ముద్రించిన పాఠ్య పుస్తకాలకు బదులు సొంత పుస్తకాలను ముద్రించి విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లు విక్రయిస్తున్నాయి. ఆయా స్కూళ్ల గుర్తింపు రద్దు చేయవచ్చు. సొంత పుస్తకాలను రూ.10వేల నుంచి రూ.15వేలకు బలవంతంగా విద్యార్థులకు విక్రయిస్తున్నాయి’ అని విద్యాశాఖకు ఆయన లేఖ రాశారు.
AP: ‘జనసేన పార్టీ పెట్టి పదేళ్లు. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయావ్. ప్రజలు నిన్ను నమ్మలేదు. అసెంబ్లీ గేటు కూడా తాకలేవు’ ఇలా వాగిన నోళ్లన్నీ మూతబడేలా పవన్ కళ్యాణ్ గ్రాండ్ విక్టరీ కొట్టారు. పార్టీ పోటీ చేసిన 21 చోట్లా గెలిచి రికార్డు సృష్టించారు. డిప్యూటీ సీఎం హోదాలో CM తర్వాత నేడు అసెంబ్లీలో MLAగా ప్రమాణం చేయనున్నారు. ఈ క్షణం కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నామంటూ జనసైనికులు ఎమోషనల్ అవుతున్నారు.
TG: రాష్ట్రంలో SC, ST, BC వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 16 కార్పొరేషన్లు, బోర్డుల కార్యకలాపాల ప్రారంభానికి కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం వివిధ కార్పొరేషన్లలో పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులను కొత్తవాటిలో సర్దుబాటు చేసి, మిగిలిన పోస్టుల్లో సుమారు 300 కొత్త ఉద్యోగాల మంజూరుకు ప్రభుత్వానికి సంక్షేమ శాఖలు ప్రతిపాదనలు పంపనున్నాయి. బడ్జెట్ సమావేశాల్లోగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని చూస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.