News January 11, 2025

అక్రమ వలసదారుల వెనుక రాజకీయ కోణం

image

మ‌హారాష్ట్ర‌లో అక్ర‌మంగా నివ‌సిస్తున్న బంగ్లాదేశ్‌, రోహింగ్యాల వెనుక ఉన్న డాక్యుమెంట్ల ఫోర్జరీ సిండికేట్‌కు రాజ‌కీయ నేత‌లు, అధికారులు, NGOలతో లింకులు ఉన్న‌ట్టు సిట్ ద‌ర్యాప్తులో వెల్లడైంది. అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌కు ధ్రువ‌ప‌త్రాలు మంజూరు చేసి వారిని ఎన్నికల్లో ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న‌ట్టు వెలుగులోకొచ్చింది. పాస్‌పోర్టులు కూడా పొందుతున్న‌ట్టు తేలింది. ఈ విష‌య‌మై సిట్ ద‌ర్యాప్తు ముమ్మరం చేసింది.

News January 11, 2025

దారుణం: అథ్లెట్‌పై 60మంది లైంగిక వేధింపులు

image

కేరళలో దారుణ ఘటన జరిగింది. అథ్లెట్‌గా ఉన్న ఓ బాలిక(18)పై ఐదేళ్ల పాటు 60మందికి పైగా మృగాళ్లు లైంగిక అకృత్యాలకు పాల్పడ్డారు. శిశు సంక్షేమ కమిటీ ముందు ఆమె తాజాగా తన గోడును వెళ్లబోసుకోవడంతో విషయం వెలుగుచూసింది. తనకు 13 ఏళ్ల వయసున్నప్పటి నుంచీ ఇరుగు పొరుగు వ్యక్తులు, కోచ్‌లు, తోటి అథ్లెట్లు లైంగికంగా వేధించారని ఆమె ఫిర్యాదు చేసింది. 40మందిపై పోక్సో కేసులు నమోదు చేసిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు.

News January 11, 2025

టీమ్ ఇండియాలో చిన్న ఆటగాళ్లను మాత్రమే తప్పిస్తారు: మంజ్రేకర్

image

టీమ్ ఇండియా సెలక్షన్ విధానాలపై వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ విమర్శలు గుప్పించారు. ‘మన స్టార్ క్రికెటర్లను ఫామ్ లేకపోయినా తప్పించరు. చిన్న ఆటగాళ్లను మాత్రం నిర్దాక్షిణ్యంగా తప్పిస్తారు. ఒకవేళ పెద్ద ఆటగాళ్లను తప్పించినా, ఆ విషయానికి తేనెపూసి గాయమనో, ఆటగాడే తప్పుకున్నాడనో చెబుతారు. ఇది తప్పుడు సందేశాన్ని ఇస్తుంది. సూపర్ స్టార్ కల్చర్‌కి దారి తీస్తుంది. సెలక్టర్లు కఠినంగా వ్యవహరించాలి’ అని పేర్కొన్నారు.

News January 11, 2025

అందుకే టికెట్ ధరల సవరణ: TGSRTC

image

పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిపే స్పెషల్ బస్సులకు కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరలను సవరించినట్లు TGSRTC తెలిపింది. 2003లో ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 16 ప్రకారమే కేవలం 5 రోజులపాటు ధరలను సవరించినట్లు పేర్కొంది. తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల రద్దీ లేకపోయినా బస్సులను వెంటనే వెనక్కి రప్పిస్తున్నట్లు వివరించింది. సంక్రాంతి స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను <<15112625>>50% పెంచిన<<>> సంగతి తెలిసిందే.

News January 11, 2025

ఫిబ్రవరి 15 నుంచి 28లోపు అమల్లోకి భూ భారతి చట్టం: మంత్రి

image

TG: భూ భారతి చట్టం కోసం చాలా కష్టపడ్డామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 15 నుంచి 28వ తేదీ లోపు ఈ చట్టం పూర్తిగా అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా దీనిని అమలు చేస్తామని చెప్పారు. ధరణి ద్వారా ఆక్రమించిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని, ధరణిని వాడుకుని తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

News January 11, 2025

రోహిత్ శర్మ మరో 134 రన్స్ చేస్తే..

image

ODIల్లో రోహిత్ శర్మ మరో 134 రన్స్ చేస్తే అత్యంత వేగంగా 11వేల పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలవనున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (222 ఇన్నింగ్స్‌లు), సచిన్ (276 ఇన్నింగ్స్‌లు) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. రోహిత్ ఇప్పటివరకు 257 ఇన్నింగ్స్‌లలో 10,866 రన్స్ చేశారు. నెక్స్ట్ 19 ఇన్నింగ్స్‌లలో 134 పరుగులు చేసి ఈ మైలురాయిని చేరుకుంటే సచిన్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలుస్తారు.

News January 11, 2025

NEET రద్దు: పాలకులపై మండిపడ్డ యాక్టర్ విజయ్

image

ప్రస్తుత పాలకులు ఇంకెంతకాలం ప్రజలను మోసగిస్తారంటూ DMKపై TVK అధినేత, యాక్టర్ విజయ్ మండిపడ్డారు. ‘అధికారంలోకి వస్తే నీట్ ఎగ్జామ్‌ను రద్దు చేస్తామని 2021 ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. రద్దు చేయించే సీక్రెట్ తెలుసని ఊదరగొట్టారు. ఇప్పుడేమో నీట్‌ను రద్దుచేసే అధికారం కేంద్రానిదే అంటున్నారు. దీనికోసమే మీకు ఓటేసిన వారిని ఇది మోసం చేసినట్టు కాదా’ అని ప్రశ్నించారు. తమిళంలో ఓ పాట లిరిక్స్‌ను షేర్ చేశారు.

News January 11, 2025

ముంబైలో ఒంటరిగానే పోటీ: సంజయ్ రౌత్

image

మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో శివసేన (UBT) ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ముంబై, నాగపూర్ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులు ఉండవని పేర్కొన్నారు. ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే బరిలో దిగుతుంది. దీంతో ఇండియా కూటమి భవిష్యత్తు చర్చనీయాంశంగా మారింది.

News January 11, 2025

భారత T20 జట్టు సెలక్షన్‌పై రేపు మీటింగ్

image

ఇంగ్లండ్‌తో స్వదేశంలో T20 సిరీస్‌కు టీమ్‌ఇండియాను ఎంపిక చేసేందుకు రేపు ముంబైలో సెలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో టీ20 జట్టును మాత్రమే ఎంపిక చేస్తారని వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ జట్ల ఎంపికలపై ప్రస్తావన ఉండదని క్రికెట్ వర్గాలు తెలిపాయి. సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలో జట్టులో యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 2 వరకు ఇంగ్లండ్‌తో భారత్ 5 T20లు ఆడనుంది.

News January 11, 2025

జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు: పొంగులేటి

image

TG: రాష్ట్రంలో జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామని చెప్పారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, నియోజకవర్గానికి 3,500 చొప్పున కేటాయిస్తామని వివరించారు. ఈ నెల నుంచే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.