India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాష్ట్రంలో శాంతి భద్రతలను పటిష్ఠం చేస్తామని హోం మంత్రి అనిత అన్నారు. దిశ పోలీస్ స్టేషన్ల పేరు మారుస్తామని వెల్లడించారు. వైసీపీ బ్లడ్ ఉన్న పోలీసులు పక్కకు తప్పుకోవాలని.. ప్రజలకు అనుకూలంగా సిబ్బంది పని చేయాలని సూచించారు. సోషల్ మీడియాలో మనోభావాలు దెబ్బతీసేలా పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వంలో అక్రమ కేసులపై విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు.
స్పేస్ఎక్స్ సహా రోదసి సంస్థలు భూమి చుట్టూ వేలాది ఉపగ్రహాల గొలుసును ఏర్పాటు చేస్తున్నాయి. భూమి దిగువ కక్ష్యలో తిరిగే ఇవి నాలుగైదేళ్లు పనిచేసి ఆ తర్వాత వాతావరణంలోకి ప్రవేశించి మండిపోతాయి. అలా మండే క్రమంలో వేల కొద్దీ టన్నుల్లో అల్యూమినియం ఆక్సైడ్ను విడుదల చేస్తాయి. అది ఓజోన్ పొరకు పెను ప్రమాదమంటున్నారు అమెరికా పరిశోధకులు. పొరను అది భారీగా కరిగించేస్తుందని తమ అధ్యయనం ద్వారా హెచ్చరించారు.
AP: వరల్డ్ ఓషియానిక్ రోలర్ స్కేటింగ్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన క్రీడాకారిణి జెస్సీరాజ్కి మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలియజేశారు. మన విజయవాడకు చెందిన బాలిక ప్రపంచ స్థాయిలో భారత కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింపజేయడం గర్వకారణమన్నారు. ఇలాంటి ప్రతిభగల క్రీడాకారులకు తమ ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని పేర్కొన్నారు.
అస్సాంలో వరదలకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 30 దాటింది. మంగళవారం రాత్రి గైనచోరా గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో ఐదుగురు మృతిచెందారు. రెమాల్ తుఫాను కారణంగా గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు 470 గ్రామాలు నీటమునిగాయి. 15 జిల్లాల్లోని 1.61లక్షల మందిపై వరదల ప్రభావం పడింది. రిలీఫ్ క్యాంపుల్లో 5114 మంది తలదాచుకున్నారని, సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
TG: రాష్ట్రంపై ఉన్న అప్పులను తిరిగి చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం రోజుకు రూ.196 కోట్లు ఖర్చు చేస్తోంది. గత ప్రభుత్వం తీసుకున్న రుణాలను చెల్లించేందుకు రేవంత్ సర్కార్ గత 6 నెలల్లో రూ. 25వేల కోట్లు అప్పుగా తీసుకుంది. తద్వారా రూ. 38,000 కోట్ల రుణాలను తిరిగి చెల్లించగలిగింది. అన్ని నిధులను రుణాలు & అభివృద్ధి కార్యక్రమాలకు తిరిగి చెల్లించడానికి వినియోగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
AP: ఈ నెల 24న ఉదయం పదింటికి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొత్త సర్కారు తొలి కేబినెట్ భేటీ జరగనుంది. భేటీలో చర్చించాల్సిన అంశాలపై ఈ నెల 21న సాయంత్రం 4గంటల్లోగా ప్రతిపాదనలు పంపించాలని ప్రభుత్వ శాఖలకు సీఎంఓ ఆదేశాలు జారీ చేసింది. సీఎం సంతకం చేసిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, డీఎస్సీ పోస్టుల భర్తీ, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు వంటి పలు నిర్ణయాలను ఈ సందర్భంగా ఆమోదించనున్నారు.
హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో జగన్ ఆస్తుల కేసుల విచారణ వాయిదా పడింది. న్యాయమూర్తి సెలవులో ఉండటంతో విచారణ రేపటికి వాయిదా వేశారు. గతంలో సీఎంగా ఉండటంతో విచారణలో వాయిదాలు కోరుతూ వచ్చిన జగన్ ఇప్పుడు విచారణకు హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.
శిథిలమైపోయిన విశ్వవిద్యాలయానికి పూర్వవైభవం తేవాలని నలందా యూనివర్సిటీ యాక్ట్ పేరుతో 2010లో నాటి కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. 2014లో 14 మంది విద్యార్థులతో ఈ యూనివర్సిటీ కార్యకలాపాలు మొదలయ్యాయి. 2017లో కొత్త క్యాంపస్ నిర్మాణం ప్రారంభమైంది. 455 ఏకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్ను సోలార్ ప్లాంట్, వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్ మొదలైనవి ఏర్పాటు చేసి పర్యావరణ హితంగా తీర్చిదిద్దారు.
AP: ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసిన ఫర్నీచర్, ఎలక్ట్రికల్ వస్తువులు వెంటనే తమకు అప్పగించాలని జగన్కు సాధారణ పరిపాలన శాఖ(GAD) లేఖ రాసింది. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రభుత్వ నిధులతో ఫర్నీచర్ సహా పలు వస్తువులను తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం కోసం కొనుగోలు చేయించారు. పదవి నుంచి దిగిపోయిన తర్వాత వాటిని ప్రభుత్వానికి ఇంకా సరెండర్ చేయకపోవడంతో GAD రంగంలోకి దిగి అప్పగించాలని కోరింది.
AP: ప్రొటెం స్పీకర్గా రేపు తాను బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. ‘ఎవరైనా సీనియర్లు ఉంటే చూడమని పార్టీ పెద్దలను అడిగా. ఏడోసారి ఎమ్మెల్యేగా ఉన్నందున నన్నే కొనసాగమని కోరారు. రాష్ట్రంలో ఐదేళ్లుగా విధ్వంసమైన వ్యవస్థను గాడిలో పెట్టడమే మా ప్రభుత్వం ముందున్న లక్ష్యం. ఆ దిశగా ముందుకెళ్తాం’ అని ఆయన వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.