News January 9, 2025

వైకుంఠ ఏకాదశికి సర్వాంగ సుందరంగా తిరుమల

image

AP: పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రేపటి నుంచి మొదలుకానున్న నేపథ్యంలో భూలోక వైకుంఠం తిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విద్యుత్కాంతుల ధగధగల మధ్య శ్రీవారి క్షేత్రం మెరిసిపోతోంది. స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తజన గోవింద నామ స్మరణతో ఏడుకొండలు మారుమోగుతున్నాయి. రేపు వైష్ణవ క్షేత్రాల్లో శ్రీమన్నారాయణుడి వైకుంఠ ద్వార దర్శనం ముక్తిని ప్రసాదిస్తుందనేది భక్తుల విశ్వాసం.

News January 9, 2025

రేపు ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్.. వారికి పోలీసుల సూచనలు

image

TG: ‘పుష్ప-2’ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో HYDలో ‘గేమ్ ఛేంజర్’ ప్రదర్శించే థియేటర్లపై పోలీసులు స్పెషల్ ఫోకస్ చేశారు. రేపు ఆ సినిమా విడుదల సందర్భంగా నిబంధనలు పాటించాలని యజమానులను సూచించారు. థియేటర్ల వద్ద హడావుడి ఉండొద్దని, టికెట్ ఉన్న ప్రేక్షకులనే లోపలికి అనుమతించాలని స్పష్టం చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.

News January 9, 2025

చర్చలు సఫలం.. యథావిధిగా ఆరోగ్య శ్రీ సేవలు

image

తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఆస్పత్రులకు ఏడాది కాలంలో ప్రభుత్వం రూ.1100 కోట్లు చెల్లించిందని, గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ.730 కోట్లనూ చెల్లించినట్లు ప్రస్తుత ప్రభుత్వం వెల్లడించింది. అలాగే 2013 నుంచి పెండింగ్‌లో ఉన్న ప్యాకేజీల రేట్లనూ 22శాతం పెంచామని గుర్తు చేసింది.

News January 9, 2025

26 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన SCR

image

సంక్రాంతి రద్దీ దృష్ట్యా మరో 26 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. చర్లపల్లి-విశాఖ మధ్య ఈ నెల 11, 12, 13, 16, 17, 18 తేదీల్లో జన్‌సాధారణ్ రైలు(అన్నీ జనరల్ బోగీలు) నడుపుతున్నట్లు ప్రకటించింది. అలాగే విశాఖ-చర్లపల్లి మధ్య 10, 11, 12, 15, 16, 17 మధ్య కూడా ఇలాంటి రైళ్లే తిరగనున్నాయి. కేవలం స్టేషన్‌లో టికెట్ తీసుకుని ఈ రైళ్లు ఎక్కేయవచ్చు.

News January 9, 2025

గంభీర్‌పై తివారీ విమర్శలు.. మద్దతుగా నిలిచిన ఆటగాళ్లు

image

గంభీర్ స్వార్థపరుడంటూ KKR మాజీ ఆటగాడు మనోజ్ తివారీ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై క్రికెటర్లు నితీశ్ రాణా, హర్షిత్ రాణా స్పందించారు. ఇద్దరూ తమ ఇన్‌స్టాలో గంభీర్‌కు మద్దతుగా పోస్ట్ చేశారు. ‘విమర్శలనేవి వ్యక్తిగత అభద్రత వల్ల కాక నిజానిజాల ఆధారంగా ఉండాలి. నేను కలిసినవారిలో అత్యంత నిస్వార్థపరుడు గౌతీ భయ్యా’ అని నితీశ్ పేర్కొనగా గంభీర్ ఆటగాళ్లకు అండగా నిలిచి వారిని వెలుగులోకి తెస్తారని హర్షిత్ పేర్కొన్నారు.

News January 9, 2025

14న ఢిల్లీకి సీఎం రేవంత్.. అక్కడి నుంచే విదేశాలకు

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 14న సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. 15న ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 16న కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. 17న ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్లనున్న ఆయన రెండు రోజులు అక్కడ పర్యటిస్తారు. 19న సింగపూర్ నుంచి దావోస్‌కు వెళ్లి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు హాజరవుతారు. ఇదే పర్యటనలో ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉండగా రద్దయ్యింది.

News January 9, 2025

BREAKING: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం

image

TG: గ్రామస్థాయి ఉద్యోగులకు జీతాలు క్రమం తప్పకుండా చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రీన్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు జీతాలు చెల్లించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలతో పాటు గ్రామస్థాయి ఉద్యోగులకు సైతం ఆలస్యం లేకుండా చెల్లించాలని స్పష్టం చేశారు. ఇటీవల గ్రామస్థాయి ఉద్యోగులకు జీతాలు ఆలస్యం అవుతున్న ఘటనల నేపథ్యంలో సీఎం తాజా ఆదేశాలు జారీ చేశారు.

News January 9, 2025

‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ టికెట్ ధరల పెంపు

image

AP: విక్టరీ వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ టికెట్ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర అదనంగా రూ.125 పెంచుకునేందుకు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అదనంగా రూ.100 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. సినిమా రిలీజయ్యే ఈ నెల 14న 6 షోల నిర్వహణకు అనుమతిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 14 నుంచి 23 వరకు అదనపు ధరల వసూలుకు పర్మిషన్ ఇచ్చింది.

News January 9, 2025

TCS షేర్ల‌కు రూ.76 డివిడెండ్‌

image

Q3లో TCS నిక‌ర లాభం 12% పెరిగి ₹12,380 కోట్లుగా న‌మోదైంది. గ‌త ఏడాది ఇదే Dec క్వార్ట‌ర్‌లో లాభం ₹11,058 కోట్లుగా ఉంది. తాజా ఫలితాల వెల్ల‌డి నేప‌థ్యంలో ఒక్కో షేరుకు ₹10 మ‌ధ్యంత‌ర డివిడెండ్‌తోపాటు ₹66 స్పెష‌ల్ డివిడెండ్ చెల్లించ‌నున్న‌ట్టు సంస్థ ప్ర‌క‌టించింది. జనవరి 17ను రికార్డు డేట్‌గా ప్రకటించింది. ఫిబ్రవరి 3న డివిడెండ్ చెల్లించనుంది. ఫలితాల ప్రకటన నేపథ్యంలో గురువారం షేరు ధర 1.57% పతనమైంది.

News January 9, 2025

దిగ్గజ గాయకుడు జయచంద్రన్ మృతి

image

మలయాళ దిగ్గజ గాయకుడు పి జయచంద్రన్(80) ఈరోజు కన్నుమూశారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబీకులు తెలిపారు. ఆరు దశాబ్దాలకు పైగా మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 16వేలకు పైగా పాటలు పాడారు. ఉత్తమ గాయకుడిగా జాతీయ పురస్కారం పొందిన జయచంద్రన్‌కు 5సార్లు కేరళ రాష్ట్ర పురస్కారం, తమిళనాడు నుంచి కలైమామణి అవార్డుతో పాటు నాలుగు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు లభించాయి.