India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రియాంకా గాంధీ తొలిసారి ఎన్నికల బరిలో నిలవనున్నారు. <<13459064>>వయనాడ్<<>> ఉపఎన్నికలో ఎంపీగా పోటీ చేయనున్నారు. ఆమె 2004 UP పార్లమెంట్, 2007 అసెంబ్లీ ఎన్నికల్లో రాయ్బరేలీ, అమేథీలో మాత్రమే ప్రచారం చేశారు. 2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. AICC జనరల్ సెక్రటరీగా నియమితులై యూపీ ఎన్నికల ఇన్ఛార్జ్గా పనిచేశారు. అప్పటి నుంచి దేశంలో ఎన్నికలు జరిగిన ప్రతి రాష్ట్రంలో ఆమె ప్రచారం నిర్వహిస్తున్నారు.
TG: డీఎస్సీకి ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ ప్రకటించడం గందరగోళానికి దారి తీస్తోంది. టెట్ ఫీజు భారీగా పెంచడంతో డీఎస్సీకి ఫ్రీగా అప్లై చేసుకునేందుకు అవకాశం ఇస్తామని అధికారులు గతంలోనే చెప్పారు. అయితే ఈ నెల 12 నుంచి DSC అప్లికేషన్లు ప్రారంభం కాగా, ఈ నెల 15వ తేదీ రాత్రి నుంచి సైట్లో మార్పులు చేసి, ఉచితానికి అవకాశం ఇచ్చారు. ఇప్పటికే రూ.1,000 ఫీజు చెల్లించిన వారు రీఫండ్ చేయాలని కోరుతున్నారు.
అమర్నాథ్ యాత్రకు వచ్చే యాత్రికుల కోసం హెలికాప్టర్ సౌకర్యం ప్రారంభమైంది. అమర్నాథ్ ఆలయం బోర్డ్కు చెందిన వెబ్సైట్ <
AP: కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకతో ఢిల్లీలోని వారి నివాసంలో సమావేశమైనట్లు APCC చీఫ్ షర్మిల తెలిపారు. ‘రాష్ట్ర కాంగ్రెస్ భవిష్యత్ ప్రణాళికలు, తదుపరి కార్యాచరణపై నిర్మాణాత్మకమైన చర్చ జరిగింది. రాబోయే రోజుల్లో ఏపీలో కాంగ్రెస్ పునర్వైభవం సాధించడమే కాదు బలీయమైన శక్తిగా అవతరిస్తుంది’ అని Xలో పేర్కొన్నారు. ‘ప్రేమ, సంరక్షణ, ప్రేరణ’ అంటూ వారితో దిగిన ఫొటోతో లవ్ సింబల్ షేర్ చేశారు.
‘కల్కి’ సినిమాలోని భైరవ ఆంథమ్ సాంగ్ షూటింగ్ సమయంలో డార్లింగ్ ప్రభాస్ తన కజిన్స్ ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తిలతో కలిసి సందడి చేశారు. వారితో కలిసి బల్లె బల్లె స్టెప్పులేశారు. ప్రముఖ సింగర్ దిల్జీత్ దోసాంజ్కు వారిని పరిచయం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. భైరవ ఆంథమ్’ ఫుల్ వీడియో సాంగ్ ఈరోజు రిలీజవడంతో షూటింగ్ పిక్స్ బయటకొచ్చాయి.
ఉత్తరకొరియా అధినేత కిమ్ ఆహ్వానం మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నెల 18-19 తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నారు. ఒకవైపు ఉక్రెయిన్తో రష్యా యుద్ధం, మరోవైపు దక్షిణ కొరియా-ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ దేశానికి పుతిన్ వెళ్లడం 24 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. గత ఏడాది సెప్టెంబర్లో కిమ్ రష్యాలో పర్యటించిన విషయం తెలిసిందే.
గత ఏడాది కశ్మీర్లో ఉగ్రవాదులతో పోరులో కల్నల్ మన్ప్రీత్ వీరమరణం పొందారు. ఆ విషయం తెలియని కొడుకు కబీర్(7) ఇప్పటికీ తండ్రి నంబర్కు ‘పాపా.. ఓసారి తిరిగి రండి. తర్వాత డ్యూటీ చేసుకోవచ్చు’ అని మెసేజ్లు పంపుతున్నట్లు తల్లి జగ్మీత్ వెల్లడించారు. ‘ఆయన సొంతూరు(మొహాలీ)లో పిల్లలు కబీర్, వాణి పేరిట మొక్కలు నాటారు. 10ఏళ్ల తర్వాత వాటిని చూడటానికి వస్తామన్నారు. కానీ ఇలా జరిగింది’ అని ఆవేదన చెందారు.
ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చన్న టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ వ్యాఖ్యలను కేంద్ర మాజీమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తప్పుపట్టారు. EVM ఓట్లను లెక్కించి, భద్రపరిచే యంత్రం మాత్రమే అని, హ్యాక్ చేసేంత ఆధునాతన మెషీన్లు కావన్నారు. ఈవీఎంల గురించి మస్క్ తప్పుగా అర్ధం చేసుకున్నారని తెలిపారు. ప్రపంచంలోని ఏ ఎలక్ట్రానిక్ ఉత్పత్తి పూర్తి సెక్యూర్ కాదని, టెస్లా కార్లు సైతం హ్యాకింగ్కు గురవుతాయని చెప్పొచ్చని అన్నారు.
కాంగ్రెస్&SPకి చెందిన 136 మంది MPల ప్రమాణస్వీకారం ప్రశ్నార్థకంగా మారింది. ప్రచారంలో గ్యారంటీల పేరుతో వారు ఓటర్ల నుంచి వివరాలు సేకరించారని, అది ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం లంచం కిందకి వస్తుందని ఇప్పటికే రాష్ట్రపతి వద్ద అభ్యర్థన దాఖలైంది. వారిపై అనర్హత వేటు వేయాలనే ఆ అభ్యర్థనపై ఆమె న్యాయ అభిప్రాయం కోరారు. పార్లమెంట్ సమావేశాలు ముంగిట వేళ రాష్ట్రపతి తీసుకోబోయే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్పై టిప్స్ పేరుతో ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో వచ్చే ఛానల్స్పై అప్రమత్తంగా ఉండాలని NSE హెచ్చరించింది. “ఇన్స్టాలో ‘bse_nse_latest’, టెలిగ్రామ్లోని ‘భారత్ ట్రేడింగ్ యాత్ర’, ‘VR టెక్నికల్స్’ హ్యాండిళ్లకు దూరంగా ఉండండి. ‘డా.స్టాక్ మార్కెట్ కంపెనీ’ అనే గ్రూప్ను ఫాలో కావొద్దు. పెట్టుబడుల పేరుతో వీరు లాగిన్ ఐడీ, పాస్వర్డ్లు సేకరిస్తున్నారు” అని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.