News January 10, 2025

తిరుపతి ఘటన.. టీటీడీ జేఈవో బదిలీ

image

తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యుల్ని చేస్తూ టీటీడీ జేఈవో గౌతమిని ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేసింది. ఆమెను సాధారణ పరిపాలనశాఖలో రిపోర్ట్ చేయాలంటూ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. ఘటన నేపథ్యంలో ఇవాళ రివ్యూ నిర్వహించిన సీఎం చంద్రబాబు.. ఎస్పీ సుబ్బరాయుడు, గౌతమి, సీవీఎస్వో శ్రీధర్‌ను వెంటనే బదిలీ చేయాలని <<15108745>>ఆదేశించిన<<>> విషయం తెలిసిందే.

Similar News

News January 17, 2025

రేపటి నుంచి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం

image

AP: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. టీ-5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో భావర్ కంపెనీ దీన్ని నిర్మించనుంది. ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నిర్మాణం పూర్తయ్యాక ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మించాల్సి ఉంటుంది. కాగా 2016లోనే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టారు. 2020 తర్వాత వరదలకు కొంత భాగం కొట్టుకుపోయింది.

News January 17, 2025

రూ.3.20 లక్షల ప్రశ్న.. జవాబు తెలుసా?

image

KBCలో అమితాబ్ బచ్చన్ క్రికెట్‌పై మరో ప్రశ్న అడిగారు. 2024 NOVలో టెస్టుల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన మెక్‌కల్లమ్ రికార్డును బద్దలుకొట్టింది ఎవరు అని ప్రశ్నించారు. ఆప్షన్లు A.యశస్వీ జైస్వాల్ B.ఇషాన్ కిషన్ C.సర్ఫరాజ్ ఖాన్ D.శుభ్‌మన్ గిల్. ఈ రూ.3.20 లక్షల ప్రశ్నకు కంటెస్టెంట్ గిల్ అని తప్పుడు జవాబిచ్చారు. దీంతో అతడు రూ.1.60 లక్షలే గెలుచుకోగలిగారు. సరైన జవాబు కామెంట్ చేయండి.

News January 17, 2025

ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్

image

AP: రాష్ట్రంలో ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఎస్ విజయానంద్ తెలిపారు. రేపు కడప జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు ఈ కార్యాక్రమాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 12 నెలలకు 12 థీమ్‌లతో ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహించనున్నారు.