India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మన్మోహన్ను పట్టించుకోకుండా రాజ్ఘాట్లో ప్రణబ్ముఖర్జీకి స్మారకం నిర్మించడం BJP డర్టీ పాలిటిక్స్కు నిదర్శనమని కాంగ్రెస్ MP డానిష్ అలీ విమర్శించారు. ఇది దేశ ఎకానమీని సంస్కరించిన MMSను అవమానించడమేనని అన్నారు. సంఘ్పై ప్రేమ వల్లే ప్రణబ్కు స్మారకం నిర్మిస్తున్నారని ఆరోపించారు. RSS ఫౌండర్ హెగ్డేవార్ను ఆయన ‘ధర్తీపుత్ర’గా కీర్తించారని, సావర్కర్ చిత్రాన్ని పార్లమెంటులో పెట్టించారని విమర్శించారు.
‘ప్రీమియం రేట్ సర్వీస్ స్కామ్’పై యూజర్లకు రిలయన్స్ జియో వార్నింగ్ ఇచ్చింది. +91 మినహా మరే ప్రిఫిక్స్తో ఇంటర్నేషనల్ కాల్స్ వచ్చినా జాగ్రత్తపడాలని ఈమెయిల్స్ పంపింది. రీసెంటుగా ISD నంబర్లతో మిస్డ్ కాల్స్ వస్తున్నాయి. ఆత్రుత కొద్దీ కాల్ బ్యాక్ చేస్తే నిమిషానికి రూ.200-300 వరకు ఛార్జ్ అవుతోంది. స్కామర్లు కస్టమర్ల జేబులకు ఇలా కత్తెరేస్తుండటంతో ఇంటర్నేషనల్ కాల్ బ్లాకింగ్ పెట్టుకోవాలని JIO సూచించింది.
TG: మాజీ మంత్రి KTRపై ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది. రూ.7,380 కోట్ల ORR టోల్ టెండర్లలో అవినీతి జరిగిందని వనపర్తి జిల్లా వాసి యుగంధర్ ఫిర్యాదు చేశారు. క్విడ్ ప్రో కో జరిగిందని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే వ్యవహారంపై KTRతో పాటు KCRపైనా ఈడీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్ A-1గా ఉన్నారు.
ఉన్నత విద్యాసంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు, పదోన్నతులకు తప్పనిసరి అయిన నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(NET)ను తొలగించాలని UGC సిఫార్సు చేసింది. స్టాఫ్ నియామకాలకు సంబంధించి డ్రాఫ్ట్ ముసాయిదా నిబంధనలను రిలీజ్ చేసింది. FEB 5లోపు వీటిపై అభిప్రాయాన్ని సమర్పించాలని స్టేక్ హోల్డర్లను కోరింది. కొత్త రూల్స్ ప్రకారం NET రాయకుండానే ME/MTECHలో 55% మార్క్స్ సాధించిన వారు స్టాఫ్ పోస్టులకు అర్హత సాధిస్తారు.
AP: అమరావతిలో రూ.11,467కోట్లతో పనులు చేపట్టాలని CRDA అథారిటీ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని CRDA కమిషనర్కు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి పురపాలక కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు.
TG: విచారణకు న్యాయవాదిని అనుమతించడం కుదరదని KTRకు ఇచ్చిన 2వ నోటీసులో ACB పేర్కొన్నట్లు తెలుస్తోంది. ‘న్యాయవాది సమక్షంలో విచారణ కోరడం నిబంధనలకు విరుద్ధం. లాయర్ను అనుమతించలేదనే సాకుతో విచారణ తప్పించుకుంటున్నారు. విచారణ తర్వాత మీ సమాధానం ఆధారంగా ఏ డాక్యుమెంట్లు తీసుకురావాలనేది చెబుతాం. వాటిని సమర్పించేందుకు సమయం ఇస్తాం. విచారణకు సహకరించకపోతే తదుపరి చర్యలు తప్పవు’ అని పేర్కొంది.
విమెన్ బాడీ స్ట్రక్చర్పై కామెంట్లు చేయడం లైంగిక నేరం కిందకే వస్తుందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. KSEBలోని మహిళా ఉద్యోగి పెట్టిన కేసును క్వాష్ చేయాలని మాజీ ఉద్యోగి వేసిన పిటిషన్ను కొట్టేసింది. 2013 నుంచి అతడు వల్గర్గా మాట్లాడుతూ అసభ్య మెసేజులు పంపిస్తూ కాల్స్ చేసేవాడు. బాడీ స్ట్రక్చర్పై కామెంట్లు నేరం కాదని అతడు వాదించగా, మహిళ చూపిన సందేశాల్లో నేర ఉద్దేశం కనిపిస్తోందని కోర్టు ఏకీభవించింది.
AP: గేమ్ ఛేంజర్, <<15068245>>డాకు మహారాజ్<<>> సినిమాల టికెట్ రేట్ల పెంపును 10 రోజులకు పరిమితం చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. 14 రోజుల వరకు <<15065900>>టికెట్ రేట్ల పెంపునకు<<>> ప్రభుత్వం అనుమతినివ్వగా, దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.
AP: జనవరి 10-19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు ఏర్పాట్లు చేసినట్లు TTD ఛైర్మన్ BR నాయుడు చెప్పారు. 10న ఉ.4:30కు ప్రొటోకాల్, వైకుంఠ ఏకాదశి రోజు ఉ.8గంటలకు సర్వదర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. ‘అన్ని ప్రత్యేక దర్శనాలను 10రోజులు రద్దు చేశాం. టికెట్లు లేకుండా తిరుమల వచ్చి ఇబ్బందులు పడొద్దు. 3K CC కెమెరాలతో నిఘా ఉంచాం. hMPV అలజడి నేపథ్యంలో భక్తులు మాస్క్ లాంటి స్వీయ జాగ్రత్తలు పాటించాలి’ అని ఛైర్మన్ కోరారు.
AP: ఇంటర్ పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులను ప్రతిపాదించింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను తొలగిస్తామని బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. బోర్డు కేవలం సెకండియర్ పరీక్షలను మాత్రమే నిర్వహిస్తుందని చెప్పారు. ఈ నెల 26 వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. 2025-26 నుంచి ఇంటర్లో సైన్స్ సబ్జెక్టుల్లో NCERT సిలబస్ ప్రవేశపెడతామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.