News January 8, 2025

కాల్‌బ్యాక్ చేస్తే రూ.300 కట్: యూజర్లకు JIO వార్నింగ్!

image

‘ప్రీమియం రేట్ సర్వీస్ స్కామ్’పై యూజర్లకు రిలయన్స్ జియో వార్నింగ్ ఇచ్చింది. +91 మినహా మరే ప్రిఫిక్స్‌తో ఇంటర్నేషనల్ కాల్స్ వచ్చినా జాగ్రత్తపడాలని ఈమెయిల్స్ పంపింది. రీసెంటుగా ISD నంబర్లతో మిస్డ్ కాల్స్ వస్తున్నాయి. ఆత్రుత కొద్దీ కాల్ బ్యాక్ చేస్తే నిమిషానికి రూ.200-300 వరకు ఛార్జ్ అవుతోంది. స్కామర్లు కస్టమర్ల జేబులకు ఇలా కత్తెరేస్తుండటంతో ఇంటర్నేషనల్ కాల్ బ్లాకింగ్ పెట్టుకోవాలని JIO సూచించింది.

Similar News

News January 25, 2025

అప్పట్లో.. మామూలు హడావిడి కాదు! కదా..?

image

జెండా పండుగలు 90s కిడ్స్‌కు స్పెషల్ మెమొరీ. ఆటలపోటీలు, క్లాస్ రూం డెకరేషన్, మూలన ఉండే షూ, సాక్స్ వెతికి ఉతికించడం, యూనిఫామ్ ఐరన్, ఎర్లీగా రెడీ, దేశభక్తి నినాదాలతో పరేడ్, జెండావందనం, ప్రసంగం. ఇప్పుడంటే మెడల్స్, ట్రోఫీలు కానీ అప్పట్లో సోప్ బాక్స్, గ్లాసు, గిన్నెలే ప్రైజులు. చివరికి ఇచ్చే బిస్కెట్లు/చాక్లెట్లు ఇంట్లో చూపిస్తే అంత ఫీజు కడితే ఇచ్చేదివేనా? అని మనోళ్ల తిట్లు.
మీ మెమొరీ కామెంట్ చేయండి.

News January 25, 2025

స్టైలిష్ లుక్‌లో రవితేజ.. రేపు గ్లింప్స్

image

మాస్ మహారాజా రవితేజ మరోసారి పోలీస్ పాత్రలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటిస్తున్న ‘మాస్ జాతర’ సినిమా నుంచి రేపు ఉ.11.07 గంటలకు గ్లింప్స్ రిలీజ్ కానుంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఆయన స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. బాను బోగవరపు ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. నాగవంశీ, సౌజన్య నిర్మిస్తున్నారు.

News January 25, 2025

కాళేశ్వరం కడితే మేం అభ్యంతరం చెప్పలేదు: చంద్రబాబు

image

AP: గోదావరి జలాలను బనకచర్లకు తరలిస్తే తెలంగాణకు నష్టమంటూ బీఆర్ఎస్ నేత <<15250698>>హరీశ్ రావు<<>> చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘బనకచర్లకు గోదావరి నీళ్లు తరలిస్తే తెలంగాణకు నష్టం లేదు. వరద జలాలను మాత్రమే తరలిస్తాం. తెలంగాణలో గోదావరి నదిపై కాళేశ్వరం నిర్మిస్తే మేం అభ్యంతరం చెప్పలేదు’ అని వెల్లడించారు. అటు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందితే అది దేశాభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్పారు.