News June 17, 2024

శుభ ముహూర్తం

image

తేది: జూన్ 17, సోమవారం జ్యేష్ఠమాసం
శు.ఏకాదశి: ఉదయం 06:25 గంటలకు
స్వాతి: మ.11:12 గంటలకు
దుర్ముహూర్తం:1. ఉ.08:15-09:06 గంటల వరకు
2. రా.11:02-11:46 గంటల వరకు
వర్జ్యం: రా.09:52-11:34 గంటల వరకు

News June 17, 2024

నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు

image

AP: విశాఖ రుషికొండ భవన నిర్మాణాలపై TDP, YCP ట్వీట్ వార్
➫TDP రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియామకం
➫AP: ఈ నెల 19న మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణ
➫రూ.లక్ష కోట్లతో అమరావతి నిర్మాణం: మంత్రి నారాయణ
➫TG: KCR లేఖపై సమీక్షిస్తాం: జస్టిస్ నర్సింహారెడ్డి
➫కృష్ణా జలాల్లో 50% వాటా కోసం ప్రయత్నిస్తాం: మంత్రి ఉత్తమ్

News June 17, 2024

OTPతో EVMను అన్‌లాక్ చేయలేరు: RO

image

శివసేన MP అభ్యర్థి రవీంద్ర బంధువు మొబైల్ ద్వారా EVMను అన్‌లాక్ చేశారనే వార్తలను రిటర్నింగ్ ఆఫీసర్ వందన సూర్యవంశీ ఖండించారు. ఆ వార్త ప్రచురించిన మిడ్ డే న్యూస్ పేపర్‌కు పరువు నష్టం దావా నోటీసులు పంపినట్లు తెలిపారు. EVM అనేది స్వతంత్ర వ్యవస్థ అని, దానిని అన్‌లాక్ చేయడానికి OTP అవసరం లేదని పేర్కొన్నారు. కాగా ముంబై నార్త్ వెస్ట్ నియోజకవర్గంలో రవీంద్ర కేవలం 48 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

News June 16, 2024

పెట్రోల్ ధరల పెంపును సమర్థించిన సీఎం సిద్దరామయ్య

image

కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై CM సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్ణయం ప్రజా సేవలకు, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తుందన్నారు. చాలా రాష్ట్రాల కంటే కర్ణాటకలో పెంచిన ధరలు తక్కువేనని తెలిపారు. అయితే దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాగా పెట్రోల్‌పై రూ.3, డీజిల్‌పై రూ.3.02లను కర్ణాటక ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోల్ రూ.103, డీజిల్ రూ.89గా ఉంది.

News June 16, 2024

ఫాదర్స్ డే వేళ శిఖర్ ధవన్ భావోద్వేగం

image

క్రికెటర్ శిఖర్ ధవన్ తన కుమారుడిని తలచుకొని ఎమోషనల్ అయ్యారు. ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి, కుమారుడితో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘నా కుమారుడు నాతో లేని ఈ ఫాదర్స్ డే భావోద్వేగభరితమైంది. నా కొడుకు నాతో కాంటాక్ట్‌లో కూడా లేడు. నా జీవితంలో అన్నీ ఇచ్చిన మీకు ధన్యవాదాలు నాన్న’ అని పోస్ట్ చేశారు. ధావన్ నుంచి విడాకులు పొందిన <<13074646>>ఆయేషా<<>> కుమారుడితో విదేశాలకు వెళ్లారు.

News June 16, 2024

రెండేళ్ల తర్వాత తల్లిని కలిసిన CM యోగి

image

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దాదాపు రెండేళ్ల తర్వాత తన తల్లి సావిత్రి దేవిని కలిశారు. ఆమె వయో సంబంధిత ఆరోగ్య సమస్యలతో రిషికేశ్‌‌లోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఎయిమ్స్‌కు వెళ్లిన యోగి తన తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆయన 2022లో చివరిసారిగా తన తల్లిని కలిశారు.

News June 16, 2024

పేదోడి ఇల్లు.. పెత్తందారుడు కట్టుకున్న బాత్ రూమ్: TDP

image

AP: విశాఖ రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన భవనాలపై టీడీపీ Xలో విమర్శలు గుప్పిస్తోంది. ‘భార్య కోరిక కోసం, కొండని కొట్టి మరీ, ఈశాన్యంలో సముద్రం ఉండేలా, బీచ్ వ్యూతో రూ.500 కోట్లతో ప్యాలెస్. బాత్ టబ్ ఒక్కటే రూ.26 లక్షలు. మళ్ళీ పేదలు, పెత్తందార్లు అని జోకులు వేస్తూ, పేదలకు ఇళ్లు కూడా లేకుండా చేశాడు. పేదోడి కోసం కట్టిస్తానన్న ఇల్లు, పెత్తందారుడు కట్టుకున్న బాత్‌రూమ్’ అని Xలో ఓ ఫొటోను పంచుకుంది.

News June 16, 2024

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ నియామకం

image

AP: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక MLA పల్లా శ్రీనివాసురావు యాదవ్‌ని చంద్రబాబు నియమించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. నూతన బాధ్యతలను శ్రీనివాసరావు విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. కాగా ఇటీవలి ఎన్నికల్లో పల్లా రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ(95,235)తో గాజువాక నుంచి గెలుపొందారు.

News June 16, 2024

ఐర్లాండ్ బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్

image

టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఐర్లాండ్‌ బ్యాటింగ్ ఘోరంగా విఫలమైంది. 20 ఓవర్లలో కేవలం 106 పరుగులకే పరిమితమైంది. డెలానీ(31), లిటిల్(22) ఫరవాలేదనిపించారు. మిగితా బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. పాక్ బౌలర్లలో అఫ్రిది 3, ఇమాద్ 3, అమిర్ 2, రవూఫ్ 1 వికెట్ చొప్పున తీశారు. పాక్ గెలవాలంటే 107 రన్స్ చేయాలి. ఈ రెండు జట్లు ఇప్పటికే సూపర్8 రేసు నుంచి నిష్క్రమించాయి.

News June 16, 2024

మోదీపై కేరళ కాంగ్రెస్ సెటైర్

image

‘చివరికి దేవుడిని కలిసే అవకాశం పోప్‌కి వచ్చింది!’ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీపై కేరళ కాంగ్రెస్ సెటైర్ వేసింది. ఇటలీ పర్యటనలో భాగంగా పోప్‌ ఫ్రాన్సిస్‌ను మోదీ కలిశారు. అప్పుడు తీసిన ఫొటోను కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఇటీవల ఎన్నికల సందర్భంగా ఒడిశా బీజేపీ నేత సంబిత్ పాత్ర ‘పూరీ జగన్నాథుడు కూడా మోదీకి భక్తుడే’ అని వ్యాఖ్యానించడాన్ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.