News March 20, 2024

వచ్చే నెల 1 నుంచి ధాన్యం కొనుగోళ్లు?

image

TG: యాసంగి ధాన్యం కొనుగోళ్లను ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 7వేలకు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తోందట. ఈ సీజన్‌లో 60-70లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం వరి మద్దతు ధర గ్రేడ్ ‘ఏ’ రకానికి ₹2,203, సాధారణ రకానికి ₹2,183గా ఉంది. కాగా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వరి కోతలు మొదలయ్యాయి.

News March 20, 2024

రాష్ట్రంలో ఎన్నికలు.. వాలంటీర్లపై కీలక ఆదేశాలు

image

AP: గ్రామ, వార్డు వాలంటీర్లను ఏ రూపంలోనూ ఎన్నికల విధుల్లో వినియోగించరాదని సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టం చేసిన ఆయన.. ఎన్నికల ప్రక్రియకు కూడా వాలంటీర్లను దూరంగా ఉంచాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పోలింగ్ ఏజెంట్లుగా కూడా వినియోగించరాదన్నారు. తమ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

News March 20, 2024

ఆరు స్థానాల్లో అభ్యర్థులు ఫిక్స్?

image

TG:లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. పెండింగ్‌లో ఉన్న 13 స్థానాల్లో ఆరింటిపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిసింది. పెద్దపల్లి-గడ్డం వంశీ, చేవెళ్ల-రంజిత్‌రెడ్డి, మల్కాజ్‌గిరి-సునీతారెడ్డి, నాగర్‌కర్నూల్-మల్లు రవి, ఆదిలాబాద్-ఆత్రం సుగుణ, సికింద్రాబాద్- దానం పేర్లు ఫిక్సయినట్లు సమాచారం. అటు భువనగిరి, KMM, WGL, HYD, MDK, NZB, KMR స్థానాలు ఖరారు చేయాల్సి ఉంది.

News March 20, 2024

నేడు భారీ వర్షాలు

image

ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ తెలిపింది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

News March 20, 2024

నేడు టీడీపీ 3వ జాబితా?

image

AP: టీడీపీ అభ్యర్థుల మూడో జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నేడు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 10 ఎంపీ సీట్లతో పాటు కొన్ని అసెంబ్లీ స్థానాలపైనా ఈరోజు స్పష్టత రావొచ్చని పార్టీ వర్గాలంటున్నాయి. మైలవరం, ఎచ్చర్ల అసెంబ్లీ స్థానాలపై సందిగ్ధత వీడనుందని సమాచారం. మొత్తం 25 ఎంపీ సీట్లకు గాను, 17 సీట్లలో టీడీపీ, రెండు సీట్లలో జనసేన, 6 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్న సంగతి తెలిసిందే.

News March 20, 2024

ఈ మూడు జట్ల కల నెరవేరేనా?

image

ఐపీఎల్‌లో 16 సీజన్లు గడిచినా మూడు జట్లు మాత్రం ఇప్పటివరకూ టైటిల్ అందుకోలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లను దురదృష్టం వెంటాడుతూనే ఉంది. ఈ మూడు టీమ్‌లు ఫైనల్‌కు వెళ్లినా పరాజయమే పలకరించింది. ఆర్సీబీ పరిస్థితి మరీ విచారకరం. మూడు సార్లు ఫైనల్స్‌కు వెళ్లినా ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయింది. ఈ సారి ఎలాగైనా తమ రాత మార్చుకోవాలని ఈ జట్లు భావిస్తున్నాయి.

News March 20, 2024

27న చరణ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్?

image

మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ బర్త్‌డే నాడు ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27న ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సాన బుచ్చిబాబుతో చేయబోయే మూవీ నుంచి కూడా ఓ క్రేజీ అప్డేట్ రానుందని టాక్. దీంతో చరణ్ పుట్టినరోజున అభిమానులకు పండగనే చెప్పాలి. ప్రస్తుతం రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

News March 20, 2024

మరోసారి హోస్ట్‌గా అలరించనున్న రానా

image

హీరో రానా మరో సరికొత్త టాక్ షోతో ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అయ్యారు. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమయ్యే ఈ షోకు ‘ది రానా కనెక్షన్’ అనే పేరుని ఖరారు చేశారు. అయితే ఈ టాక్ షో ఎప్పటి నుంచి ప్రసారం చేస్తారనేది రివీల్ చేయలేదు. టాలీవుడ్, బాలీవుడ్‌తో సహా పలు ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలను ఈ షోకు ఆహ్వానించే అవకాశాలున్నాయి. గతంలో రానా ‘నంబర్ 1 యారీ’ పేరుతో ఓ టీవీ షోకు హోస్ట్ వ్యవహరించిన సంగతి తెలిసిందే.

News March 20, 2024

సుహాస్ సరసన స్టార్ హీరోయిన్?

image

విభిన్న చిత్రాలతో మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నారు సుహాస్. ఆయన హీరోగా, అనిల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఉప్పు కప్పురంబు’ సినిమాలో స్టార్ హీరోయిన్ నటించనున్నట్లు సమాచారం. ‘మహా నటి’ కీర్తి సురేశ్ ఈ మూవీలో సుహాస్ సరసన నటిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News March 20, 2024

నేటి నుంచి భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర

image

AP: నేటి నుంచి చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర చేపట్టనున్నారు. 20, 21, 22 తేదీల్లో కడప, అన్నమయ్య జిల్లాలో ఆమె పర్యటించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనోవేదనకు గురై చనిపోయిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. వారికి రూ.3 లక్షల పరిహారం కూడా చెల్లించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ సిద్ధం చేస్తోంది.