News January 8, 2025

తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

image

AP: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో నలుగురు భక్తుల మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. అటు టీటీడీ, జిల్లా అధికారులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిని సీఎం తెలుసుకుంటున్నారు. ఇక మంత్రి లోకేశ్ సైతం ఇలాంటి ఘటనలు జరగకుండా టీటీడీ మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

News January 8, 2025

బూమ్ బూమ్ బీరు తీసుకొచ్చేందుకు కుట్ర: హరీశ్ రావు

image

TG: రాష్ట్రంలోకి లోకల్ బ్రాండ్స్ బూమ్ బూమ్, బిర్యానీ బీర్లు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోందని BRS నేత హరీశ్ రావు అన్నారు. అందుకే కింగ్ ఫిషర్, హీనెకిన్ బీర్ల సరఫరా నిలిపివేసిందని సర్కార్‌పై మండిపడ్డారు. ‘బీర్ల నిలిపివేతపై మాకు పలు అనుమానాలు ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగానే వీటి సరఫరాను నిలిపేశారు. UBLకు పెండింగ్ బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైంది’ అని ఆయన ట్వీట్ చేశారు.

News January 8, 2025

కోహ్లీ నాకు దేవుడు: కోన్‌స్టాస్

image

విరాట్ కోహ్లీ తనకు క్రికెట్ దేవుడని ఆస్ట్రేలియా యువ క్రికెటర్ సామ్ కోన్‌స్టాస్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఆయన ఆటను చూస్తూ పెరిగాను. కోహ్లీ ఆడుతున్న సమయంలో నేను ఆడటమే నాకో గౌరవం. మ్యాచ్‌లు ముగిశాక నేను ఆయనతో మాట్లాడాను. నేను ఎంత పెద్ద అభిమానినో చెప్పాను. ఆయన చాలా మంచి వ్యక్తి. చాలా గౌరవంగా మాట్లాడారు. శ్రీలంక సిరీస్‌కు నేను ఎంపికైతే బాగా ఆడాలని విష్ చేశారు’ అని వెల్లడించారు.

News January 8, 2025

‘గేమ్ ఛేంజర్‌’ టికెట్ ధరల పెంపు

image

తెలంగాణలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతించింది. తొలి రోజు ఉ.4 గంటల షోతో సహా ఆరు ఆటలకు అనుమతిస్తూ సింగిల్ స్ర్కీన్ థియేటర్లలో రూ.100, మల్టీప్లెక్స్‌లో రూ.150 చొప్పున పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఈ నెల 11 నుంచి 19 వరకు ఐదు షోలకు అనుమతి ఇస్తూ సింగిల్ స్ర్కీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లో రూ.100 చొప్పున పెంచుకోవచ్చని పేర్కొంది.

News January 8, 2025

వైకుంఠ ద్వార దర్శనం.. డిమాండ్ ఎందుకంటే..

image

హిందువులు ముక్కోటి ఏకాదశిని పరమ పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో ఆలయ ప్రవేశం సర్వపాప హరమని విశ్వాసం. ఇక భూలోక వైకుంఠంగా భావించే తిరుమల శ్రీవారి క్షేత్రంలో ఉత్తర ద్వార దర్శనమంటే సాక్షాత్తూ ఆ వైకుంఠ ధామంలోకి ప్రవేశించినట్లుగా పులకరిస్తారు. ఏడాదిలో 10రోజులు మాత్రమే టీటీడీ ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే టోకెన్ల కోసం భక్తులు భారీగా రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.

News January 8, 2025

బ్యాంకాక్‌లో అంతగా ఏముంది!

image

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్శించడంలో బ్యాంకాక్ ముందుంది. 32.4 మిలియన్ల సందర్శకులను స్వాగతించి బ్యాంకాక్ ప్రపంచంలోని అత్యుత్తమ పర్యాటకప్రాంతంగా నిలిచింది. దీనికి ముఖ్యకారణం అక్కడి పర్యాటక విధానం, సోషల్ మీడియాలో పెరిగిన ఆదరణే అని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు దాదాపు 94 దేశాల పర్యాటకులకు వీసా లేకుండా ప్రవేశించే విధానం తీసుకురావడమే. బ్యాంకాక్ అంటే మీకూ ఇష్టమా? COMMENT

News January 8, 2025

చాహల్‌తో విడాకుల ప్రచారం.. ఇన్‌స్టాలో ధనశ్రీ పోస్ట్

image

చాహల్‌తో విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం నేపథ్యంలో ధనశ్రీ ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఫ్యామిలీతో పాటు తాను కష్ట కాలాన్ని ఎదుర్కొంటున్నానని అన్నారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వస్తున్న నిరాధార కథనాలు బాధిస్తున్నాయని తెలిపారు. కొన్ని ఏళ్లపాటు కష్టపడి మంచి పేరు సంపాదించుకున్నట్లు పేర్కొన్నారు. విలువలకు కట్టుబడి వాస్తవంపై దృష్టి పెట్టి ముందుకెళ్తానని పేర్కొన్నారు.

News January 8, 2025

అందుకే బీర్ల ధరలు పెంచలేదు: మంత్రి జూపల్లి

image

TG: యునైటెడ్ బ్రూవరీస్ చెప్పినట్లు బీర్ల ధరలు 33 శాతం పెంచితే వినియోగదారులపై భారం పడుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అందుకే ఆ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ‘ధరల పెంపు కోసం ఓ కమిటీ వేశాం. కమిటీ సూచనల ప్రకారం నిర్ణయం తీసుకుంటాం. బీర్ల మార్కెట్‌లో యునైటెడ్ బ్రూవరీస్ గుత్తాధిపత్యం ప్రదర్శిస్తోంది. ఆ కంపెనీ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవు’ అని ఆయన వివరించారు.

News January 8, 2025

పృథ్వీ షా కఠోర సాధన: పిక్స్ వైరల్

image

టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీ షా కఠోర సాధన చేస్తున్నారు. ఫిట్‌నెస్ మెరుగుపరుచుకునేందుకు ఆయన మైదానం, జిమ్‌లోనూ కసరత్తులు చేస్తున్నారు. తాజాగా ట్రాక్‌పై పరిగెత్తుతూ, జిమ్‌లో వర్కౌట్ చేస్తూ, టెన్నిస్ ఆడుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పృథ్వీ SMలో పంచుకున్నారు. కాగా జాతీయ జట్టుతోపాటు దేశవాళీ జట్టులో కూడా షా చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరోవైపు ఐపీఎల్‌లో కూడా ఆయనను ఏ ఫ్రాంచైజీ కొనలేదు.

News January 8, 2025

సినిమాల్లో సక్సెస్ అవ్వకపోతే?.. రామ్ చరణ్ అన్సర్ ఇదే

image

చిన్నప్పటి నుంచి ఇంట్లో సినిమా ప్రభావం తమపై పడకుండా నాన్న చిరంజీవి జాగ్రత్తలు తీసుకున్నారని హీరో రామ్ చరణ్ అన్నారు. ఆ తర్వాత తన మార్కులు చూసి ఏమవుతావని తన తండ్రి అడిగితే సినిమాల్లోకి వస్తానని చెప్పినట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఒకవేళ సినిమాల్లో సక్సెస్ అవ్వకుంటే ప్లాన్-బి ఏమీ లేదన్నారు. డూ ఆర్ డై ఏదైనా ఇక్కడే అనుకున్నానని తెలిపారు. కాగా ఆయన నటించిన ‘గేమ్ ఛేంజర్’ ఎల్లుండి రిలీజ్ కానుంది.