News January 8, 2025

గవర్నర్‌కు కిషన్ రెడ్డి ఫిర్యాదు

image

TG: హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంపై దాడి ఘటనపై గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు కిషన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వందలాది కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపై కర్రలు, రాళ్లతో దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడిలో బీజేపీ నాయకులు గాయపడ్డారని, రాజకీయ ప్రత్యర్థులను అధికార పార్టీ భయభ్రాంతులకు గురిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పాలన అందించేలా ప్రభుత్వానికి సూచించాలని కోరారు.

News January 8, 2025

బాలకృష్ణకు అలా పిలిస్తేనే ఇష్టం: శ్రద్ధా శ్రీనాథ్

image

సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తనను ‘సార్’ అని పిలవొద్దని చెప్పేవారని హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ తెలిపారు. ‘బాలా’ అని పిలవాలని సూచించేవారని చెప్పారు. ‘బాలయ్య సెట్స్‌లో చాలా కూల్‌గా ఉంటారు. ఆయన దర్శకుల హీరో. డైరెక్టర్ ఏది చెబితే అది మొహమాటం లేకుండా చేస్తారు. దర్శకుడికి పూర్తిగా లొంగిపోతారు. డాకు మహారాజ్‌లో నటించడం నా అదృష్టం’ అని ఆమె పేర్కొన్నారు. కాగా ఈ మూవీ ఈ నెల 12న విడుదల కానుంది.

News January 8, 2025

APPLY NOW.. 600 ఉద్యోగాలు

image

SBI 600 పీఓ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. జనవరి 16 దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ. ఏదైనా డిగ్రీ పాసైనవారు అర్హులు. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.750 కాగా మిగతావారికి ఉచితం. ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చే ఏడాది మార్చి 8-15 వరకు జరగనుంది. మెయిన్స్ ఏప్రిల్-మేలో జరిగే అవకాశం ఉంది. వెబ్‌సైట్: <>sbi.co.in <<>>

News January 8, 2025

తెలివి తక్కువ వాళ్లు తల్లి కాకూడదా?: హైకోర్టు

image

తెలివి తక్కువ వాళ్లు తల్లి కాకూడదా అని బొంబాయి హైకోర్టు ప్రశ్నించింది. అలాంటివారికి తల్లి అయ్యే హక్కు లేదని చెప్పడం సరికాదని పేర్కొంది. తన కుమార్తెకు 21 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని ఓ తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఆమెకు పెళ్లి కూడా కాలేదని, మానసిక స్థితి బాగాలేదని తెలిపారు. మరోవైపు ఆమె తల్లి అయ్యేందుకు మెడికల్‌గా ఫిట్‌గా ఉన్నారని వైద్యులు కోర్టుకు తెలిపారు.

News January 8, 2025

BREAKING: ఫలితాలు విడుదల

image

తెలంగాణ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ ఫలితాలను TGPSC విడుదల చేసింది. ఎంపికైన 171 మంది అభ్యర్థుల జాబితాను వెబ్‌సైటులో అందుబాటులో ఉంచింది. 2023 జులైలో TPBO ఉద్యోగాలకు రాత పరీక్ష జరగ్గా, అక్టోబర్ నుంచి డిసెంబర్ 23 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించింది. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News January 8, 2025

రేపటి నుంచి SAT20: భారత్ నుంచి ఒక్కడే

image

రేపటి నుంచి SAT20 టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు పాల్గొంటున్నాయి. క్లాసెన్, బట్లర్, జాన్సెన్, విల్ జాక్స్, మార్క్రమ్, మిల్లర్, జాసన్ రాయ్, డుప్లెసిస్, డికాక్, పూరన్, స్టొయినిస్, రషీద్ ఖాన్, పొలార్డ్, సామ్ కరన్, సాల్ట్, లివింగ్‌స్టోన్ వంటి స్టార్లు ఆడతారు. భారత్ నుంచి దినేశ్ కార్తీక్ మాత్రమే ఈ టోర్నీలో ఆడనున్నారు. పర్ల్ రాయల్స్ తరఫున ఆయన బరిలోకి దిగుతారు.

News January 8, 2025

చాహల్ భార్యతో సన్నిహిత ఫొటో: స్పందించిన కొరియోగ్రాఫర్

image

టీమ్ ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుంటారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ధనశ్రీతో కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉతేకర్‌ సన్నిహితంగా దిగిన ఫొటో SMలో వైరల్‌గా మారింది. దీనిపై ప్రతీక్ స్పందించారు. ‘ఎవరికైనా తమకు నచ్చిన కథలు, కథనాలు చెప్పుకునే స్వేచ్ఛ ఈ ప్రపంచంలో ఉంది. కానీ ఒక చిన్న ఫొటోను వేరేవిధంగా చూడడం దారుణం. అబ్బాయిలూ ఎదగండి’ అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

News January 8, 2025

టెస్టుల్లో మళ్లీ విరాట్ కెప్టెన్ కావొచ్చు: గిల్‌క్రిస్ట్

image

విరాట్ కోహ్లీ మరోసారి ఇండియా టెస్టు జట్టు పగ్గాలు చేపట్టొచ్చని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గిల్‌క్రిస్ట్ అన్నారు. ‘రోహిత్ ఇంటికి చేరాక టెస్టు భవిష్యత్తును సమీక్షించుకుంటారు. ఆయన ఇంగ్లండ్‌ టెస్టులకు వెళ్తారని నేను అనుకోవడం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడొచ్చేమో. ఆ తర్వాత రిటైరవ్వొచ్చు. బుమ్రా ఎంత ఫిట్‌గా ఉన్నారన్నది అనుమానమే. నాకు తెలిసి భారత్ మళ్లీ విరాట్‌నే కెప్టెన్‌గా నియమించొచ్చు’ అని వ్యాఖ్యానించారు.

News January 8, 2025

విశాఖ ఫిషింగ్ హార్బర్‌ను అభివృద్ధి చేస్తాం: మోదీ

image

AP: విశాఖ సముద్ర తీరం వందల ఏళ్లుగా ఎగుమతులు, దిగుమతుల్లో ప్రధాన పాత్ర పోషిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. స్థానిక ఫిషింగ్ హార్బర్‌ను మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. సముద్ర సంబంధిత అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకుంటామని, మత్స్యకారుల ఆదాయం పెరిగేలా నిబద్ధతతో పనిచేస్తున్నామని చెప్పారు. అటు చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో క్రిస్ సిటీ(కృష్ణపట్నం) భాగం అవుతుందని వెల్లడించారు.

News January 8, 2025

విధ్వంస పాలకులతో లక్ష్యాలు నెరవేరవు: సీఎం చంద్రబాబు

image

రాష్ట్రంలో విధ్వంస పాలకులతో లక్ష్యాలు నెరవేరవని సీఎం చంద్రబాబు వైజాగ్ సభలో అన్నారు. ‘ప్రజలు మద్దతునిస్తే ఎలాంటి సుపరిపాలన సాధ్యమో ప్రధాని మోదీ ఇప్పటికే నిరూపించారు. ప్రజల్లో చైతన్యం రావాలి. 2047 నాటికి భారత్ అగ్రస్థానానికి చేరుతుంది. భారతీయులు అన్ని రంగాల్లోనూ నంబర్ వన్ స్థానంలో ఉంటారు. సరైన సమయంలో సరైన ప్రధాని ఉండటం దేశానికి కలిసొస్తోంది. మోదీ ఇప్పుడు గ్లోబల్ లీడర్’ అని పేర్కొన్నారు.