News March 25, 2024

హార్దిక్‌కు మద్దతుగా నిలిచిన గవాస్కర్

image

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓడిపోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యకు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మద్దతుగా నిలిచారు. ‘హార్దిక్ చింతించకండి. ముంబై అభిమానిగా నేను మీకు మద్దతిస్తున్నా. మొదటి గేమ్‌లో ఓడిపోవడం ముంబై ఇండియన్స్‌కు అలవాటే. నిన్న కూడా అదే రిపీటైంది. ఇది కేవలం మొదటి గేమ్ మాత్రమే. మీరు కమ్‌బ్యాక్ ఇస్తారని కోరుకుంటున్నా’ అని తెలిపారు.

News March 25, 2024

ఐపీఎల్ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్

image

ఐపీఎల్ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ విడుదలైంది. తొలి విడతలో ఏప్రిల్ 7 వరకు షెడ్యూల్ విడుదల కాగా.. తాజాగా మిగతా షెడ్యూల్‌ను BCCI విడుదల చేసింది. ఏప్రిల్ 8 నుంచి మే 19 వరకు లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మే 21న క్వాలిఫయర్ 1, మే 22న ఎలిమినేటర్, మే 24న క్వాలిఫయర్ 2, మే 26న ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి

News March 25, 2024

ముస్లింలూ హోలీ చేసుకునేవారట

image

హోలీ అంటే హిందువుల పండుగ అని మనకు తెలుసు. అయితే.. ముస్లింలు కూడా హోలీ చేసుకునేవారని మీకు తెలుసా? మొఘల్ కాలంలో ముస్లిం ప్రజలు హోలీని ఈద్-ఎ-గులాబీ(పింక్ ఈద్), ఆబ్-ఇ-పాషి (రంగుల పూల వర్షం) పేరుతో చేసుకునేవారు. ఆగ్రా, ఎర్రకోట వద్ద హిందూ, ముస్లింలతో కలిసి మొఘల్ చక్రవర్తులు అక్బర్, జహంగీర్‌ హోలీ ఆడేవారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ అధికారి, పద్మశ్రీ అవార్డు గ్రహీత కేకే.మహమ్మద్ వెల్లడించారు.

News March 25, 2024

జెర్సీపై ఆ లోగో లేకుండానే ఆడిన సీఎస్కే ప్లేయర్

image

బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఐపీఎల్‌లో సీఎస్కే తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే. జెర్సీపై మద్యం కంపెనీ లోగోను వేసుకునేందుకు నిరాకరించారు. మతపరమైన కారణాలతో ఆయన ఈ లోగోను నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో జెర్సీపై ఆ లోగో లేకుండానే బరిలోకి దిగారు. గతంలో ఆమ్లా, మొయిన్ అలీ వంటి ప్లేయర్లు కూడా ఇలాగే బరిలోకి దిగారు.

News March 25, 2024

రూ.4వేల పింఛన్ ఇంటికే తెచ్చిస్తాం: చంద్రబాబు

image

AP: టీడీపీ, జనసేన, బీజేపీల అజెండా ఒక్కటేనని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర సాయం అవసరమన్నారు. ఈసారి 160 అసెంబ్లీ, 24 లోక్‌సభ స్థానాల్లో గెలవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక రూ.4వేల పింఛన్ ఇంటికే తెచ్చిస్తామని ప్రకటించారు. ముస్లింల 4శాతం రిజర్వేషన్లు కాపాడింది తమ పార్టీయేనని బాబు గుర్తు చేశారు.

News March 25, 2024

రామ్ చరణ్- సుకుమార్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

image

రామ్ చరణ్- సుకుమార్ కాంబినేషన్లో రెండో మూవీ తెరకెక్కనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోసారి DSPనే ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది చివర్లో విడుదల చేస్తారని సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. రంగస్థలం‌ను మించే సినిమా రాబోతుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం చరణ్ గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తుండగా.. బుచ్చిబాబుతో సినిమా చేయాల్సి ఉంది.

News March 25, 2024

మా ప్లేయర్లు సిద్ధంగా ఉన్నారు: డుప్లెసిస్

image

ఐపీఎల్ 2024లో ఇవాళ పంజాబ్‌తో మ్యాచులో విజయంతో ఖాతా తెరిచేందుకు ఆర్సీబీ ఎదురు చూస్తోంది. తమ హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్ చేయడానికి గొప్ప ప్లేస్ అని ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ అన్నారు. జట్టులోని ప్లేయర్లంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇప్పటివరకు చిన్నస్వామి స్టేడియంలో 84 మ్యాచులు ఆడిన ఆర్సీబీ 39 విజయాలు, 40 పరాజయాలను ఖాతాలో వేసుకుంది. ఒక మ్యాచ్ టై కాగా, నాలుగు మ్యాచుల్లో ఫలితం రాలేదు.

News March 25, 2024

‘సెలబ్రిటీ’ హోలీ

image

దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రంగులు పూసుకుంటూ సరదాగా గడిపారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా హోలీ ఆడి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా తన భర్త నికోలస్‌తో పండుగ జరుపుకున్నారు. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర & రకుల్ దంపతులు, తన పెట్స్‌తో సమంత తదితరుల సెలబ్రేషన్ ఫొటోస్ మీకోసం.

News March 25, 2024

ధరణిలో లోపాలుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది: పల్లా

image

TG: ధరణిలో లోపాలున్నాయని, వాటిని తాము గుర్తించామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని BRS ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. ‘4 నెలల క్రితం ధరణిలో లోపాలున్నాయని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఎందుకు సరిదిద్దడం లేదు. చట్ట ప్రకారం రైతుల భూములు పట్టాలు చేయాలి. అద్భుతంగా నడిచిన ధరణిని కొనసాగించాలి. రైతుల ఉసురు పోసుకోవద్దు’ అని అన్నారు.

News March 25, 2024

పిఠాపురంలో పవన్‌దే గెలుపు: ఉదయ్

image

AP: పిఠాపురంలో ఎవరు పోటీ చేసినా పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని కాకినాడ జనసేన అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ‘ఈ నెల 31 నుంచి పిఠాపురంలో పవన్ వారాహి యాత్ర ప్రారంభం అవుతుంది. పవన్‌కు సవాల్ విసరాలంటే ద్వారంపూడికి స్థాయి ఉండాలి. మా నాయకుడికి భయపడి వైసీపీ మండలానికో ఇన్‌ఛార్జ్‌ని నియమించింది. ముద్రగడ వైసీపీ కోసమే పనిచేశారు. అందుకే ఆ పార్టీలో చేరారు’ అని తెలిపారు.