India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: సీఎం చంద్రబాబు ఆదేశాలతో జగన్ ఫొటోలతోనే ఉన్న <<13429707>>విద్యాకానుక<<>>(స్టూడెంట్ కిట్) పంపిణీ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని సమగ్రశిక్ష అభియాన్ ఖండించింది. ‘2024-25లో సరఫరా చేసే వస్తువులలో ఎలాంటి రాజకీయ చిహ్నాలు, ఫొటోలు ముద్రించొద్దని మార్చిలోనే కాంట్రాక్టర్లకు ఆదేశాలిచ్చాం. వారు అలాగే సరఫరా చేశారు. ఎక్కడైనా పాత స్టాక్ ఉంటే విద్యార్థులకు ఇవ్వొద్దని DEO, MEOలకు సూచించాం’ అని పేర్కొంది.
TG: MBA, MCA కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఐసెట్ ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల కానున్నాయి. https://icet.tsche.ac.in/ వెబ్సైట్లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి, కాకతీయ వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీ వాకాటి కరుణ ఫలితాలు రిలీజ్ చేస్తారు. జూన్ 5, 6 తేదీల్లో జరిగిన ఈ పరీక్షకు 77,942 మంది హాజరైన విషయం తెలిసిందే.
AP: రాష్ట్రానికి BPCL రిఫైనరీ ప్రాజెక్టును సాధించేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు. రెండు స్థలాలను కూడా ప్రతిపాదించారు. దీనిద్వారా రూ.50వేల కోట్లను సంస్థ పెట్టుబడి పెట్టనుంది. ఇది పూర్తయితే వేలాది మందికి ఉపాధి లభించనుంది. అయితే ఈ ప్రాజెక్టు కోసం యూపీ, గుజరాత్ కూడా పోటీ పడుతున్నాయి. విభజన హామీ మేరకు ఏపీకి రిఫైనరీ ప్రాజెక్టును కేటాయించాలని అధికారులు కేంద్రానికి లేఖ రాయడానికి నిర్ణయించుకున్నారు.
AP: భార్యకు మనోవర్తి చెల్లింపు కేసులో సినీ నటుడు, జనసేన నేత పృథ్వీరాజ్కు విజయవాడ ఫ్యామిలీ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను జులై 15కు వాయిదా వేసింది. నెలకు రూ.22వేల మనోవర్తితోపాటు బకాయిలు చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పృథ్వీ పాటించలేదని భార్య శ్రీలక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు అరెస్టు వారెంట్ ఇచ్చింది.
TG: జులై మొదటి వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 18 నుంచి శాఖలవారీగా డిప్యూటీ CM భట్టి విక్రమార్క సమీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, పథకాలకు ఖర్చయ్యే మొత్తం, నిధుల సమీకరణ తదితర అంశాలపై ఆర్థికశాఖ వివరాలు సేకరిస్తోంది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపుల ఆధారంగా రాష్ట్ర పద్దుకు తుది మెరుగులు దిద్దనున్నట్లు సమాచారం.
TG: రాష్ట్ర విద్య, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మెయిల్ ఐడీ హ్యాకింగ్కు గురైనట్లు అధికారులు తెలిపారు. కొందరు మోసగాళ్లు ఉద్యోగులు, సాధారణ ప్రజలకు మెయిల్స్ పంపుతూ డబ్బులు అడుగుతున్నారని చెప్పారు. వీటికి స్పందించకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. హ్యాకింగ్పై ఫిర్యాదు చేశామని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అధికారులు వెల్లడించారు.
భారత్-చైనా మధ్య సత్సంబంధాలు లేకపోయినా మన దేశం గురించి తెలుసుకోవడానికి చైనీయులు ఆసక్తి చూపుతున్నారు. గ్లోబల్ టైమ్స్ ఇన్స్టిట్యూట్ ఇటీవల చైనాలో 1,440 మందిపై సర్వే చేసింది. దాదాపు 90% మంది ఇండియా గురించి తెలుసుకోవాలని, 70% మంది సందర్శించేందుకు ఆసక్తి కనబర్చారు. ముంబై, ఢిల్లీ పర్యటనకు ఎక్కువగా మొగ్గు చూపారు. అలాగే 90% మంది IND సినిమాలను వీక్షించారు. 30% మంది మన ఉత్పత్తులను కొనుగోలు చేశారు.
T20WC కోసం భారత జట్టుతో పాటు USAకు వెళ్లిన క్రికెటర్లు గిల్, అవేశ్ ఖాన్ స్వదేశానికి రానున్నారు. వీరితో పాటు ట్రావెలింగ్ రిజర్వ్గా వెళ్లి రింకూ, ఖలీల్ అహ్మద్ జట్టుతోనే ఉంటారు. USAలో జూన్ 15న కెనడాతో భారత్ చివరి మ్యాచ్ ఆడనుంది. తర్వాతి మ్యాచ్లు వెస్టిండీస్లో జరుగుతాయి. జట్టులోని ఆటగాళ్లు గాయపడితే అప్పటికప్పుడు రిజర్వ్ ప్లేయర్లు USAకు వెళ్లడం కష్టమైన పని కావడంతో వీరిని ముందే USAకు తీసుకెళ్లారు.
మణిరత్నం డైరెక్షన్లో కమల్ హాసన్ నటిస్తోన్న ‘థగ్ లైఫ్’ సినిమా సెట్లో ప్రమాదం జరిగింది. పుదుచ్చేరిలో హెలికాప్టర్తో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా నటుడు జోజు జార్జ్ గాయపడ్డారు. వెంటనే మూవీ యూనిట్ ఆయన్ను ఆస్పత్రి తరలించింది. చికిత్స చేసిన వైద్యులు జార్జ్ ఎడమ కాలు ఫ్రాక్చర్ అయిందని తెలిపారు. కొన్ని వారాలు విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో ఆయన సన్నివేశాలను డైరెక్టర్ చిత్రీకరిస్తున్నారు.
భారత్లో జరిగిన ఎన్నికలపై తాము స్పందించబోమని పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జాహ్రా మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ‘ఇటీవల భారత్లో ముగిసిన ఎన్నికల గురించి లేదా ఆ దేశ అంతర్గత వ్యవహారాల గురించి మేం వ్యాఖ్యానించం. నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ మా పీఎం షరీఫ్ ఓ ట్వీట్ చేశారు. అందుకు ఆయన కూడా బదులిచ్చారు. ఈ విషయంలో ఇంతకు మించి మేం మాట్లాడదల్చుకోలేదు’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.