News June 8, 2024

NDA ప్రభుత్వం ఎన్నాళ్లు ఉంటుందో చూస్తా: మమతా బెనర్జీ

image

NDA ప్రభుత్వం ఎన్నాళ్లు కొనసాగుతుందో చూస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, CAAను ఎత్తివేయాలని పార్లమెంటులో డిమాండ్ చేస్తామని మీడియాతో చెప్పారు. అన్ని రాష్ట్రాలకు పెండింగ్ నిధులను కేంద్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ కేంద్రంలో INDIA కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయకపోయినా.. రేపు పరిస్థితి మారవచ్చని పేర్కొన్నారు.

News June 8, 2024

ఇది క్రేజీ.. నాలుగు గ్రూపుల్లో 3 చిన్న జట్లే టాప్

image

టీ20 వరల్డ్ కప్‌లో చిన్న జట్లు సంచలనాలు సృష్టిస్తున్నాయి. నాలుగు గ్రూపుల్లో మూడు చిన్న జట్లే టేబుల్ టాపర్లుగా ఉండటం దీనికి నిదర్శనం. గ్రూప్-ఏలో USA(4P), గ్రూప్-బీలో స్కాట్లాండ్(3P), గ్రూప్-సీలో అఫ్గానిస్థాన్(4P) టాపర్లుగా ఉన్నాయి. గ్రూప్-డీలో దక్షిణాఫ్రికా(2P) తొలి స్థానంలో ఉంది. అయితే మ్యాచులు జరిగే కొద్ది టేబుల్ టాపర్లు మారే అవకాశం ఉందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

News June 8, 2024

ఈనాడు తొలి సంచిక చూశారా?

image

రామోజీరావు ఈనాడు పత్రికను 1974లో ప్రారంభించారు. అదే ఏడాది AUG 10న తొలి సంచిక వెలువడింది. రామోజీ మరణంతో ఈనాడు తొలి సంచిక ఫొటోను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. USలో సంచలనం సృష్టించిన వాటర్ గేట్ వివాదంతో ఆ దేశ అధ్యక్షుడు నిక్సన్ రాజీనామా చేసిన వార్తను ’ఎట్టకేలకు నిక్సన్ నిష్క్రమణ‘ అంటూ తొలి పేజీలో ప్రధానంగా ప్రచురించారు. మరో 2 నెలల్లో ఈ పత్రిక ప్రచురణ ప్రారంభమై 50 ఏళ్లు పూర్తి కానుంది.

News June 8, 2024

ప్రధాని మోదీ జీతం ఎంతో తెలుసా?

image

భారత ప్రధాని నరేంద్ర మోదీ నెల జీతం రూ.1.66 లక్షలు. ఇందులో బేసిక్ పే రూ.50 వేలుగా ఉంది. అదనంగా.. ప్రధానికి ఖర్చుల నిమిత్తం రూ.3 వేలు, పార్లమెంటరీ భత్యం కింద రూ.45 వేలు చెల్లిస్తారు. వీటితో పాటు దినసరి భత్యం కింద రోజుకు రూ.2 వేలు అందుకుంటారు. ఉచిత నివాస సౌకర్యం, ఇతర సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తుంది. ఆయన ప్రయాణాల ఖర్చులను కేంద్రమే భరిస్తుంది. ప్రధాని రక్షణ బాధ్యతను SPG పర్యవేక్షిస్తుంది.

News June 8, 2024

బెంగాల్: భయంతో పార్టీ ఆఫీసుల్లో BJP కార్యకర్తలు

image

బెంగాల్‌లో BJP కార్యకర్తలపై దాడులు కలకలం రేపుతున్నాయి. TMC కార్యకర్తలు ఇళ్లలోకి చొరబడి దాడులు చేస్తున్నట్లు BJP నేతలు వాపోతున్నారు. దాదాపు 10 వేల మంది BJP కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ విషయంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. కొందరు పార్టీ ఆఫీసుల్లో తలదాచుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ ఎన్నికల్లో TMC 29, BJP 12 సీట్లలో నెగ్గాయి.

News June 8, 2024

అర్జున్ సర్జా ఇంట పెళ్లి సందడి

image

సీనియర్ నటుడు అర్జున్ సర్జా ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమార్తె ఐశ్వర్య ఈ నెల 10న పెళ్లి పీటలెక్కనున్నారు. పెళ్లి సంబరాల్లో భాగంగా ఇవాళ హల్దీ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైట్ అండ్ ఎల్లో కలర్ థీమ్ డ్రెస్‌లతో అర్జున్ ఫ్యామిలీ సభ్యులు సందడి చేశారు. తమిళ నటుడు ఉమాపతి రామయ్యను ఐశ్వర్య పెళ్లాడుతున్నారు.

News June 8, 2024

మోదీ కేబినెట్‌లో JDU నుంచి ఇద్దరికి చోటు!

image

మోదీ 3.0 కేబినెట్‌లో JDU నుంచి ఇద్దరికి స్థానం కల్పించే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. లలన్ సింగ్, రామ్‌నాథ్ ఠాకూర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో లలన్ సింగ్(ముంగర్-బిహార్) MPగా గెలిచారు. రాజ్యసభ ఎంపీ అయిన రామ్‌నాథ్ భారతరత్న గ్రహీత కర్పూరి ఠాకూర్ కుమారుడు. కాగా రేపు మోదీ ప్రమాణస్వీకారానికి ముందు జరిగే సమావేశంలో వీరి ఎంపికపై క్లారిటీ రానుంది.

News June 8, 2024

రామోజీ మనందరికీ మార్గనిర్దేశకులు: ఎడిటర్స్ గిల్డ్

image

మీడియా మొఘల్ రామోజీరావు మృతి పట్ల ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘రామోజీ మరణం విచారకరం. ఎన్నో విషయాల్లో ఆయన మనందరికీ మార్గనిర్దేశకులు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తి. మీడియా రంగానికి ఆయన చేసిన కృషి జర్నలిస్టులందరిలో నిరంతరం స్ఫూర్తి కలిగిస్తుంది’ అని ప్రకటనలో పేర్కొంది. కాగా రామోజీ 1987లో ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకు ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.

News June 8, 2024

రేపే గ్రూప్-1 ఎగ్జామ్.. అభ్యర్థులకు సూచనలివే..

image

TG: ఉదయం 10:30గంటల నుంచి 1గంట వరకు పరీక్ష జరుగుతుంది. 10 గంటలలోపు అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా అనుమతించరు
➦ID కార్డు, హాల్‌టికెట్, ఫొటో తప్పనిసరి
➦అభ్యర్థులు చప్పల్స్‌లోనే రావాలి. బూట్లు ధరించకూడదు
➦బయోమెట్రిక్ వేలిముద్ర వేయాల్సి ఉండటంతో వేళ్లపై మెహెందీ/ఇతర ప్రింటెడ్ రంగులు ఉంచుకోరాదు
➦ఆభరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధం
➽➽మొత్తం 4.03 లక్షల మంది పరీక్ష రాయనున్నారు.

News June 8, 2024

మేమేం తప్పు చేశామో అర్థం కావడం లేదు: భరత్

image

AP: రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినా ప్రజల అభిమానాన్ని సంపాదించలేకపోయామని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ వాపోయారు. అసలు మేమేం తప్పు చేశామో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మేం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చూసి మరోసారి జగనే సీఎం అవుతారని అనుకున్నాం. కానీ అనూహ్యంగా ఓటమిపాలయ్యాం. మా వ్యక్తిగత పనులను పక్కనపెట్టి మరీ ప్రజల కోసం ఐదేళ్లు కష్టపడ్డాం’ అని ఆయన పేర్కొన్నారు.