News June 7, 2024

ముస్లిం రిజర్వేషన్లను కొనసాగిస్తాం: లోకేశ్

image

AP: తలసరి ఆదాయం తక్కువగా ఉన్న ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం బుజ్జగింపు కాదని, సామాజిక న్యాయమని నారా లోకేశ్ చెప్పారు. వారిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. 20ఏళ్లుగా కొనసాగుతున్న రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా తాము మళ్లీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను తొలగించి SC, ST, BCలకు ఇస్తామని మోదీ, అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే.

News June 7, 2024

నామినేటెడ్ పోస్టులు రద్దు

image

AP: రాష్ట్రంలోని నామినేటెడ్ పోస్టులన్నీ రద్దు చేస్తున్నట్లు సీఎస్ నీరభ్ కుమార్ ప్రకటించారు. వివిధ శాఖల నామినేటెడ్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యుల నుంచి రాజీనామాలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. కాగా ఇప్పటికే కొంతమంది నామినేటెడ్ ఛైర్మన్లు రాజీనామా చేశారు. చేయని వారి నుంచి ప్రభుత్వం రాజీనామాలు కోరుతోంది.

News June 7, 2024

NEET ఫలితాల్లో అవకతవకలపై వెంటనే దర్యాప్తు చేపట్టాలి: ప్రియాంక

image

NEET ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని ప్రియాంకా గాంధీ డిమాండ్ చేశారు. ఒకే సెంటర్‌లో పరీక్ష రాసిన ఆరుగురికి 720/720 మార్కులు రావడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. తొలుత ప్రశ్నపత్రం లీకైందని, ఇప్పుడు ఫలితాల్లో స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఈ అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు.

News June 7, 2024

ఏపీలో తొలగింపు.. మరుసటి రోజే తెలంగాణలో పదవి

image

TG: ఏపీ మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. ఆయన్ను రాష్ట్ర నీటిపారుదల శాఖకు సలహాదారుగా నియమించింది. జగన్ ప్రభుత్వంలో ప్రధాన సలహాదారుగా ఉన్న ఆయన్ను నిన్ననే అక్కడి ప్రభుత్వం తొలగించింది. మరుసటి రోజే తెలంగాణ ప్రభుత్వం సలహాదారుగా నియమించడం విశేషం. నీటిపారుదల శాఖలో ఆదిత్యనాథ్ దాస్‌కు సుదీర్ఘ అనుభవం ఉండటంతో రేవంత్ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

News June 7, 2024

రోహిత్ శర్మ చేసే హార్డ్‌వర్క్ చాలా మంది చేయలేరు: అభిషేక్ నాయర్

image

2011 WCకి సెలక్ట్ అవ్వకపోవడం రోహిత్ శర్మలో చాలా మార్పు తీసుకొచ్చిందని మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ అన్నారు. ‘రోహిత్‌ను గిఫ్టెడ్ ప్లేయర్ అని అంటుంటారు. కానీ అతడు చేసే హార్డ్‌వర్క్ చాలా మంది చేయలేరు. 2011 WCకి ఎంపిక కానప్పుడు “నేను చాలా కష్టపడాలి. ప్రజలు కొత్త రోహిత్ శర్మ గురించి చెప్పుకోవాలి” అని అతడు నాతో అన్నారు. ఆ తర్వాత హిట్‌మ్యాన్‌గా మారారు’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

News June 7, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్‌కు బెయిల్

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. తన తల్లి పెద్ద ఖర్మ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ నెల 10 నుంచి 14 వరకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. BRS హయాంలో టాస్క్‌ఫోర్స్ మాజీ DCP ప్రభాకర్ అధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యాపారవేత్తలు, హవాలా వ్యాపారం చేసే వ్యక్తుల నుంచి రూ.కోట్లు కొల్లగొట్టిన కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

News June 7, 2024

చంద్రబాబు ప్రమాణస్వీకారం.. ముహూర్తం ఖరారు

image

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న ఉ.11.27 గంటలకు ప్రమాణం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. CBN ప్రమాణస్వీకారానికి నరేంద్ర మోదీతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు రానున్నారు.

News June 7, 2024

నా తల్లి గౌరవం కోసం వేల ఉద్యోగాలైనా వదులుకుంటా: కౌర్

image

తనకు ఉద్యోగం పోతుందనే భయం లేదని కంగనాపై చేయి చేసుకున్న CISF మాజీ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ అన్నారు. తన తల్లి గౌరవం కోసం ఇలాంటి వేల ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి సిద్ధమని తెలిపారు. కంగనాను చెంపదెబ్బ కొట్టినందుకు అధికారులు ఆమెను జాబ్ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు జాబ్ ఇస్తామంటూ పలువురు ముందుకొస్తున్నారు. డ్యూటీలో ఉండగా ఆమె అలా చేయడం సరైంది కాదని మరికొందరు అంటున్నారు.

News June 7, 2024

5 రోజుల్లో ₹579 కోట్లు సంపాదించిన నారా భువనేశ్వరి!

image

ఏపీలో చంద్రబాబు ఘన విజయంతో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ షేర్లు గత 5 రోజుల్లో రికార్డు స్థాయిలో 55% పెరిగాయి. ఇవాళ కూడా 10% పెరిగి అప్పర్ సర్క్యూట్‌‌ను తాకాయి. జూన్ 3న (ఎన్నికల ఫలితాలకు ముందు రోజు) రూ.424గా ఉన్న హెరిటేజ్ షేర్.. ఇవాళ రూ.661కి చేరింది. తద్వారా ఆ కంపెనీ ప్రమోటర్ భువనేశ్వరి సంపద 5 రోజుల్లో రూ.579 కోట్లు పెరిగినట్లు తెలుస్తోంది. హెరిటేజ్‌లో భువనేశ్వరి 24.37 శాతం వాటాను కలిగి ఉన్నారు.

News June 7, 2024

ధనిక దేశంలో మ్యాచ్ ఫీజు రూ.20 వేలే!

image

టీ20 వరల్డ్ కప్‌లో పసికూనగా బరిలోకి దిగిన USA సంచలనాలు నమోదు చేస్తోంది. పాక్ లాంటి మాజీ ఛాంపియన్‌ను మట్టికరిపించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ జట్టు ప్లేయర్లలో చాలా మంది ఉద్యోగాలు చేస్తూనే ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నారు. వారి మ్యాచ్ ఫీజు కూడా తక్కువేనని తెలుస్తోంది. ఒక్కో మ్యాచ్‌కు కేవలం రూ.20 వేలు చెల్లిస్తున్నారట. భారత క్రికెటర్లకు టీ20 మ్యాచ్ ఫీజు రూ.3 లక్షలుగా ఉంది.