News June 7, 2024

5 రోజుల్లో ₹579 కోట్లు సంపాదించిన నారా భువనేశ్వరి!

image

ఏపీలో చంద్రబాబు ఘన విజయంతో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ షేర్లు గత 5 రోజుల్లో రికార్డు స్థాయిలో 55% పెరిగాయి. ఇవాళ కూడా 10% పెరిగి అప్పర్ సర్క్యూట్‌‌ను తాకాయి. జూన్ 3న (ఎన్నికల ఫలితాలకు ముందు రోజు) రూ.424గా ఉన్న హెరిటేజ్ షేర్.. ఇవాళ రూ.661కి చేరింది. తద్వారా ఆ కంపెనీ ప్రమోటర్ భువనేశ్వరి సంపద 5 రోజుల్లో రూ.579 కోట్లు పెరిగినట్లు తెలుస్తోంది. హెరిటేజ్‌లో భువనేశ్వరి 24.37 శాతం వాటాను కలిగి ఉన్నారు.

News June 7, 2024

ధనిక దేశంలో మ్యాచ్ ఫీజు రూ.20 వేలే!

image

టీ20 వరల్డ్ కప్‌లో పసికూనగా బరిలోకి దిగిన USA సంచలనాలు నమోదు చేస్తోంది. పాక్ లాంటి మాజీ ఛాంపియన్‌ను మట్టికరిపించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ జట్టు ప్లేయర్లలో చాలా మంది ఉద్యోగాలు చేస్తూనే ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నారు. వారి మ్యాచ్ ఫీజు కూడా తక్కువేనని తెలుస్తోంది. ఒక్కో మ్యాచ్‌కు కేవలం రూ.20 వేలు చెల్లిస్తున్నారట. భారత క్రికెటర్లకు టీ20 మ్యాచ్ ఫీజు రూ.3 లక్షలుగా ఉంది.

News June 7, 2024

వాట్సాప్‌లో ‘స్టేటస్ ర్యాంకింగ్’ ఫీచర్

image

ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ ‘స్టేటస్ ర్యాంకింగ్’ అనే ఫీచర్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా యూజర్ల చాట్ హిస్టరీ ఆధారంగా స్టేటస్‌లు ఆర్డర్‌లో కనిపిస్తాయి. తరచుగా చాట్ చేసేవి, రీసెంట్‌గా మెసేజులు చేసిన కాంటాక్ట్‌ల స్టేటస్‌లను టాప్‌లో చూపిస్తుంది. అలాగే ఎక్స్‌పైరీ టైమ్ దగ్గరపడ్డ వాటిని కూడా పైన కనపడేలా డిస్‌ప్లే చేస్తుంది. దీంతో యూజర్లు ముఖ్యమైన అప్‌డేట్స్ కోల్పోకుండా ఉంటారని సంస్థ భావిస్తోంది.

News June 7, 2024

మంగళగిరి AIIMS వద్ద చంద్రబాబు ప్రమాణస్వీకారం?

image

AP: మంగళగిరి ఎయిమ్స్ వద్ద విశాలమైన స్థలంలో చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర నేతలు స్థలాన్ని పరిశీలించారు. నేడో రేపో వేదికను అధికారికంగా పార్టీ ప్రకటించనుంది. కాగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీతోపాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యే అవకాశం ఉంది.

News June 7, 2024

అశోక్ గజపతిరాజు సతీమణికి తీవ్ర అస్వస్థత

image

AP: కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు సతీమణి సునీల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు ఆమెను వెంటనే విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం ఎమ్మెల్యేగా అశోక్ కుమార్తె అదితి విజయలక్ష్మి విజయం సాధించారు.

News June 7, 2024

పాక్‌తో మ్యాచ్ చరిత్ర అవుతుంది: హార్దిక్ పాండ్య

image

T20WCలో ఎల్లుండి పాకిస్థాన్‌తో జరగబోయే మ్యాచ్ తనకు మరింత స్పెషల్‌గా ఉంటుందని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య వెల్లడించారు. ఇది పోరాటం కాదు.. చరిత్ర అవుతుందని పేర్కొన్నారు. ‘పాక్‌తో పోరు ఎప్పుడూ భావోద్వేగంతో ఉంటుంది. ఆనందం, బాధ, ఆందోళన అన్నింటినీ అభిమానులు, ఆటగాళ్లు అనుభవిస్తారు. కచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఉంది’ అని చెప్పారు. హార్దిక్ పాక్‌పై 6 మ్యాచ్‌లలో 84 రన్స్, 11 వికెట్లు పడగొట్టారు.

News June 7, 2024

కాంగ్రెస్: 3 ఎన్నికల్లో 195.. బీజేపీ: 2024లోనే 240

image

2014లో మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి బీజేపీ తిరుగులేని శక్తిగా మారింది. 2014 నుంచి ఇప్పటివరకు 3 ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన మొత్తం సీట్ల కంటే 2024లో బీజేపీ సాధించిన సీట్లు ఎక్కువ కావడం గమనార్హం. హస్తం పార్టీ 2014లో 44, 2019లో 52, 2024లో 99 సీట్లు.. అంటే మొత్తం 195 స్థానాల్లో గెలిచింది. అయితే 2024 ఎన్నికల్లోనే బీజేపీ 240 సీట్లు సాధించింది.

News June 7, 2024

ఈ రాత్రికి మంత్రి పదవులపై స్పష్టత!

image

కేంద్ర మంత్రివర్గ కూర్పుపై ఈ రాత్రికి ఏకాభిప్రాయం వచ్చే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఎన్డీయే పక్ష నేతలు కాసేపట్లో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసానికి వెళ్లనున్నారు. కూటమిలోని పార్టీలకు ఇచ్చే మంత్రి పదవులపై చర్చించనున్నారు. ఆ తర్వాత అమిత్ షా నివాసంలోనూ కసరత్తు చేయనున్నారు. నిన్న మంత్రి పదవులపై మోదీ, బీజేపీ, RSS నేతలు సుదీర్ఘంగా చర్చించారు.

News June 7, 2024

రాష్ట్రంలో ఘర్షణలపై స్పందించిన చంద్రబాబు

image

AP: YCP కవ్వింపు చర్యలపై TDP క్యాడర్ సంయమనం పాటించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కొన్ని చోట్ల వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య నెలకొన్న ఘర్షణల విషయంపై పార్టీ నేతల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు. దాడులు, ప్రతి దాడులు జరగకుండా చూడాలని TDP ఎమ్మెల్యేలు, నేతలను ఆదేశించారు. పోలీసులు సైతం శాంతిభద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.

News June 7, 2024

మన్మోహన్ హయాంలోనే అత్యధిక స్టాక్ మార్కెట్ లాభాలు: బ్లూమ్‌బర్గ్

image

దేశంలో సెన్సెక్స్ పురోగతిపై బ్లూమ్‌బర్గ్ ఆసక్తికర నివేదికను వెల్లడించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాం(2004-14)లోనే స్టాక్ మార్కెట్ అత్యధికంగా 397.79% లాభాలను ఇచ్చినట్లు పేర్కొంది. మోదీ పాలన(2014-24)లో ఇన్వెస్టర్లకు 202.16% రిటర్నులు వచ్చినట్లు తెలిపింది. PV నరసింహారావు హయాం(1991-96)లో 180.76%, వీపీ సింగ్ పాలన(1989-90)లో 91.94% లాభాలు వచ్చాయని చెప్పింది.