India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ లోక్సభ ఎన్నికల్లో 25ఏళ్ల వయసున్న నలుగురు అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచి సత్తాచాటారు. బిహార్లోని సమస్తిపుర్లో శాంభవీ (LJP) 1.87లక్షల మెజార్టీతో గెలుపొందారు. రాజస్థాన్లోని భరత్పుర్ నుంచి పోటీకి దిగిన సంజనా జాతవ్ (కాంగ్రెస్) 51వేల మెజార్టీతో గెలిచారు. ఇక యూపీలోని కౌశాంబి నుంచి పుష్పేంద్ర సరోజ్ (SP) లక్ష మెజార్టీతో గెలుపొందారు. మచలీషెహర్లో ప్రియా సరోజ్ (SP) 35వేల మెజార్టీతో గెలిచారు.
ప్రముఖ ఏఐ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా (Nvidia) మార్కెట్ విలువలో యాపిల్ను దాటేసింది. బుధవారం సంస్థ షేర్లు దూసుకెళ్లడంతో మార్కెట్ విలువ $3 ట్రిలియన్ చేరింది. దీంతో ఆ సంస్థ అత్యంత విలువైన కంపెనీల జాబితాలో రెండో స్థానానికి చేరింది. స్టాక్స్ను మరింత విభజించేందుకు Nvidia సిద్ధమవుతున్న నేపథ్యంలో షేర్లు దూసుకెళ్లాయి. కాగా అగ్రస్థానంలో మైక్రోసాఫ్ట్ ($3.14 ట్రిలియన్) కొనసాగుతోంది.
ఈ లోక్సభ ఎన్నికల్లో 797 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేస్తే 74 మంది విజేతలుగా నిలిచారు. గరిష్ఠంగా బెంగాల్ నుంచి 11 మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికలతో పోలిస్తే మహిళా ఎంపీల సంఖ్య స్వల్పంగా తగ్గింది. అప్పుడు 78 మంది మహిళలు ఎన్నికయ్యారు. దీంతో 18వ లోక్సభలో మహిళా ఎంపీల ప్రాతినిథ్యం 13.62శాతంగా ఉండనుంది. భవిష్యత్తులో ఈ సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి మిత్రదేశాల నేతలను కేంద్రం ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ దేశాల నేతలు ఉన్నారు. మోదీ ఇప్పటికే నేపాల్ పీఎం ప్రచండ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక ప్రెసిడెంట్ విక్రమసింఘేను సంప్రదించారు. నేడు సంబంధిత దేశాల నేతలు అందరికీ అధికారికంగా ఆహ్వానం పంపించొచ్చని సమాచారం. కాగా ఈ వారంలోనే మోదీ ప్రమాణస్వీకారం ఉండనుంది.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఒక్కరోజులో అత్యధిక లావాదేవీలు నమోదు చేసి ప్రపంచ రికార్డ్ సృష్టించింది. నిన్న NSE 1,971 కోట్ల ఆర్డర్లు హ్యాండిల్ చేసిందని, 28.55 కోట్ల లావాదేవీలు నమోదైనట్లు ఎక్స్ఛేంజీ సీఈఓ ఆశిష్ చౌహాన్ వెల్లడించారు. కాగా TDP చీఫ్ చంద్రబాబు, JDU చీఫ్ నితీశ్ కుమార్లు తమ మద్దతు NDAకే అని స్పష్టం చేయడం మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది. దీంతో నిఫ్టీ నిన్న 735 పాయింట్ల లాభంతో ముగిసింది.
జాతీయ పార్టీలకు చెందిన 7,193 మంది అభ్యర్థులు (86.17%) లోక్సభ ఎన్నికల బరిలో నిలిచి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ జాబితాలో బీఎస్పీ అగ్రస్థానంలో ఉంది. ఆ పార్టీ 488 మంది అభ్యర్థులను బరిలోకి దింపగా 97.5% మంది డిపాజిట్ కోల్పోయారు. ఆ తర్వాత స్థానాల్లో సీపీఐ(ఎం)- 57.69%, ఎన్పీపీ- 33.33%, TMC- 10.41%, కాంగ్రెస్- 7.9%, బీజేపీ- 6.12% ఉన్నాయి.
ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్స్లో ఆర్యనా సబలెంకాపై (బెలారస్) గెలుపొందిన మిర్రా ఆండ్రీవా (రష్యా) అరుదైన రికార్డ్ నెలకొల్పింది. 1997 తర్వాత గ్రాండ్ స్లామ్లో సెమీస్లోకి ఎంట్రీ ఇచ్చిన అత్యంత పిన్నవయస్కురాలిగా (17ఏళ్లు) నిలిచింది. 1997 US ఓపెన్లో స్వీస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ 16ఏళ్ల వయసులో సెమీస్కు చేరి రికార్డ్ నెలకొల్పారు. కాగా ఆండ్రీవా, సెమీస్లో జాస్మిన్ను (ఇటలీ) ఎదుర్కోనుంది.
1877: మలయాళ కవి ఉళ్లూర్ పరమేశ్వర అయ్యర్ జననం
1890: అస్సాం తొలి సీఎం గోపినాథ్ బొర్దొలాయి జననం
1915: కమ్యూనిస్టు నేత చండ్ర రాజేశ్వరరావు జననం
1926: రచయిత, కవి గోపగారి రాములు జననం
1929: సినీ నటుడు, రాజకీయవేత్త సునీల్ దత్ జననం
1936: సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు జననం
1947: హాస్యనటుడు సుత్తి వీరభద్రరావు జననం
2015: సినీనటి ఆర్తీ అగర్వాల్ మరణం
భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ఆధ్వర్యంలోని బోయింగ్ స్టార్లైనర్ స్పేస్క్రాఫ్ట్ ప్రయోగం ఎట్టకేలకు సక్సెస్ అయింది. సాంకేతిక కారణాలతో రెండుసార్లు ప్రయోగం వాయిదా పడగా బుధవారం స్పెస్క్రాఫ్ట్ విజయవంతంగా లాంచ్ అయింది. ఈ స్పేస్క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను చేరుకోనుంది. కాగా బోయింగ్ స్పేస్క్రాఫ్ట్ ప్రయోగంలో పాల్గొన్న తొలి మహిళగా సునీత నిలిచారు.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Sorry, no posts matched your criteria.