India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: తిరుమలలో అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామికి పూజలు, హారతి, పుష్ప సమర్పణ చేశారు. తె.4.30 నుంచి ప్రొటోకాల్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి 10రోజులు శ్రీవారు ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇవ్వనున్నారు. అటు శ్రీశైలంలో ఉత్తర ద్వారం నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను వెలుపలికి తీసుకొచ్చి రావణ వాహనంపై గ్రామోత్సవం, రాత్రి వేళ పుష్పార్చన నిర్వహించనున్నారు.
సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు తీర్పును ట్రయల్ కోర్టు ఈనెల 18న వెలువరించనుంది. ఇప్పటికే CBI, నిందితుడు సంజయ్ రాయ్ తరఫు వాదనలు ముగిశాయి. తాము సమర్పించిన సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకొని సంజయ్కు మరణశిక్ష విధించాలని CBI కోరింది. అటు కేసులో సాక్ష్యాలను క్రియేట్ చేసి తన క్లయింట్ను ఇరికించారని నిందితుడి లాయర్ వాదించారు. దీంతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
ఢిల్లీ సరిహద్దుల్లో నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లాల్ ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ అన్నారు. రైతుల పట్ల కేంద్రం క్రూరంగా ప్రవర్తిస్తోందని ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ప్రధాని మోదీ తన ఇగోను పక్కనపెట్టి అన్నదాతలతో చర్చలు జరపాలని సూచించారు. ఈ మొండి వైఖరే గతంలో 700 మంది రైతులను పొట్టనబెట్టుకుందని ప్రియాంక ఆరోపించారు.
ఈనెల 13 నుంచి ప్రారంభంకానున్న మహా కుంభమేళాకు UP సర్కార్ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. భక్తులను అలరించేందుకు గాయకులతో పాటలు పాడించనుంది. శంకర్ మహదేవన్, హరిహరణ్, షాన్ ముఖర్జీ, కైలాశ్ ఖేర్, కవితా కృష్ణమూర్తి, కవితా సేథ్, మాలిని అవస్తీ తదితర కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. మరోవైపు సీఎం యోగి ఆదిత్యనాథ్ నిన్న మేళా ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని అధికారులను ఆదేశించారు.
UPలోని మీరట్లో ఓ ఇంట్లో ఐదుగురి మృతదేహాలు లభించడం కలకలం రేపింది. భార్యాభర్తల శవాలు హాల్లో గుర్తించగా వారి పదేళ్లలోపు ముగ్గురు ఆడపిల్లల డెడ్బాడీలు బెడ్ బాక్స్లో కనిపించాయి. అందరి తలలపై ఆయుధంతో బలంగా కొట్టడంతో తీవ్రమైన గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. బుధవారం నుంచి అనుమానాస్పదంగా ఇంటికి తాళం వేసి ఉండటంతో చుట్టుపక్కల వాళ్ల సమాచారంతో ఈ దారుణం బయటపడింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ముర అనే రాక్షసుడితో పీడింపబడే దేవతలంతా మహావిష్ణువును ప్రార్థిస్తారు. దీంతో మురతో యుద్ధం చేస్తూ ఆయన సింహవతి అనే గుహలోకి ప్రవేశిస్తాడు. స్వామి శక్తి నుంచి ఏకాదశి అనే స్త్రీ ఉద్భవించి మురను సంహరిస్తుంది. విష్ణువు సంతోషించి వరం కోరుకోవాలని అడగగా, ఇవాళ ఉపవాసం ఉన్నవారికి మోక్షం కలిగించమని ఆమె కోరుతుంది. స్వామి తథాస్తు అనడంతో పాటు వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్తాడు. అలా వైకుంఠ ఏకాదశి అయింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గాన్తో మ్యాచ్ను సౌతాఫ్రికా జట్టు బాయ్కాట్ చేయాలని ఆ దేశ స్పోర్ట్స్ మినిస్టర్ గేటన్ మెకెంజీ కోరారు. అఫ్గాన్లో అధికారం చేపట్టినప్పటి తాలిబన్ ప్రభుత్వం మహిళా క్రీడలపై బ్యాన్ విధించిందన్నారు. అఫ్గాన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్పైనా ఆంక్షలు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. తాలిబన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాయ్కాట్ చేయాలన్నారు. కాగా CTలో భాగంగా ఫిబ్రవరి 21న SA-AFG తలపడనున్నాయి.
దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు శ్రీమహావిష్ణువును దర్శించుకునేందుకు 3కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్తారు. అనంతరం వారితో కలిసి స్వామివారు భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అందుకే ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. పవిత్రమైన ఈరోజున ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయి. ఇవాళ ఉపవాసం ఉంటే ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం. మీకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.
ఐదేళ్ల లోపు చిన్నారులు మనం మాట్లాడే మాటలు, చేసే పనులను చూసి చాలా నేర్చుకుంటారు. అందుకే వారి ముందు ఆర్థిక సమస్యల గురించి చర్చించుకోకండి. వారికేం అర్థమవుతుందిలే అనుకోవద్దు. అలాగే గట్టిగా అరుచుకుంటూ గొడవ పడకండి. అది వారి మానసిక ఆరోగ్యాన్ని ఒత్తిడికి గురిచేస్తుంది. వారూ అలానే అరిచే అవకాశం ఉంటుంది. ఇక పిల్లల ముందు ఇతరుల గురించి చెడుగా మాట్లాడితే పెద్దవాళ్ల పట్ల గౌరవం చూపకుండా ఎదురుతిరిగే ప్రమాదం ఉంది.
మాజీ PM ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా ‘ఎమర్జెన్సీ’ని కంగనా రనౌత్ తెరకెక్కించారు. ఆ మూవీ ప్రమోషన్ల సందర్భంగా ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఇందిర చాలా బలహీనమైన వ్యక్తి అని నా పరిశోధనలో అర్థమైంది. ఆమె మీద ఆమెకే నమ్మకం లేదు. అందుకే పరిస్థితులపై మరింత నియంత్రణను కోరుకున్నారు. తన మనుగడకు చాలామందిపై ఆధారపడ్డారు. అయితే ఈ సినిమా ద్వారా ఎవరి మనోభావాల్ని దెబ్బతీయాలన్న ఉద్దేశమూ నాకు లేదు’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.