India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు టీటీడీ నష్టపరిహారం అందజేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన 4 కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసింది. లావణ్య, రజనీ, శాంతి కుటుంబసభ్యులకు రూ.25 లక్షలు అందించింది. అలాగే మృతుల కుటుంబాల్లో ఒకరికి టీటీడీలో కాంట్రాక్టు ఉద్యోగం కల్పించనుంది. మృతుల పిల్లలకు ఉచిత విద్య అందించనుంది.
లాస్ ఏంజెలిస్లో ఏర్పడిన కార్చిచ్చులో బాలీవుడ్ స్టార్ నటి ప్రీతి జింటా చిక్కుకున్నారు. అక్కడి పరిస్థితులను వివరిస్తూ ఆమె ట్వీట్ చేశారు. ‘చుట్టూ జరుగుతోన్న విధ్వంసం చూసి భయాందోళనకు గురయ్యాం. చిన్న పిల్లలు, వృద్ధులతో చాలా మంది పొరుగువారు ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. ఇవన్నీ చూసి నేను హృదయవిదారకంగా ఉన్నా. మమ్మల్ని సురక్షితంగా ఉంచినందుకు దేవుడికి & అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేశారు.
TG: <<15124836>>తాను కేటీఆర్ను పొగిడానంటూ<<>> వచ్చిన వార్తలపై దానం నాగేందర్ స్పందించారు. ‘హైదరాబాద్ ఇమేజ్ను చంద్రబాబు, వైఎస్ పెంచారు. బీఆర్ఎస్, కేటీఆర్ నగరానికి చేసిందేం లేదు. హైడ్రా విషయంలో నా మాట మీదే ఉన్నా. దాని వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఆ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి. ఫార్ములా-ఈ కారు రేసుతో హైదరాబాద్ ఇమేజ్ పెరిగింది. అలా అని నేను కేటీఆర్కు క్లీన్ సర్టిఫికెటేం ఇవ్వడం లేదు’ అని తెలిపారు.
లాస్ ఏంజెలిస్లో కార్చిచ్చు మరింత ఉద్ధృతమవుతోంది. నగరం వైపుగా భీకర గాలులు వీస్తుండటంతో మంటలు ఒక చోట నుంచి మరో చోటుకు వ్యాపిస్తున్నాయి. మంటలు ఆర్పేందుకు అక్కడ తీవ్ర నీటి కొరత ఏర్పడింది. కొన్ని చోట్ల అధికారులు ట్యాంకర్లతో నీటిని తరలించి మంటలు అదుపు చేస్తున్నారు. కాగా కొందరు హాలీవుడ్ స్టార్లు వారికి కేటాయించిన దానికంటే అదనంగా నీటిని వాడుకుని గార్డెన్లు పెంచుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
TG: కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. వీటి కోసం జనవరి 16 నుంచి 20 వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. లబ్ధిదారుల ముసాయిదా జాబితాను 21 నుంచి 24 వరకు గ్రామ, వార్డు సభల్లో పెట్టి ప్రజాభిప్రాయం తీసుకుంటామని చెప్పారు. 26 నుంచి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేస్తామని తెలిపారు. రేషన్ కార్డులకు గత నిబంధనలే వర్తిస్తాయని స్పష్టం చేశారు.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2016, 2019లో సరిగ్గా ఇదేరోజు ఒకే ప్రత్యర్థిపై సెంచరీల మోత మోగించారు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచుల్లో 2016లో 163 బంతుల్లో 171, 2019లో 129 బంతుల్లో 133 రన్స్ చేసి ఔరా అనిపించారు. అయితే, డబుల్ సెంచరీలను సైతం అలవోకగా చేసే సత్తా ఉన్న రోహిత్.. గత కొన్ని రోజులుగా బ్యాటింగ్లో తడబడుతుండటం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.
తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ప్రస్తుతానికి ఎలాంటి సమస్యల్లేవని హీరో విశాల్ చెప్పారు. ‘మా నాన్న ఇచ్చిన ధైర్యం వల్లే జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడుతున్నా. నేను పని నుంచి తప్పించుకుంటానని, 3-6 నెలలకోసారి సినిమాల నుంచి రెస్ట్ తీసుకుంటానని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు నా చేతులు వణకట్లేదు. అంతా బాగానే ఉంది’ అని “మద గజ రాజు” ప్రీమియర్ షోలో వ్యాఖ్యానించారు.
ప్రజలు తమ పాపాలు కడుక్కొనేందుకే గంగలో మునుగుతారని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ అన్నారు. అందుకే వారంతా ప్రయాగ్రాజ్లో జరిగే కుంభమేళాకు వెళ్తారని పేర్కొన్నారు. వారి కోరికలు స్వార్థమైనవని అన్నారు. దీంతో ఆయనపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఎంఐఎం, ఇప్పుడు కాంగ్రెస్ కుంభమేళాను అవమానించాయని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్లు ఎప్పుడూ ఇంతేనని అంటున్నాయి.
కారు కొనాలంటే డబ్బులుంటే చాలు అనుకుంటున్నారా? దానిని పార్క్ చేసుకునేందుకు స్థలం కూడా ఉండాలంటోంది మహారాష్ట్ర ప్రభుత్వం. ట్రాఫిక్ నియంత్రణ, కాలుష్యాన్ని తగ్గించేందుకు సీఎం ఫడణవీస్ కొత్త రూల్ తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీని ప్రకారం కారు రిజిస్ట్రేషన్ సమయంలో ‘పార్కింగ్ ఏరియా’ సర్టిఫికెట్ సమర్పించాలి. ముంబై, నాగ్పుర్, పుణేతో సహా కీలక పట్టణాల్లో ఈ రూల్ వచ్చే అవకాశం ఉంది. దీనిపై మీ కామెంట్?
హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని డెక్కన్ కిచెన్ కూల్చివేతపై సినీ నటులు వెంకటేశ్, రానా, అభిరామ్, సురేశ్ బాబులపై కేసు నమోదైంది. సిటీ సివిల్ కోర్టులో ఈ అంశం పెండింగ్లో ఉండగా డెక్కన్ కిచెన్ కూల్చివేశారని లీజుకు తీసుకున్న నందకుమార్ నాంపల్లి కోర్టుకు వెళ్లారు. వారిపై కేసు నమోదు చేయాలని ఫిలింనగర్ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. దీంతో 448, 452, 458, 120B సెక్షన్ల కింద పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.