India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
క్రిప్టో మార్కెట్లు గత 24 గంటల్లో అదరగొట్టాయి. మార్కెట్ విలువ 2.93% ఎగిసి $3.37Tకి చేరుకుంది. 57% మార్కెట్ డామినెన్స్ ఉన్న బిట్కాయిన్ $94,836 నుంచి 2.43% పెరిగి $97,043 వద్ద ట్రేడవుతోంది. అంటే $2207 (Rs1.87L) లాభపడింది. ఎథీరియం సైతం 2.81% ఎగిసి $3226 వద్ద చలిస్తోంది. XRP ఏకంగా 9.69% పెరిగి $2.79కు చేరుకుంది. BNB 1.54, SOL 2.75, DOGE 5.51, ADA 7.63, AVAX 4.18, XLM 7.81% మేర పెరిగాయి.
సంక్రాంతి వేడుకల్లో నేడు ఆఖరి రోజు కనుమ. ఇవాళ తెలుగు రాష్ట్రాల ప్రజలు మాంసాహారం తినడానికి మొగ్గు చూపుతారు. తెలంగాణలో చాలా మంది నిన్న సంక్రాంతి రోజు సైతం నాన్-వెజ్ లాగించేశారు. ఈ రోజు తెలంగాణతో పాటు ఏపీలో భారీ స్థాయిలో చికెన్, మటన్ కొనుగోళ్లు జరిగే అవకాశం ఉంది. స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర రూ.210 నుంచి రూ.230 వరకు ఉంది. మటన్ రేటు HYDలో రూ.850పైనే ఉంది. మరి ఇవాళ మీరు నాన్-వెజ్ తింటారా? కామెంట్ చేయండి.
భారత వాతావరణ విభాగం(IMD) నేడు 150వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. 1875, జనవరి 15న దీనిని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం స్థాపించింది. 1864, 1866, 1871లో తీవ్రమైన విపత్తులు సంభవించడంతో వాతావరణ పరిస్థితులను ముందుగా అంచనా వేసేందుకు దీనిని నెలకొల్పారు. వాతావరణ పరిస్థితుల్ని కచ్చితత్వంతో అంచనా వేయడంలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. హిందూ మహా సముద్ర తీరంలోని 13 దేశాలతో పాటు సార్క్ దేశాలకు సేవలందిస్తోంది.
బెంచ్మార్క్ సూచీలు పాజిటివ్గా మొదలై రేంజుబౌండ్లో కదలాడే అవకాశం ఉంది. గిఫ్ట్నిఫ్టీ 40PTS మేర పెరగడం దీనినే సూచిస్తోంది. ఆసియా మార్కెట్ల నుంచైతే మిశ్రమ సంకేతాలే అందుతున్నాయి. నేడు విడుదలయ్యే US CIP డేటా కోసం ఇన్వెస్టర్లు ఆత్రుతగా వేచిచూస్తున్నారు. దానిని బట్టే ఫెడ్ వడ్డీరేట్ల కోతపై నిర్ణయం తీసుకుంటుంది. క్రూడ్ ధరలు, బాండ్ యీల్డులు కాస్త కూల్ఆఫ్ అయ్యాయి. డాలర్ ఇండెక్స్ మాత్రం పెరుగుతూనే ఉంది.
AP: సంక్రాంతి వేళ మంత్రి లోకేశ్ తన భార్య బ్రాహ్మణికి మంగళగిరి చేనేత చీరను బహుమతిగా ఇచ్చారు. మంగళగిరి నేతన్నల నైపుణ్యం అద్భుతమని, వారికి అండగా నిలుద్దామని ట్వీట్ చేశారు. దీనికి బ్రాహ్మణి రిప్లై ఇస్తూ.. ‘లోకేశ్ మనసంతా మంగళగిరిలోనే ఉంటుంది. అవకాశం ఉన్న ప్రతిచోటా చేనేతను ప్రమోట్ చేస్తారు. చేనేతలపై అభిమానాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపుతున్నారు’ అని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా రెండు యుద్ధ నౌకలు INS సూరత్, నీలగిరి, ఒక జలాంతర్గామి వాఘ్షీర్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో యుద్ధనౌకలను, జలాంతర్గామిని జాతికి అంకితం చేయనున్నారు. ఈ పర్యటనలోనే ఆయన మహాయుతి కూటమి ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నట్లు డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే తెలిపారు.
TG: సీఎం రేవంత్ ఇవాళ, రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. పార్టీ అధిష్ఠానంతో క్యాబినెట్ విస్తరణ తదితర అంశాలపై చర్చించే అవకాశముంది. అలాగే పలువురు కేంద్ర మంత్రులనూ ఆయన కలవనున్నట్లు సమాచారం. ఢిల్లీ పర్యటన అనంతరం సింగపూర్కు వెళ్లనున్న ఆయన ఈనెల 19 వరకు అక్కడే పర్యటించనున్నారు. ఆ తర్వాత 20 నుంచి 22 వరకు దావోస్లో పర్యటిస్తారు.
బ్రిటన్ యువరాజు విలియమ్ భార్య, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ తాను కాన్సర్ నుంచి బయటపడినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు కాస్త రిలీఫ్గా ఉందని పూర్తిగా కోలుకోవడంపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. గత ఏడాది క్యాన్సర్ బారిన పడినట్లు ప్రకటించిన కేట్ కొంతకాలంగా చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు వస్తున్న స్పందన ఆనందం కలిగిస్తోందని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. మూవీ సక్సెస్ వేడుకల్లో ఆయన మాట్లాడారు. వెంకటేశ్కు ఫ్యామిలీ ఆడియన్స్ను ఎలా ఆకట్టుకోవాలో తెలుసని, ఈ సంక్రాంతికి సరిగ్గా కుదిరిందని చెప్పారు. బెనిఫిట్ షోలకు ఫ్యామిలీస్ రావడం పెద్ద అచీవ్మెంట్ అని తెలిపారు. ఇది వెంకీ సార్ పొంగల్ అని పేర్కొన్నారు. సినిమాకు సపోర్ట్ చేసినవారికి ధన్యవాదాలు తెలిపారు.
‘కనుమ నాడు కాకులు కూడా కదలవు’ అనేది సామెత. ఇవాళ ఎలాంటి ప్రయాణాలు చేయకూడదని పెద్దలు చెబుతారు. దీనికి కారణం పూర్వం ఎడ్ల బండ్ల మీదే ప్రయాణాలు జరిగేవి. కనుమ రోజున పశువులను పూజించి ఏడాదిలో ఈ ఒక్కరోజైనా వాటిని కష్టపెట్టకుండా బండ్లు కట్టొద్దని నిర్ణయించారు. అందుకే ఈరోజున ప్రయాణాలు చేయొద్దని అంటారు.
Sorry, no posts matched your criteria.