News December 19, 2024

చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన

image

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధికసార్లు 50కిపైగా పరుగులు సాధించిన బ్యాటర్‌గా ఆమె నిలిచారు. ఇప్పటివరకు స్మృతి 30సార్లు 50కిపైగా పరుగులు బాదారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో ఆమె ఈ ఘనత సాధించారు. న్యూజిలాండ్ క్రికెటర్ సుజీ బేట్స్(29)ని ఆమె అధిగమించారు. వీరి తర్వాత బెత్ మూనీ (25), స్టెఫానీ టేలర్ (22), సోఫీ డివైన్ (22), వైట్ (20) ఉన్నారు.

News December 19, 2024

తాళాలు ఎక్కడ పెట్టారో మర్చిపోయారా? ఇది మీకోసమే!

image

ఇంట్లో బైక్ కీ, ఇతర గ్యాడ్జెట్స్‌ను ఎక్కడో పెట్టి మర్చిపోతున్న వారికి గుడ్ న్యూస్. అలాంటి వారికోసం జియో వినూత్న పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. JioTag Go పరికరం Find My Device ద్వారా వస్తువులను ట్రాక్ చేస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్లు వారి స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా గ్యాడ్జెట్లు, కీలు ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చు. కీచైన్ మాదిరిగా దీనిని వాడుకోవచ్చు.

News December 19, 2024

ఇల్లు కట్టుకునేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్

image

AP: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో 100 గజాల్లో (2 సెంట్లు) ఇల్లు కట్టుకునేవారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి ప్లాన్ అప్రూవల్ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చింది. అలాగే 300 గజాల్లోపు ఇల్లు నిర్మించుకునేవారికి అనుమతులు సులభతరం చేయనుంది. కాగా ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

News December 19, 2024

100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం.. స్థలం మంజూరుకు సీఎం ఓకే

image

TG: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు స్థలం మంజూరు చేసేందుకు సీఎం రేవంత్ అంగీకరించినట్లు టీడీపీ నేత టీడీ జనార్దన్ తెలిపారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజలందరికీ ఇష్టమైన నటుడు, నాయకుడని సీఎం తెలిపారు. కాగా విగ్రహంతో పాటు ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని జనార్దన్ వివరించారు.

News December 19, 2024

క్రేజ్‌ను క్యాచ్ చేసుకుంటోన్న CROCS

image

CROCS కంపెనీ చెప్పుల గురించి యువతకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది వీటిని ధరించేందుకు ఇష్టపడుతుంటారు. దీంతో ఈ అమెరికన్ కంపెనీ వ్యాపారం భారీగా పెరిగిపోతోంది. 2019లో $1.23 బిలియన్‌గా ఉన్న క్రాక్స్ బిజినెస్ 2023లో మూడింతలు పెరిగి $3.96 బిలియన్ల వ్యాపారం చేసింది. ఈ ఏడాది ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఈ చెప్పుల ధర రూ.2500 – రూ.10000 వరకు ఉంటుంది.

News December 19, 2024

పుష్ప-2 ఆల్‌టైమ్ రికార్డ్!

image

విడుదలైనప్పటి నుంచి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న పుష్ప-2 ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్ల మార్కును దాటింది. ఈ మైలురాయిని అత్యంత వేగంగా దాటిన భారత సినిమాగా చరిత్రకెక్కింది. మూవీ టీమ్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించింది. మూవీ రూ.1508 కోట్లు కలెక్ట్ చేసి కమర్షియల్ సినిమా లెక్కల్ని, బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగరాస్తోందని ప్రకటించింది.

News December 19, 2024

న్యాయ నిపుణులతో కేటీఆర్ చర్చలు.. రేపు క్వాష్ పిటిషన్?

image

TG: ఏసీబీ తనపై <<14924408>>కేసు నమోదు<<>> చేయడంతో మాజీ మంత్రి కేటీఆర్ కోర్టును ఆశ్రయించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. రేపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

News December 19, 2024

టెన్త్, ఇంటర్ పరీక్షల తేదీలు ఇవే..

image

తెలుగు రాష్ట్రాల్లో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూళ్లు వచ్చేశాయి.
*ఏపీ టెన్త్: మార్చి 17 నుంచి 31 వరకు
*ఏపీ ఇంటర్: మార్చి 1 నుంచి 19 వరకు ఫస్టియర్, మార్చి 3 నుంచి 20 వరకు సెకండియర్
*తెలంగాణ టెన్త్: మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు
*తెలంగాణ ఇంటర్: మార్చి 5 నుంచి 24 వరకు ఫస్టియర్, మార్చి 6 నుంచి 25 వరకు సెకండియర్
>> పరీక్షలు రాసే విద్యార్థులకు WAY2NEWS తరఫున ALL THE BEST

News December 19, 2024

ఎన్టీఆర్ ఘాట్ గురించి నేనలా అనలేదు: రాజగోపాల్ రెడ్డి

image

TG: HYDలో ఎన్టీఆర్ ఘాట్ తీసేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ‘తెలుగు జాతికి ఎన్టీఆర్ గర్వకారణం. ఆయనంటే నాకు ఎంతో అభిమానం. సెక్రటేరియట్ పక్కన అసెంబ్లీ కడితే బాగుంటుందని మాత్రమే అన్నాను. కానీ కొన్ని మీడియా ఛానళ్లు నా మాటలను వక్రీకరించాయి. అది సరికాదు. దయచేసి ఇలాంటివి పునరావృతం చేయొద్దు’ అని కోరారు.

News December 19, 2024

మా నాన్నను లాగకండి: అశ్విన్

image

తన బిడ్డ అవమానాల్ని ఎదుర్కోలేక రిటైర్ అయ్యాడని <<14923590>>అశ్విన్ రవిచంద్రన్ తండ్రి వ్యాఖ్యానించిన<<>> సంగతి తెలిసిందే. ఆ విషయంపై అశ్విన్ తాజాగా ట్విటర్లో సరదాగా స్పందించారు. ‘మా నాన్నకు మీడియాతో ఎలా మాట్లాడాలన్న శిక్షణ లేదు. నాన్నా.. ఏంటిది? ఇలా ‘డాడ్ స్టేట్‌మెంట్’ సంస్కృతిని నువ్వు కూడా అనుసరిస్తావని అనుకోలేదు. అందరికీ నా విజ్ఞప్తి ఒకటే. ఆయన్ను క్షమించి, ఒంటరిగా వదిలేయండి’ అని ట్వీట్‌లో కోరారు.