India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: కుమారుడు మంచు మనోజ్పై మోహన్బాబు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 200 మందితో మోహన్ బాబు వర్సిటీలోకి <<15163428>>ప్రవేశించేందుకు<<>> మనోజ్ ప్రయత్నించారని తెలిపారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు అక్కడికి వెళ్లొద్దని పోలీసులు చెప్పినా వినలేదన్నారు. డైరీఫాం గేటు దూకి లోపలకి ప్రవేశించారని పేర్కొన్నారు.
బ్యాంకు ఉద్యోగార్థులకు IBPS గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26లో నిర్వహించే ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల క్యాలెండర్ను విడుదల చేసింది. RRBలో ఆఫీసర్ స్కేల్ 1, 2, 3, ఆఫీస్ అసిస్టెంట్, PSBలో ప్రొబెషనరీ ఆఫీసర్/మేనేజ్మెంట్ ట్రైనీ, స్పెషలిస్ట్ ఆఫీసర్, కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ ఉద్యోగాలకు సంబంధించిన జాబితా ఇందులో ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఇతర పూర్తి వివరాల కోసం <
సంక్రాంతి పండగ ముగియడంతో ప్రజలు మహానగర బాట పట్టారు. గత 3-4 రోజులుగా స్వస్థలాల్లో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసిన వారంతా తిరుగుపయనమయ్యారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ హైవేపై వాహనాల రద్దీ నెలకొంది. పంతంగి టోల్ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. రేపటి నుంచి ట్రాఫిక్ మరింత పెరగనుంది. అటు ఏపీ, తెలంగాణ జిల్లాల్లోని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
AP: ఆన్లైన్ పైరసీ, ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్తో ఇబ్బందులు పడుతున్న గేమ్ ఛేంజర్ మూవీకి మరో షాక్ తగలనున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని థియేటర్లలో ఆ చిత్రం స్థానంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ను రీప్లేస్ చేస్తున్నట్లు సినీ జర్నలిస్టులు చెబుతున్నారు. వెంకీ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలను దిల్ రాజు నిర్మించారు.
ఉక్రెయిన్పై రష్యా మరో భారీ క్షిపణి దాడి చేసింది. 40కి పైగా క్షిపణులు, 70 డ్రోన్లు ఉపయోగించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ముందస్తు విద్యుత్ కోతలు అమలు చేసినట్టు తెలిపారు. ఉక్రెయిన్ సైన్యానికి యుద్ధంలో ఉపకరిస్తున్న గ్యాస్, ఎనర్జీ సదుపాయాలే లక్ష్యంగా రష్యా ఈ దాడి చేసింది. కాగా, ఉక్రెయిన్కు జర్మనీ మరో 60 Anti-Aircraft Missiles పంపనుంది.
MP భోపాల్లో 2024 DEC 19న ఓ కార్ నుంచి 52KGల గోల్డ్, ₹10Cr నగదును IT అధికారులు సీజ్ చేశారు. ఈ మొత్తం RTO మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మదిగా గుర్తించి ఇంట్లో సోదాలు చేయగా ₹500-700Cr అక్రమాస్తులు బయటపడ్డాయి. పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. BJP ప్రభుత్వంలో అవినీతికి ఇదే నిదర్శనమని INC విమర్శిస్తోంది. అయితే 15 నెలల కమల్నాథ్ సర్కార్ కరప్షన్కు మారుపేరని కమల నేతలు కౌంటరిస్తున్నారు.
భారత్లో జరిగే మహాకుంభమేళా అంటే యాపిల్ కో ఫౌండర్, దివంగత స్టీవ్ జాబ్స్కు ఎంతో ఇష్టం. ఆయన 19 ఏళ్ల వయసు(1974)లో తన ఆధ్యాత్మిక, ఆత్మ పరిశీలనతోపాటు కుంభమేళాను సందర్శించాలనే ఆకాంక్షను ప్రస్తావిస్తూ స్నేహితుడు టిమ్ బ్రౌన్కు లేఖ రాశారు. తర్వాత స్టీవ్ భారత్లో దాదాపు 7 నెలలు గడిపారు. 50 ఏళ్ల కిందటి ఈ లెటర్ను వేలం వేయగా దాదాపు రూ.4.32 కోట్లు పలికింది. తాజాగా ఆయన సతీమణి పావెల్ కుంభమేళాకు వచ్చారు.
ఢిల్లీలో BJPని ఓడించే సత్తా ఆప్కు మాత్రమే ఉందని, అందుకే ఆ పార్టీకి మద్దతు ఇచ్చినట్టు అఖిలేశ్ యాదవ్ తెలిపారు. BJPకి వ్యతిరేకంగా పోరాడే ప్రాంతీయ పార్టీలకు INDIA కూటమి నేతలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇండియా కూటమి ఏర్పడినప్పుడే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట వాటికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. కూటమి పార్టీలు SP, TMC, NCP(SP)లు ఆప్కు మద్దతు ప్రకటించాయి.
తెలంగాణలోని జూనియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు రేపటితో ముగియనున్నాయి. వీటికి ఈనెల 11 నుంచి 16 వరకు ఇంటర్ బోర్డు హాలిడేస్ ఇచ్చింది. పండగ సెలవుల్లో ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులు ఎల్లుండి నుంచి కాలేజీ బాట పట్టనున్నారు. ఇక రాష్ట్రంలోని స్కూళ్లకు 17 వరకు సెలవులు ఉన్నాయి. 18న పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. అటు ఏపీలోని స్కూళ్లకు 19 వరకు హాలిడేస్.
జాతీయ జట్టుతోపాటు దేశవాళీ టీమ్లో తనకు చోటు దక్కకపోవడంపై పృథ్వీ షా పరోక్షంగా స్పందించారు. ‘మీరు నన్ను గేమ్ నుంచి తీసేయొచ్చు. కానీ నా వర్క్ను మాత్రం ఆపలేరు’ అని ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ఫిట్నెస్ను మెరుగుపరుచుకునేందుకు అతను కొన్ని వారాలుగా మైదానం, జిమ్లో కసరత్తులు చేస్తున్నారు. ఐపీఎల్లో కూడా పృథ్వీని ఏ జట్టూ కొనుగోలు చేయని విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.