News December 19, 2024

మున్సిపాలిటీ పెట్రోల్ బంకులు: నారాయణ

image

AP: మున్సిపాలిటీల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. తూ.గో జిల్లా రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.95.85 లక్షలతో నిర్మించిన పెట్రోల్ బంకును ఆయన ప్రారంభించారు. ఇందులో మహిళలకే ఉపాధి కల్పించనున్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీల ఆధ్వర్యంలో బంకులు ఏర్పాటు చేస్తామని నారాయణ వెల్లడించారు.

News December 19, 2024

నిరుద్యోగులకు శుభవార్త

image

AP: నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగాలు కల్పించేలా ట్రెయిన్ అండ్ హైర్ ప్రోగ్రామ్‌ను ఏపీ <>నైపుణ్యాభివృద్ధి సంస్థ <<>>నిర్వహిస్తోంది. దీని ప్రకారం కంపెనీలే నిరుద్యోగులకు ఎలాంటి ఫీజు తీసుకోకుండా శిక్షణ ఇచ్చి, ఆ సంస్థలో లేదంటే అనుబంధ సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తాయి. యూనివర్సిటీలు, కాలేజీల్లో శిక్షణ ఇచ్చే సంస్థలకు స్థలం కేటాయించడం, మ్యాన్ పవర్‌ను అందించడంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ సాయం చేస్తుంది.

News December 19, 2024

నిర్లక్ష్యానికి 13 నిండు ప్రాణాలు బలి

image

ముంబై తీరంలో జ‌రిగిన బోటు ప్ర‌మాదానికి నిర్ల‌క్ష్య‌మే ప్ర‌ధాన కార‌ణంగా తెలుస్తోంది. ప్ర‌మాదానికి ముందు నీల్‌క‌మ‌ల్ ఫెర్రీలో స‌రిప‌డా లైఫ్ జాకెట్లు ఉన్నా సిబ్బందితోపాటు, ప‌ర్యాట‌కులు ఎవ‌రూ ధ‌రించలేదు. ర‌క్ష‌ణ చ‌ర్య‌ల నిర్వ‌హ‌ణ‌పై స‌రైన నిఘా కూడా లేకపోవడం గమనార్హం. బోటు మునుగుతున్న సమయంలో రెస్క్యూ బృందాలు లైఫ్ జాకెట్ల‌తో రాక‌పోయివుంటే ఈ ఘ‌ట‌న అతిపెద్ద ట్రాజెడీగా మిగిలేద‌ని అధికారులు తెలిపారు.

News December 19, 2024

శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15గంటల సమయం పడుతోంది. వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి 16 కాంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 70,457 మంది దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.16కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

News December 19, 2024

అమాయకులే వారి ప్రాఫిట్ స్ట్రాటజీ!

image

Stock Marketలో ఎంత సంపాదించార‌న్న‌ది తెలియ‌క‌పోయినా, ఇన్వెస్ట్‌మెంట్ పాఠాల పేరుతో కొంద‌రు రూ.కోట్లు గ‌డిస్తున్నారు. దీంతో అన‌ధికార అడ్వైజ‌రీ బిజినెస్ చేస్తున్న యూట్యూబ‌ర్ల‌పై SEBI కొర‌డా ఝుళిపిస్తోంది. తాజాగా 19 ల‌క్ష‌ల Subscribers ఉన్న ర‌వీంద్ర బాలు భార‌తీపై చ‌ర్య‌లు తీసుకుంది. అన‌ధికార కార్య‌క‌లాపాల‌తో సంపాదించిన ₹9.5Cr తిరిగి చెల్లించాల‌ని ఆదేశించింది. మ‌రో ₹10 ల‌క్ష‌లు జ‌రిమానా విధించింది.

News December 19, 2024

పెన్షన్లపై ప్రభుత్వం కీలక ఆదేశాలు

image

AP: పెన్షన్ల లబ్ధిదారులకు నోటీసుల జారీని ప్రభుత్వం తాత్కాలికంగా పక్కనపెట్టింది. అర్హత లేని వారిని గుర్తించి, నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని సెర్ప్ సీఈవో కలెక్టర్లను మంగళవారం ఆదేశించారు. తాజాగా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పెన్షన్ తీసుకునే అనర్హులకు నోటీసులు జారీ చేయవద్దని SMSల ద్వారా సూచించారు. ఇవాళ్టి క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం దీనిపై మరేదైనా నిర్ణయం తీసుకుంటుందేమో చూడాలి.

News December 19, 2024

ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతం

image

జ‌మ్మూక‌శ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో గురువారం ఉద‌యం జ‌రిగిన భారీ ఎన్‌కౌంట‌ర్‌లో ఐదుగురు ఉగ్ర‌వాదులు హతమయ్యారు. నిఘా వర్గాల సమాచారంతో జిల్లాలోని సరిహద్దు ప్రాంతంలో బుధవారం రాత్రి నుంచి భ‌ద్ర‌తా ద‌ళాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదుల్ని బలగాలు మ‌ట్టుబెట్టాయి. ఇద్ద‌రు సైనికులు కూడా గాయ‌ప‌డ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 19, 2024

నేడు గంట ముందుగానే అసెంబ్లీకి CM రేవంత్ రెడ్డి

image

TG: సీఎం రేవంత్ రెడ్డి నేడు గంట ముందుగానే అసెంబ్లీకి చేరుకోనున్నారు. కమిటీ హాలులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. నేడు భూభారతి, రైతు భరోసాపై సభలో చర్చ జరగనుంది. ఈ సందర్భంగా ఆయన వారికి దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

News December 19, 2024

నటుడు చంద్రబాబు బయోపిక్‌లో ధనుష్?

image

కోలీవుడ్ దివంగత హాస్య‌నటుడు చంద్రబాబు బయోపిక్‌ తీసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ గోపాల్ వన్ స్టూడియోస్ సన్నద్ధమవుతోంది. హీరోహీరోయిన్ల కంటే ఎక్కువగా పారితోషికం తీసుకున్న నటుడిగా చంద్రబాబు గుర్తింపు పొందారు. ది లెజెండ్ ఆఫ్ చంద్రబాబు నవల ఆధారంగా చిత్రం తెరకెక్కించనున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ లీడ్ రోల్ చేస్తారని టాక్. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ధనుష్ ప్రస్తుతం ఇళయరాజా బయోపిక్ చేస్తున్నారు.

News December 19, 2024

కైలాస్ మానసరోవర్ యాత్రకు లైన్ క్లియర్

image

భారత్-చైనా స‌రిహ‌ద్దు అంశాల‌పై మ‌రో కీల‌క ముంద‌డుగు ప‌డింది. జిజాంగ్ (టిబెట్) ప్రాంతంలో కైలాస్ మానసరోవర్ యాత్ర తిరిగి ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీక‌రించాయి. అజిత్ దోవ‌ల్‌, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మ‌ధ్య ఐదేళ్ల త‌రువాత జ‌రిగిన చ‌ర్చ‌ల్లో 6 అంశాల‌పై ఏకాభిప్రాయం కుదిరింది. శాంతి స్థాపన, న‌దీ జ‌లాలు, సిక్కిం-టిబెట్‌ మధ్య ఉండే నాథులా వాణిజ్య స‌రిహ‌ద్దు అంశాల‌పై ఇరు దేశాలు పురోగ‌తి సాధించాయి.