News January 15, 2025
మీరు గేమ్ నుంచి తీసేయొచ్చు.. కానీ నా వర్క్ను ఆపలేరు: పృథ్వీ షా

జాతీయ జట్టుతోపాటు దేశవాళీ టీమ్లో తనకు చోటు దక్కకపోవడంపై పృథ్వీ షా పరోక్షంగా స్పందించారు. ‘మీరు నన్ను గేమ్ నుంచి తీసేయొచ్చు. కానీ నా వర్క్ను మాత్రం ఆపలేరు’ అని ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ఫిట్నెస్ను మెరుగుపరుచుకునేందుకు అతను కొన్ని వారాలుగా మైదానం, జిమ్లో కసరత్తులు చేస్తున్నారు. ఐపీఎల్లో కూడా పృథ్వీని ఏ జట్టూ కొనుగోలు చేయని విషయం తెలిసిందే.
Similar News
News February 11, 2025
2026 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: దీదీ

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప.బెంగాల్ CM, TMC అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. కాంగ్రెస్, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. ‘ఢిల్లీలో AAPకు కాంగ్రెస్, హరియాణాలో కాంగ్రెస్కు AAP మద్దతివ్వలేదు. అందుకే BJP గెలిచింది. కానీ ఇక్కడ మన పార్టీ ఒక్కటే చాలు. వరుసగా నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అని పార్టీ MLAల సమావేశంలో వ్యాఖ్యానించారు.
News February 11, 2025
CTలో బుమ్రా ఆడతాడా? తేలేది నేడే!

ఈనెల 19 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. జట్టులో మార్పులకు ఇవాళ్టితో గడువు ముగియనున్న నేపథ్యంలో బీసీసీఐ నేడు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆయన పరిస్థితిని మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోంది. ఒకవేళ ఆయన ఈ టోర్నీకి దూరమైతే భారత జట్టుకు పెద్ద లోటే అని చెప్పవచ్చు.
News February 11, 2025
GBS కేసులపై మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటన

మహారాష్ట్రలో ఇప్పటివరకు 192 మంది గిలియన్ బార్ సిండ్రోమ్ (<<15225307>>GBS<<>>) అనుమానిత రోగులను గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో 167 మందికి GBS ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపింది. మొత్తం 7 అనుమానిత మరణాలు నమోదయ్యాయని, ఒకరు GBSతో మరణించినట్లు తేలిందని పేర్కొంది. రోగుల్లో 20-29 ఏళ్ల వయసు వారే ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.