India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
APలో ఈసారి కూటమి అధికారంలోకి వస్తుందని పలువురు జ్యోతిష్యం చెప్పగా కొందరు మాత్రమే అంకెలతో సహా కొందరే అంచనా వేయగలిగారు. అందులో మన్యం విజయేంద్ర ఒకరు. TDP+JSP+BJP కూటమికి 140కి పైగా స్థానాలు వస్తాయని ఈయన జ్యోతిష్య ఫలితం వెల్లడించారు. విజయేంద్ర అంచనాలను Way2News కూడా పబ్లిష్ చేసింది. ఇప్పుడు ఎన్నికల్లో ఇదే రిజల్ట్ రావడం మనం చూస్తున్నాం.
పంజాబ్లో బీజేపీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. మొత్తం 13 స్థానాల్లో ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయింది. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న AAP 3 స్థానాల్లో గెలుపొందింది. అత్యధికంగా కాంగ్రెస్ 7 చోట్ల జయకేతనాన్ని ఎగురువేసింది. స్వతంత్రులు 2, శిరోమణి అకాళీదల్ ఒక స్థానంలో గెలుపొందాయి. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ జైలులో ఉండి పోటీ చేసిన అమృత్ పాల్(1,97,120)కి రావడం గమనార్హం.
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 286 సీట్లు సాధించింది. మరో 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 196 సీట్లలో గెలించింది. మరో 3 చోట్ల లీడింగ్లో ఉంది. ఇతరులు 50 స్థానాల్లో విజయకేతనం ఎగురవేయగా.. ఒకచోట ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరికొన్ని గంటల్లో క్లియర్ పిక్చర్ రానుంది.
ఎన్నికల ఫలితాలపై ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ సంతోషంగా ఉంది. 100 సీట్లతో కాంగ్రెస్ కూడా హ్యాపీనే. UPలో ప్రదర్శనపై SP, మహారాష్ట్రలో గెలుపొందిన సీట్ల పట్ల NCP-SP, SS- UBT, బెంగాల్లో ప్రభంజనం సృష్టించడంపై TMC సంతోషంగా ఉన్నాయి. ఈ ఫలితాలతో ఎలక్షన్ కమిషన్ ఊపిరి పీల్చుకుంది. EVMలపై నిందలు లేవు. ఇది సబ్కా సాథ్ సబ్కా వికాస్’ అని పోస్ట్ పెట్టారు.
AP: మద్య నిషేధ హమీని పక్కనపెట్టి కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టడమూ YCP ఓటమికి ఓ కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డబ్బు పెట్టినా తాము కోరుకున్న బ్రాండ్లు దొరకకపోవడంతో మందుబాబులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసినట్లు తెలుస్తోంది. నాణ్యమైన మద్యం ఇవ్వాలని వారు కోరినా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. తమ ఓటు బ్యాంకులో అసలు మందుబాబులే లేరని సజ్జల కూడా వాదించారు. దీనినే TDP క్యాష్ చేసుకుంది.
రాహుల్ ద్రవిడ్ను భారత జట్టు కోచ్గా కొనసాగాలని తాను వ్యక్తిగతంగా కోరినట్లు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. ఆయన వెళ్లడం తాను చూడాలనుకోవట్లేదని తెలిపారు. తన మొదటి అంతర్జాతీయ కెప్టెన్ ద్రవిడ్ అని, ఒక రోల్ మోడల్ అని కొనియాడారు. ఏళ్లుగా జట్టు కోసం చాలా చేశారని పేర్కొన్నారు.
తెలుగోడి ఆత్మగౌరవ నినాదంతో 1982 మార్చి 29న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆవిర్భవించిన 9 నెలలకే 1983 ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభంజనం సృష్టించింది. 1983, 85, 89, 94లలో శాసనసభకు ఎన్నికలు జరగ్గా NTR సారథ్యంలో టీడీపీ 3 సార్లు విజయం సాధించింది. 1994 తర్వాతి పరిణామాలతో చంద్రబాబు ఆ పార్టీ బాధ్యతలు చేపట్టి 1995లో సీఎం అయ్యారు. బాబు హయాంలో 1999, 2014, 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది.
ఏపీ ఎన్నికలు ఫలితాలు వెలువడిన వేళ I-PAC టీమ్ వైఎస్ జగన్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్ చేసింది. ‘2024 AP ఎన్నికలు వైఎస్ఆర్సీపీతో మళ్లీ కలిసి పనిచేసేలా చేశాయి. I-PAC & దాని నిపుణులందరు కలిసి ఎన్నికల్లో గెలుపుకోసం కష్టపడ్డాం. ఫలితం ఎలా ఉన్నప్పటికీ వైఎస్ జగన్ నాయకత్వం అందరికీ స్ఫూర్తి. మాపై ఆయన నమ్మకం ఉంచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని Xలో పోస్ట్ చేసింది.
ఎన్నికల ముందు ట్విటర్ వేదికగా పవన్ కళ్యాణ్పై సెటైర్లు వేసిన డైరెక్టర్ ఆర్జీవీ దారికొచ్చారు. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో విజయఢంకా మోగించడంతో ఆయన కళ్లు బైర్లు కమ్మినట్టున్నాయి. దీంతో ట్విటర్లో ‘హేయ్ పవన్ కళ్యాణ్’ అంటూ దండాలు పెట్టే ఎమోజీలను పోస్ట్ చేశారు. దీంతో ‘ఇప్పుడు తెలిసిందా పవన్ అంటే ఏంటో?’ అని ఆయన ఫ్యాన్స్ ఆర్జీవీని ప్రశ్నిస్తున్నారు.
మహారాష్ట్రలో అమరావతి సిట్టింగ్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి నవనీత్ కౌర్ రానా ఓడిపోయారు. ఆమెపై కాంగ్రెస్ అభ్యర్థి బల్వంత్ వాంఖడే 19,731 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వాంఖడేకు 5,26,271 ఓట్లు, నవనీత్ రానాకు 5,06,540 ఓట్లు పోలయ్యాయి. నవనీత్ తెలుగులో పలు సినిమాలు చేశారు. మరోవైపు ముంబై నార్త్ స్థానం నుంచి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కాంగ్రెస్ అభ్యర్థి భూషణ్ పాటిల్పై 3.52 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు.
Sorry, no posts matched your criteria.