India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్(25) త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ముంబై బిజినెస్మెన్ రవి ఘాయ్ మనమరాలు సానియా ఛందోక్తో ఇవాళ అతని నిశ్చితార్థం జరిగినట్లు జాతీయ మీడియా పేర్కొంది. దీనిపై సచిన్ ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వేడుకకు అతికొద్దిమంది సన్నిహితులు హాజరైనట్లు సమాచారం. అర్జున్ దేశవాళీ క్రికెట్లో గోవాకు, IPLలో MIకి ఆడుతున్నారు.
ఢిల్లీలో వీధికుక్కల తరలింపు ఆదేశాలపై విమర్శలు వ్యక్తమవడంపై సుప్రీంకోర్టు పునరాలోచించనుంది. ఈ కేసు విచారణ కోసం కొత్త బెంచ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది పిటిషన్లపై రేపు విచారణ చేపట్టనుంది. కాగా ఢిల్లీలోని కుక్కలను 8 వారాల్లోగా షెల్టర్లకు తరలించాలన్న సుప్రీం ఇటీవల ఇచ్చిన తీర్పుపై సినీ, రాజకీయ, జంతు ప్రేమికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన విషయం తెలిసిందే.
AP: మెగా డీఎస్సీ స్కోర్ కార్డులు ఇటీవల <<17374210>>విడుదలైన<<>> విషయం తెలిసిందే. అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత సవరించిన టెట్ మార్కులతో అనుసంధానించిన స్కోర్ కార్డులను ఇవాళ రాత్రి నుంచి <
TG: గ్రూప్-2 అభ్యర్థుల సెకండ్ స్పెల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలను TGPSC విడుదల చేసింది. ఆగస్టు 20 నుంచి 23 వరకు అభ్యర్థులు సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీలో వెరిఫికేషన్ చేయించుకోవాలంది. అభ్యర్థులు ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు ఆప్షన్లు ఎంచుకోవాలని వెల్లడించింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరుకాని అభ్యర్థులు తదుపరి ప్రక్రియకు ఎంపికకారని TGPSC తెలిపింది. మరిన్ని వివరాలకు <
AP, TGలో కుండపోత వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో స్కూళ్లకు రేపు కూడా సెలవు ప్రకటించారు. ఇప్పటివరకు TGలోని జగిత్యాల, హనుమకొండ, WGL, జనగామ, యాదాద్రి, మహబూబాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, MDK, మంచిర్యాల, VKB జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు ఇచ్చారు. ఆదేశాలను స్కూళ్ల యాజమాన్యాలు తప్పకుండా పాటించాలని కలెక్టర్లు, DEOలు హెచ్చరించారు. అటు APలోని గుంటూరు, NTR, బాపట్ల, ప.గో జిల్లాలోనూ స్కూళ్లకు సెలవు ఉండనుంది.
TG: గవర్నర్ కోటా MLCల ఎన్నికపై <<17393463>>సుప్రీంకోర్టు తీర్పు<<>> BJP, కాంగ్రెస్కు చెంపపెట్టు అని KTR అన్నారు. ‘గతంలో BRS పంపిన MLC ప్రతిపాదనలకు BJP అడ్డుపడింది. ఈ ప్రక్రియ పెండింగ్లో ఉండగానే కాంగ్రెస్ మరో ఇద్దరి పేర్లను సిఫారసు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. ఈ రెండు ఢిల్లీ పార్టీల అప్రజాస్వామిక విధానాలు సాగనివ్వమని చాటిచెప్పిన న్యాయవ్యవస్థకు శిరస్సు వంచి సలాం చేస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.
రష్యా చమురు కొంటున్నందుకే భారత్పై 25% అదనపు సుంకాలు వేశామన్న ట్రంప్ మున్ముందు సంకట స్థితిని ఎదుర్కోవచ్చు. ఉక్రెయిన్పై యుద్ధానికి మనం ఫండింగ్ చేస్తున్నామన్నదే ఆయన ఆరోపణ. మరికొన్ని రోజుల్లో అలస్కాలో పుతిన్తో ట్రంప్ భేటీ కానున్నారు. అక్కడ సీజ్ఫైర్ ఒప్పందం కుదిరితే యుద్ధం ఆగిపోతుంది. అప్పుడు భారత్ చమురు కొంటే USకు అభ్యంతరం ఉండదా? సుంకాలు నిలిపేస్తుందా? మరో సాకు చెబుతుందా? అనేది వేచిచూడాలి.
మినిమం బ్యాలెన్స్పై ICICI వెనక్కి తగ్గింది. అర్బన్ ఏరియాల్లో కొత్త కస్టమర్ల మినిమం <<17349792>>యావరేజ్ బ్యాలెన్స్ను<<>> రూ.50వేల నుంచి రూ.15వేలకు తగ్గించింది. ఇక సెమీ అర్బన్ ఏరియాల్లో రూ.25వేల నుంచి రూ.7,500కు సవరించింది. సెమీ అర్బన్, రూరల్ ఏరియాల్లో పాత కస్టమర్ల మినిమం బ్యాలెన్స్ రూ.5వేలలో ఎలాంటి మార్పు చేయలేదు. బ్యాలెన్స్ మెయింటెనెన్స్ను ఇటీవల ICICI భారీగా పెంచడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
రేపు NTR-హృతిక్ రోషన్ ‘వార్ 2’, రజినీకాంత్ ‘కూలీ’ రిలీజ్ కానున్నాయి. టికెట్లు సైతం భారీగా బుక్ అయ్యాయి. తమ అభిమాన హీరో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. సినిమా ఫస్ట్ డే కాకపోతే మరునాడైనా చూడొచ్చు. అంతేగానీ థియేటర్ల వద్ద ఎగబడి ప్రాణాల మీదకు తెచ్చుకోకపోవడం మంచిది. మీరేమంటారు?
దేశ వ్యాప్తంగా 654 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఆగస్టు 27 వరకు పొడిగించారు. ఇవాళ్టితో గడువు ముగియనుండగా దాన్ని పెంచారు. ప్రస్తుతం 5వ క్లాస్ చదువుతున్న వారు దరఖాస్తు చేసేందుకు అర్హులు. APలో 15, TGలో 9 నవోదయ స్కూల్స్ ఉన్నాయి. DEC 13న పరీక్ష నిర్వహిస్తారు. 2026 మార్చిలో ఫలితాలను వెల్లడిస్తారు. దరఖాస్తు చేసేందుకు <
Sorry, no posts matched your criteria.