India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: నేడు విశాఖలో జరగాల్సిన ‘ఐఎన్ఎస్ నిర్దేశక్’ నౌక జాతికి అంకితం కార్యక్రమం మధ్యాహ్నానికి వాయిదా పడింది. కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి సంజయ్ సేథ్ ఉదయం విశాఖ చేరుకోవాల్సి ఉండగా, ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో పాటు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమానం హైదరాబాద్కు మళ్లించారు. కేంద్ర మంత్రి మధ్యాహ్నం విశాఖ చేరుకోనున్నారు.
TGSRTCలో కొత్తగా 3,039 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో వెల్లడించారు. జిల్లా కేంద్రాలకు లింక్ రోడ్లు ఏర్పాటు చేయబోతున్నామని, వేములవాడ, ధర్మపురి, కొండగట్టు క్షేత్రాలను కలుపుతూ బస్సుల లింకింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో RTCలో 55,000 మంది ఉద్యోగులుంటే, ప్రస్తుతం 40,000 మంది ఉన్నారని చెప్పారు. 15 ఏళ్లు దాటిన బస్సులను స్క్రాప్కు పంపిస్తున్నామన్నారు.
బ్రిస్బేన్ టెస్టులో 5వ రోజు వర్షం వల్ల ఆటకు అంతరాయం ఏర్పడగా అంపైర్లు లంచ్ బ్రేక్ ప్రకటించారు. ఉదయం ఆట ప్రారంభమైన కాసేపటికే ఇండియా ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్కు రావాల్సి ఉండగా వర్షం మొదలైంది. ప్రస్తుతం వాన ఆగిపోగా, తిరిగి జల్లులు పడకపోతే 8.10 తర్వాత మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇండియా 260 రన్స్కు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా 185 రన్స్ ఆధిక్యంలో ఉంది.
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. దర్శనం కోసం 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న వేంకటేశ్వరస్వామిని 63,598 మంది దర్శించుకున్నారు. వీరిలో శ్రీవారికి 20,102 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.59 కోట్లు వచ్చినట్లు TTD ప్రకటించింది.
బిట్కాయిన్ మరో రికార్డు సృష్టించింది. మంగళవారం తొలిసారి $1,08,353 (Rs 92L) మైలురాయిని టచ్చేసింది. ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడంతో చివరికి $75 లాభంతో $1,06,133 వద్ద ముగిసింది. నేడు అదే స్థాయి వద్ద మొదలై $75 నష్టంతో $1,06,085 వద్ద కొనసాగుతోంది. Market cap $2.09Tగా ఉంది. గత 24 గంటల్లో 2.82% నష్టపోయిన ఎథీరియమ్ ప్రస్తుతం $3,876 వద్ద ట్రేడవుతోంది. XRP 3.96, SOL 2.94% మినహా మిగిలినవి నష్టపోయాయి.
AP: ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మధ్యాహ్న భోజనం అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జనవరి 1 నుంచి దీన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. దీని ద్వారా దాదాపు 1.20 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఉచితంగా అందనుంది. రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం లభించే ఛాన్సుంది. కాగా ప్రస్తుతం 45 వేల ప్రభుత్వ స్కూళ్లల్లో మాత్రమే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉంది.
ఈ శుక్రవారం నాలుగు ఇంట్రస్టింగ్ సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. అల్లరి నరేశ్ నటించిన ‘బచ్చలమల్లి’, ఉపేంద్ర ‘UI ది మూవీ’, విజయ్ సేతుపతి ‘విడుదల పార్ట్-2’తో పాటు మహేశ్ బాబు వాయిస్ ఓవర్ అందించిన ‘ముఫాసా: ది లయన్ కింగ్’ కూడా రిలీజ్ కానుంది. వీటన్నింటిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. మరి వీటిలో మీరు ఏ మూవీ చూడబోతున్నారో కామెంట్ చేయండి.
స్టాక్మార్కెట్లు నేడూ నష్టాల్లోనే మొదలవ్వొచ్చు. గిఫ్ట్ నిఫ్టీ 67PTS మేర తగ్గడం దీనినే సూచిస్తోంది. US FED వడ్డీరేట్ల కోత నిర్ణయం కోసం వేచిచూస్తున్న ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎకానమీ, ఇన్ఫ్లేషన్ డేటా వచ్చేంత వరకు అనిశ్చితి తప్పకపోవచ్చు. నిన్న US, EU సూచీలన్నీ ఎరుపెక్కాయి. నేడు ఆసియా మార్కెట్లూ నష్టాల్లోనే ఆరంభమయ్యాయి. STOCKS 2 WATCH: AXIS BANK, NATIONALUM, OBEROIRLTY, UNITDSPR, VBL
AP: అర్హత లేని వారికి పెన్షన్లు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనర్హులుగా గుర్తించిన వారికి తొలుత నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. లబ్ధిదారుల వివరణ ఆమోదయోగ్యంగా ఉంటే పింఛను కొనసాగించాలని, అర్హతలు నిరూపించుకోలేకపోతే రద్దు చేయాలని సూచించింది. నోటీసులకు స్పందించని వారి పింఛన్లను హోల్డ్లో పెట్టాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 3.5 లక్షల మంది అనర్హులున్నట్లు అంచనా.
AP: EAPCET(Bi.P.C) స్ట్రీమ్ తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఆప్షన్ల నమోదుకు రేపటి నుంచి 22 వరకు అవకాశం కల్పించింది. 22న వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చు. 24న సీట్లు కేటాయిస్తారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా బయో, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, బీఫార్మసీ, ఫార్మా-డీ కోర్సుల్లో చేరవచ్చు.
Sorry, no posts matched your criteria.