News June 4, 2024

ఓటమి దిశగా ప్రజ్వల్

image

లైంగిక వేధింపుల కేసు నిందితుడు జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఓటమి దిశగా సాగుతున్నారు. కర్ణాటకలోని హసన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయనపై ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయస్ పటేల్ 43వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత ఆయన లీడింగ్‌లో కొనసాగగా ఇప్పుడు రెండోస్థానానికి పడిపోయారు.

News June 4, 2024

ప్రజలకు గుర్తుంది.. పార్టీలకు గుర్తే మిగిలింది!

image

మహారాష్ట్రలో శివసేనను చీల్చి అసలైన శివసేన గుర్తు పొందిన CM ఏకనాథ్ శిండే వర్గానికి 5 సీట్లొచ్చాయి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వ శివసేన 11 చోట్ల గెలుపు వైపు పయనిస్తోంది. ఇక NCPని విభజించి ఆ లోగో పొందిన అజిత్ పవార్ గ్రూపుకు ఒక్క సీటే దక్కగా శరద్ పవార్ NCP 6 చోట్ల ఆధిక్యంలో ఉంది. దీంతో చీల్చిన వర్గాలకు గుర్తులు తప్ప ఓట్లు మిగులలేదు. ఓటర్లంతా గుర్తుంచుకుంటారు అనేందుకు ఇదే ఉదాహరణ అని విశ్లేషకులు చెబుతున్నారు.

News June 4, 2024

ఉమ్మడి చిత్తూరులో పెద్దిరెడ్డి ఫ్యామిలీ సేఫ్

image

AP: రాయలసీమలోని అన్ని జిల్లాల్లో వైసీపీకి ఎదురుగాలి వీయగా.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి ఫ్యామిలీ మాత్రం సేఫ్ జోన్‌లో ఉంది. పుంగనూరు అసెంబ్లీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందంజలో ఉండగా.. ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లెలో లీడింగ్‌లో ఉన్నారు. ఇటు రాజంపేట లోక్‌సభ బరిలో నిలిచిన పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి 47,792 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

News June 4, 2024

పార్టీల ఓటు షేర్ ఇలా..

image

AP: అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ భారీ ఓటు షేర్‌ను సాధించింది. మధ్యాహ్నం 1.30కు అందిన సమాచారం ప్రకారం టీడీపీకి 45 శాతం, వైసీపీకి 39.43 శాతం, జనసేనకు 8.63 శాతం ఓట్లు వచ్చాయి. మొత్తంగా టీడీపీ 132, జనసేన 20, వైసీపీ 16, బీజేపీ ఏడు స్థానాల్లో గెలుపు దిశగా సాగుతున్నాయి.

News June 4, 2024

ప్రశ్నార్థకంగా బీఆర్ఎస్ భవిష్యత్!

image

TG: తెలంగాణలో BRS బోణీ కొట్టకపోవడంతో ఆపార్టీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కేంద్రంలో చక్రం తిప్పుతామనే గులాబీ పార్టీ ఆశలు అడియాశలయ్యాయి. ఇప్పటికే రాష్ట్రంలో అధికారం కోల్పోగా.. ఇప్పుడు ఎంపీ సీట్లు అయినా గెలిచి పార్టీలో నూతన ఉత్తేజం తీసుకొద్దామనుకున్నా మొండిచేయి ఎదురైంది. మరి పార్టీ పునరుత్తేజం కోసం కేసీఆర్ ఎలాంటి అడుగులు వేస్తారో వేచి చూడాలి.

News June 4, 2024

జైపూర్‌లో బీజేపీ ఘన విజయం

image

రాజస్థాన్‌లో బీజేపీ ఖాతా తెరిచింది. జైపూర్‌లో ఆ పార్టీ అభ్యర్థి మంజు శర్మ భారీ మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ సింగ్‌పై ఆమె 3,31,767 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించినట్లు ఈసీ ప్రకటించింది.

News June 4, 2024

భారీ మెజారిటీతో RRR గెలుపు

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘురామకృష్ణరాజు విజయం సాధించారు. 56,777 ఓట్ల భారీ మెజారిటీతో విజయదుందుభి మోగించారు. అక్కడ వైసీపీ అభ్యర్థి వెంకట లక్ష్మి నరసింహరాజుకు 60,125 ఓట్లు రాగా, RRRకు 1,16,902 ఓట్లు పోలయ్యాయి.

News June 4, 2024

ఆప్ మరోసారి ఫెయిల్!

image

ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ మరోసారి ఘోర పరాజయం దిశగా సాగుతోంది. 7 స్థానాల్లో ఒక్క చోట కూడా మెజారిటీలో లేదు. ఆప్ CM కేజ్రీవాల్‌తో సహా మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ జైలుకు వెళ్లడం ఆ పార్టీకి ప్రతికూలంగా మారినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు కేజ్రీవాల్ బెయిల్‌పై వచ్చి ప్రచారం నిర్వహించినా ప్రయోజనం చూపలేదని కౌంటింగ్ సరళిని చూస్తే అర్థమవుతోంది. 2019 ఎన్నికల్లోనూ ఈ పార్టీ ఘోర ఓటమి పాలైంది.

News June 4, 2024

ఎన్నికల చరిత్రలో రికార్డు ఆధిక్యం

image

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ BJP అభ్యర్థి శంకర్ లల్వానీ 8.4లక్షల ఓట్ల ఆధిక్యంతో రికార్డు సృష్టించారు. LS ఎన్నికల చరిత్రలో ఓ అభ్యర్థి ఈ స్థాయిలో లీడింగ్‌లో ఉండటం ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డు BJP నేత ప్రీతమ్ ముండే(6.9L) పేరిట ఉండేది. కాగా ఈసారి ఇండోర్‌లో INC అభ్యర్థి చివరి నిమిషంలో నామినేషన్ వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ నోటా 1.8లక్షల ఓట్లతో ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతోంది.

News June 4, 2024

BIG BREAKING: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు

image

జనసేనాని అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. పవర్ స్టార్ ఇక పిఠాపురం ఎమ్మెల్యేగా అమరావతి శాసనసభకు వెళ్లడమే మిగిలింది. తాజాగా వెల్లడైన ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి వంగా గీతపై పవన్ 50 వేల మెజార్టీతో ఘన విజయం సాధించారు.