News December 17, 2024

మిస్టరీ డ్రోన్ల గురించి మా సైన్యానికి తెలుసు: ట్రంప్

image

గత కొన్ని రోజులుగా అమెరికా గగనతలంలో రాత్రుళ్లు మిస్టరీ డ్రోన్లు కలకలం రేపుతున్నాయి. అధ్యక్ష ఎన్నికల విజేత ట్రంప్ తాజాగా వాటిపై స్పందించారు. ‘అసలేం జరుగుతోందో ప్రభుత్వానికి తెలుసు. మన సైన్యానికీ తెలుసు. కారణమేంటో తెలీదు గానీ ఆ విషయంపై వారు వివరణ ఇవ్వడం లేదు. అదేంటన్నది సస్పెన్స్‌లో పెట్టకుండా బయటికి చెప్పేస్తే బెటర్. ఒకవేళ అవి శత్రు డ్రోన్లైతే ఈపాటికే వాటిని పేల్చేసి ఉండేవారు’ అని పేర్కొన్నారు.1

News December 17, 2024

ఉత్తమ విద్య లభించే దేశాలివే!

image

వరల్డ్ రిపోర్ట్‌ను పరిగణనలోకి తీసుకొని 2024లో ఉత్తమ విద్యను అందిస్తోన్న దేశాల జాబితా రిలీజైంది. ప్రపంచవ్యాప్తంగా 17,000+ మంది అభిప్రాయాలను సేకరించి దీనిని రూపొందించారు. అనేక అంశాల్లో ప్రజలు తమ అవగాహన ప్రకారం దేశాలకు ర్యాంకులిచ్చారు. ప్రథమ స్థానంలో అమెరికా, రెండో స్థానంలో UK, మూడోస్థానంలో జర్మనీ ఉన్నాయి. ఆ తర్వాత కెనడా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జపాన్, ఆస్ట్రేలియా ఉండగా 42వ స్థానంలో ఇండియా ఉంది.

News December 17, 2024

జమిలి ఎన్నికలు అసాధ్యం.. విపక్షాల్లో విశ్వాసానికి కారణం ఇదే!

image

LSలో Tue జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్ సరళితో ఈ ప్రతిపాదన అమలు అసాధ్యమని విపక్షాలు అంటున్నాయి. ఎందుకంటే భ‌విష్య‌తులో బిల్లును ఆమోదించాలంటే హాజ‌రైన స‌భ్యుల్లో 2/3 బలం అవ‌స‌రం. అయితే Tue జ‌రిగిన ఓటింగ్‌లో 461 మంది స‌భ్యులు పాల్గొంటే, అనుకూలంగా 269 మంది మాత్రమే ఓటేశారు. ఈ లెక్కన 2/3 మెజారిటీ (307 మంది)కి ఇది చాలా తక్కువ. దీంతో బిల్లు ప్రవేశపెట్టడానికి ఆమోదం లభించినా, పాస్ అవ్వడం అసాధ్యం అంటున్నాయి.

News December 17, 2024

మెదడు పనితీరు, ఆరోగ్యాన్ని పెంచే ఫుడ్స్

image

ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల ద్వారా మెదడు పనితీరు, ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. తృణధాన్యాల ద్వారా మెదడు ఇతర శరీర అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. నట్స్&సీడ్స్‌లో విటమిన్-E అధికంగా ఉండి మెదడు సంబంధిత వ్యాధులతో వచ్చే మరణాలను తగ్గిస్తుంది. అవకాడో తింటే మెదడుకు రక్తప్రసరణ పెరుగుతుంది. డార్క్ చాక్లెట్ తింటే ఏకాగ్రత మెరుగవుతుంది. బ్లూ బెర్రీస్ వల్ల డిమెన్షియా లక్షణాలు తగ్గి అల్జీమర్స్ వ్యాధి ప్రమాదం తగ్గుతుంది.

News December 17, 2024

స్కూళ్లకు 2 రోజులు సెలవులు ఇస్తారా?

image

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి <<14906903>>అతిభారీ వర్షాలు<<>> కురుస్తాయని APSDMA హెచ్చరించింది. దీంతో విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు ఇవ్వాలని విద్యార్థుల పేరెంట్స్ కోరుతున్నారు. ముందుగానే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాల్లో స్థానిక పరిస్థితులను బట్టి కలెక్టర్లు సెలవులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

News December 17, 2024

ఏజెంట్ మోసం.. 22 ఏళ్లుగా పాకిస్థాన్‌లోనే!

image

దుబాయ్‌లో ఉద్యోగమిప్పిస్తానంటూ ఓ ఏజెంట్ మోసం చేసి పాకిస్థాన్‌లో వదిలేయడంతో హమీదా బానో అనే భారతీయురాలు 22 ఏళ్లుగా అక్కడే ఉన్నారు. ఓ యూట్యూబర్ ద్వారా విషయం వెలుగులోకి రావడంతో భారత్‌లోని ఆమె కుటుంబీకులు ప్రభుత్వానికి సమాచారమిచ్చారు. అధికారుల సహకారంతో తాజాగా వాఘా సరిహద్దు మీదుగా బానో ఎట్టకేలకు భారత్ చేరుకున్నారు. ఆమె స్వస్థలం ముంబై. భర్త చనిపోగా తన నలుగురు బిడ్డల్ని వంటపని చేస్తూ పోషించుకునేవారు.

News December 17, 2024

దృష్టి మ‌ర‌ల్చేందుకే జ‌మిలి ఎన్నిక‌లు: ఉద్ధ‌వ్‌

image

దేశాన్ని ప‌ట్టిపీడిస్తున్న స‌మ‌స్య‌ల నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చేందుకే కేంద్రం జ‌మిలి ఎన్నిక‌ల బిల్లు తెచ్చింద‌ని ఉద్ధ‌వ్ ఠాక్రే విమ‌ర్శించారు. జ‌మిలి ఎన్నిక‌ల ప్ర‌తిపాద‌న‌ల‌ను అమ‌లు చేసే ముందు దేశంలో పార‌ద‌ర్శ‌క ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను తీసుకురావాల‌ని డిమాండ్ చేశారు. మ‌రోవైపు నాగ్‌పూర్‌లో జ‌రుగుతున్న‌ MH అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా CM ఫ‌డణవీస్‌ను ఉద్ధ‌వ్ క‌ల‌వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

News December 17, 2024

ఆ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి కొత్త ప్రయత్నం?

image

మెగాస్టార్ చిరంజీవి సినిమా అనగానే సాంగ్స్, డాన్స్ గుర్తొస్తాయి. కానీ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కనున్న మూవీలో తొలిసారిగా ఆయన ఇవేవీ లేకుండా నటించనున్నారని సమాచారం. హీరో క్యారెక్టరైజేషన్ ఆధారంగా కథ నడుస్తుందని, కమర్షియల్ ఫార్మాట్‌కు పూర్తి దూరంగా ఉంటుందని తెలుస్తోంది. మూవీలో చిరు సరసన హీరోయిన్ పాత్ర కూడా లేదని టాలీవుడ్ వర్గాలంటున్నాయి. 2026లో ఈ మూవీ షూట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

News December 17, 2024

రేపు, ఎల్లుండి భారీ నుంచి అతిభారీ వర్షాలు: APSDMA

image

AP: అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజులు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. బుధవారం విజయనగరం, విశాఖ, అనకాపల్లిలో, గురువారం శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News December 17, 2024

తప్పు చేసినవారిని వదలం: మంత్రి నాదెండ్ల

image

AP: ప్రజలకు చేరాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. తప్పు చేసిన వారు చట్టం చేతుల్లోంచి తప్పించుకోలేరన్నారు. ‘పేర్ని నానికి చెందిన రెండో గౌడౌన్‌పైనా మాకు అనుమానం ఉంది. దాన్నీ తనిఖీ చేస్తాం. ఎవరిపైనా మేం కక్ష సాధింపు చర్యలకు పాల్పడట్లేదు. తప్పు చేశారని నిర్ధారించుకున్నాకే చర్యలు తీసుకుంటున్నాం’ అని మంత్రి వ్యాఖ్యానించారు.