India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ధర్మవరంలో ఫలితం తారుమారైంది. కౌంటింగ్ ఆరంభం నుంచి వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి లీడ్ కనబర్చడంతో YCP శ్రేణులు ఆయన గెలుపు పక్కా అనుకున్నారు. కానీ బత్తులపల్లి నుంచి ధర్మవరం టౌన్ వరకు గల బూత్ల ఓట్ల లెక్కింపుతో ఇది రివర్స్ అయింది. 19వ రౌండ్ ముగిసేసరికి BJP అభ్యర్థి సత్యకుమార్ 3300 ఓట్లకు పైగా మెజార్టీలో ఉన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఆయన్ను ఎన్డీఏ కన్వీనర్గా నియమించనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేంద్రంలో ఆ పార్టీకి సీట్లు తగ్గడంతో చంద్రబాబు మద్దతు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ, అమిత్ షా చంద్రబాబుకు ఫోన్లో చెప్పినట్లు తెలుస్తోంది.
AP: YSR జిల్లా కమలాపురంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. సీఎం జగన్ మేనమామ, వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి పుట్టా చైతన్య రెడ్డి విజయం సాధించారు. అటు మైదుకూరులోనూ వైసీపీ అభ్యర్థి రఘురాం రెడ్డిపై టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ 20,937 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
లైంగిక వేధింపుల కేసు నిందితుడు జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఓటమి దిశగా సాగుతున్నారు. కర్ణాటకలోని హసన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయనపై ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయస్ పటేల్ 43వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత ఆయన లీడింగ్లో కొనసాగగా ఇప్పుడు రెండోస్థానానికి పడిపోయారు.
మహారాష్ట్రలో శివసేనను చీల్చి అసలైన శివసేన గుర్తు పొందిన CM ఏకనాథ్ శిండే వర్గానికి 5 సీట్లొచ్చాయి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వ శివసేన 11 చోట్ల గెలుపు వైపు పయనిస్తోంది. ఇక NCPని విభజించి ఆ లోగో పొందిన అజిత్ పవార్ గ్రూపుకు ఒక్క సీటే దక్కగా శరద్ పవార్ NCP 6 చోట్ల ఆధిక్యంలో ఉంది. దీంతో చీల్చిన వర్గాలకు గుర్తులు తప్ప ఓట్లు మిగులలేదు. ఓటర్లంతా గుర్తుంచుకుంటారు అనేందుకు ఇదే ఉదాహరణ అని విశ్లేషకులు చెబుతున్నారు.
AP: రాయలసీమలోని అన్ని జిల్లాల్లో వైసీపీకి ఎదురుగాలి వీయగా.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి ఫ్యామిలీ మాత్రం సేఫ్ జోన్లో ఉంది. పుంగనూరు అసెంబ్లీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందంజలో ఉండగా.. ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లెలో లీడింగ్లో ఉన్నారు. ఇటు రాజంపేట లోక్సభ బరిలో నిలిచిన పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి 47,792 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
AP: అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ భారీ ఓటు షేర్ను సాధించింది. మధ్యాహ్నం 1.30కు అందిన సమాచారం ప్రకారం టీడీపీకి 45 శాతం, వైసీపీకి 39.43 శాతం, జనసేనకు 8.63 శాతం ఓట్లు వచ్చాయి. మొత్తంగా టీడీపీ 132, జనసేన 20, వైసీపీ 16, బీజేపీ ఏడు స్థానాల్లో గెలుపు దిశగా సాగుతున్నాయి.
TG: తెలంగాణలో BRS బోణీ కొట్టకపోవడంతో ఆపార్టీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కేంద్రంలో చక్రం తిప్పుతామనే గులాబీ పార్టీ ఆశలు అడియాశలయ్యాయి. ఇప్పటికే రాష్ట్రంలో అధికారం కోల్పోగా.. ఇప్పుడు ఎంపీ సీట్లు అయినా గెలిచి పార్టీలో నూతన ఉత్తేజం తీసుకొద్దామనుకున్నా మొండిచేయి ఎదురైంది. మరి పార్టీ పునరుత్తేజం కోసం కేసీఆర్ ఎలాంటి అడుగులు వేస్తారో వేచి చూడాలి.
రాజస్థాన్లో బీజేపీ ఖాతా తెరిచింది. జైపూర్లో ఆ పార్టీ అభ్యర్థి మంజు శర్మ భారీ మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ సింగ్పై ఆమె 3,31,767 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించినట్లు ఈసీ ప్రకటించింది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘురామకృష్ణరాజు విజయం సాధించారు. 56,777 ఓట్ల భారీ మెజారిటీతో విజయదుందుభి మోగించారు. అక్కడ వైసీపీ అభ్యర్థి వెంకట లక్ష్మి నరసింహరాజుకు 60,125 ఓట్లు రాగా, RRRకు 1,16,902 ఓట్లు పోలయ్యాయి.
Sorry, no posts matched your criteria.