India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లాస్ ఏంజెలిస్లో ఏర్పడిన కార్చిచ్చును ఆర్పడం ఎవరివల్లా కావడం లేదు. ఇంతింతగా పెరుగుతున్న మంటల నుంచి ప్రజలను రక్షించేందుకు అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే, ఈ కార్చిచ్చు ‘ఆస్కార్’ను తాకేలా కనిపిస్తోంది. దీనివల్ల ‘ఆస్కార్-2025’ ఈవెంట్ రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే నామినేషన్స్ ప్రకటన కూడా వాయిదా పడింది. ఒకవేళ రద్దయితే 96 ఏళ్లలో ఇదే తొలిసారి కానుంది.
తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్ రేణుక, జస్టిస్ నందికొండ నర్సింగ్ రావు, జస్టిస్ తిరుమల దేవి, జస్టిస్ మధుసూదన్ రావు పేర్లను ప్రతిపాదించింది. కాగా నిన్న హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్ నియమితులైన విషయం తెలిసిందే. అటు ఏపీ హైకోర్టుకు అవధానం హరిహరనాథ శర్మ, యడవల్లి లక్ష్మణరావు పేర్లను కొలీజియం రిఫర్ చేసింది.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను సూపర్ స్టార్ మహేశ్ బాబు వీక్షించినట్లు ట్వీట్ చేశారు. ‘సినిమా చూస్తూ ఎంతో ఎంజాయ్ చేశాం. ఇది పర్ఫెక్ట్ ఫెస్టివల్ ఫిల్మ్. వెంకటేశ్ అదరగొట్టారు. నా డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస బ్లాక్ బస్టర్లు కొట్టడం గర్వంగా ఉంది. హీరోయిన్లు ఐశ్వర్య, మీనాక్షి చౌదరి నటన అదుర్స్. బుల్లి రాజు క్యారెక్టర్ అదిరిపోయింది. చిత్రయూనిట్కు అభినందనలు’ అని మహేశ్ ట్వీట్ చేశారు.
జీవితంలో ఏం చేయాలో తోచని వాళ్లకు.. అన్నీ ఉన్నా ఏదో వెలితితో ఉండేవారికి.. ప్రతిదానికి ఆరాటపడి చివరికి సాధించలేక బాధపడే వారి కోసం Managing Happiness అనే Online కోర్సును హార్వర్డ్ యూనివర్సిటీ ప్రవేశపెట్టింది. *ఆనందంగా ఉండడం వెనుక ఉన్న సైన్స్ *ఆనందం నిర్వచనం-దాని ప్రాముఖ్యత. *జీన్స్, సామాజిక-ఆర్థిక అంశాలు చూపే ప్రభావం వంటి అంశాలపై చర్చిస్తారు. ఫీజు ₹18,199. అవసరమైన వారికి Share It.
AP: సంక్రాంతి వేళ పల్నాడు(D) అచ్చంపేట(M) చామర్రులో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఒకే రోజు చనిపోయారు. గౌతుకట్ల కోటయ్య అనే వృద్ధుడు(80) అనారోగ్యంతో మృతి చెందగా కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. తర్వాత అతని కొడుకు గౌతుకట్ల నాగేశ్వరరావు, బావమరిది తెల్లమేకల నాగేశ్వరరావు మద్యం తాగారు. వెంటనే విరేచనాలు, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించే లోపే మరణించారు.
వచ్చే నెల నుంచి తెలంగాణలో వైన్స్లు, బార్లలో KF బీర్లు లభించకపోవచ్చు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదంటూ ఆ బ్రాండ్ బీర్లు తయారుచేసే యునైటెడ్ బ్రూవరీ(UB) సంస్థ మద్యం సరఫరా నిలిపివేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న స్టాక్ ఈనెలాఖరు వరకే వస్తుందని దుకాణదారులు చెబుతున్నారు. ఆ తర్వాత వైన్స్ వద్ద కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులో ఉండవు. మరోవైపు లిక్కర్ సరఫరాపై UB కంపెనీతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.
TG: ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ రేపు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఉ.10.30 గంటలకు కేటీఆర్ హైదరాబాద్లోని ఈడీ ఆఫీస్కు వెళ్లనున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని అధికారులు విచారించారు. మరోవైపు తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలన్న కేటీఆర్ పిటిషన్ను ఇవాళ సుప్రీం తోసిపుచ్చింది. దీంతో ఆయన పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు.
‘దేశంలో పేదలకు సరైన నివాస వసతి లేదు. మురికివాడల్లో నివసిస్తున్నారు. విద్యా, ఆరోగ్య సేవల కొరత ఉంది. ప్రభుత్వాలు వీటి కోసం నిధులు ఖర్చు చేయాలా? లేక సైకిల్ ట్రాక్ల కోసమా?’ అని SC ప్రశ్నించింది. దేశంలో సైకిల్ ట్రాక్ల ఏర్పాటుకు ఆదేశాలివ్వాలన్న పిటిషన్ విచారణలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ కాలుష్యం వంటి కారణాలు వివరించగా, ఇలాంటి ఆదేశాలు తామెలా ఇస్తామని SC ప్రశ్నించింది.
ఐర్లాండ్తో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు అద్భుత విజయం సాధించింది. 436 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఐరిష్ జట్టును 131 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో 304 రన్స్ తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. వన్డేల్లో భారత్కు ఇదే అతిపెద్ద విజయం. ఇండియా బౌలర్లలో దీప్తి 3, తనూజ 2, సాధు, సయాలి, మిన్నూ తలో వికెట్ పడగొట్టారు. మూడు వన్డేల సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేసింది.
మహా కుంభమేళాకు వచ్చిన స్పెషల్ బాబాలు ఆకట్టుకుంటున్నారు. అందులో ఐఐటియన్ బాబా, 14 ఏళ్లుగా ఒక చేయిని పైకి ఎత్తి అలాగే ఉంచేసిన రాధే పురీ బాబా, పురాతన కారులో వచ్చిన అంబాసిడర్ బాబా, తలపై వరి, మిల్లెట్ మొక్కలు పెంచే అనాజ్ వాలే బాబా, చాయ్ వాలే బాబా, 32 ఏళ్లుగా స్నానం ఆచరించని 3.8 ఫీట్ బాబా, తలపై 2 లక్షల రుద్రాక్షలు ధరించిన గీతానంద గిరి బాబా, తలపై పావురం కలిగి ఉన్న మహంత్ రాజ్పురీ జీ మహారాజ్ ఉన్నారు.
Sorry, no posts matched your criteria.