News June 4, 2024

2 చోట్ల పోటీ.. కేఏ పాల్‌కు ఎన్ని ఓట్లంటే?

image

AP: ‘పాల్ రావాలి-పాలన మారాలి’ అనే నినాదంతో ప్రచారం చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ను ఓటర్లు పట్టించుకోలేదు. కుండ గుర్తుకు ఓటేయాలని 2 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఆయనకు ఆశించిన ఓట్లు పడలేదు. గాజువాక MLA అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు ఇప్పటివరకు 394 ఓట్లు రాగా, విశాఖ MP అభ్యర్థిగా నిలిచిన పాల్‌కు 1190 ఓట్లు లభించాయి. దీంతో పాల్ కుండ పగిలిందని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

News June 4, 2024

దర్శిలో ఆధిక్యంలోకి వచ్చిన టీడీపీ అభ్యర్థి

image

AP: దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీ ఆధిక్యంలోకి వచ్చారు. 75 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో ఆమె ఉన్నారు. వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వెనుకంజలో కొనసాగుతున్నారు. కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుమాటి కావ్య కృష్ణారెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి ప్రతాప్ కుమార్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు.

News June 4, 2024

పురందీశ్వరికి లక్ష దాటిన మెజార్టీ

image

AP: రాజమండ్రి ఎంపీ స్థానంలో పురందీశ్వరి లక్ష ఓట్ల మెజార్టీని దాటారు. ప్రస్తుతం 1,15,566 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అనకాపల్లిలో సీఎం రమేశ్(BJP) 32 వేలు, నర్సాపురంలో శ్రీనివాసవర్మ(BJP) 58 వేల ఓట్ల లీడింగులో ఉన్నారు. ఇక కాకినాడలో జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్‌కు 32,241, మచిలీపట్నంలో బాలశౌరి(జనసేన) 25,364 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు.

News June 4, 2024

శశిథరూర్‌ వెనుకంజ

image

కాంగ్రెస్ సీనియర్ నేత, సిట్టింగ్ ఎంపీ శశిథరూర్ తిరువనంతపురంలో విజయం కోసం చెమటోడుస్తున్నారు. ఆయనపై కేంద్రమంత్రి, బీజేపీ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ 4,948 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తిరువనంతపురంలో శశిథరూర్ మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఆయన 99,989 ఓట్లతో ఘన విజయం సాధించారు.

News June 4, 2024

ఉత్తరాంధ్రలో కూటమి సునామీ

image

ఉత్తరాంధ్రలో NDA కూటమి దూసుకెళ్తోంది. మొత్తం 34 అసెంబ్లీ స్థానాలకుగాను 30 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కేవలం నాలుగు స్థానాల్లోనే వైసీపీ ఆధిక్యంలో ఉంది. 2019 ఎన్నికల్లో 34 స్థానాలకుగాను 28 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ.. ఈసారి ఘోరంగా వెనుకబడింది. కేవలం పాడేరు, అరకు, సాలూరు, పాలకొండలో మాత్రమే వైసీపీ ఆధిక్యంలో ఉంది. అటు MP స్థానాల్లో అరకులో మాత్రమే YCP ఆధిక్యంలో ఉంది.

News June 4, 2024

కరీంనగర్‌, నిజామాబాద్‌లో దూసుకెళ్తున్న బీజేపీ

image

కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ దూసుకెళ్తున్నారు. 6వ రౌండ్ ముగిసే సమయానికి 76వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక నిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 5వ రౌండ్ ముగిసే సమయానికి 55వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు వెనుకంజలో ఉన్నాయి.

News June 4, 2024

మహారాష్ట్రలో ఇండియా కూటమి ఆధిక్యం.. నవనీత్ రానా వెనుకంజ

image

మహారాష్ట్రలో ఇండియా కూటమి అనూహ్యంగా ఆధిక్యంలోకి వచ్చింది. 26 సీట్లలో లీడింగ్‌లో కొనసాగుతోంది. ఎన్డీయే 21 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో పోరు హోరాహోరీగా సాగుతోంది. సుప్రియా సూలే(NCP SP), నితిన్ గడ్కరీ (బీజేపీ) ఆధిక్యంలో ఉండగా, నవనీత్ రానా (బీజేపీ) వెనుకంజలో ఉన్నారు.

News June 4, 2024

బర్రెలక్క కంటే నోటాకే ఎక్కువ ఓట్లు!

image

నాగర్‌కర్నూల్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్కకు ఉ.11గంటల వరకు 1032 ఓట్లు వచ్చాయి. అదే సమయానికి నోటాకు 1500 ఓట్లు పడ్డాయి. అంటే ఆమె కంటే ఎక్కువ ఓట్లు నోటాకే పడ్డాయి.

News June 4, 2024

అఖిలేశ్ యాదవ్ ముందంజ

image

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ముందంజలో కొనసాగుతున్నారు. ఉత్తరప్రదేశ్ కన్నౌజ్ స్థానం నుంచి బరిలో ఉన్న ఆయన బీజేపీ అభ్యర్థి సుబ్రత్‌పై 40వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఉన్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కీలకంగా భావించే ఈ రాష్ట్రంలో బీజేపీ, INDIA కూటమి మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. కాగా UPలో SP 62, కాంగ్రెస్ 17 స్థానాల్లో బరిలో దిగింది.

News June 4, 2024

ఖమ్మం, నల్గొండలో గెలుపు దిశగా కాంగ్రెస్

image

ఖమ్మం, నల్గొండలో కాంగ్రెస్ జోరు సాగుతోంది. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి 12వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సరికి లక్షా 86ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి 6వ రౌండ్ ముగిసే సమయానికి లక్షా 70వేల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో వీరిద్దరు గెలవడం ఖాయంగా కనిపిస్తోంది.