India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్యపై దాదాపు 40000+ పైగా మెజార్టీతో పెమ్మసాని ఆధిక్యంలో ఉన్నారు. కౌంటింగ్ ముగిసే సరికి పెమ్మసాని మెజార్టీ లక్షల్లో ఉంటుందని టీడీపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.
లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీని యూపీ దెబ్బకొట్టేలా ఉంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం ఇక్కడ సగం వరకు సీట్లు కోల్పోవచ్చు! అయితే ఆ నష్టాన్ని మధ్యప్రదేశ్ భర్తీచేసేలా కనిపిస్తోంది. మొత్తం 29 నియోజకవర్గాల్లో అన్నింట్లోనూ బీజేపీ హవా కొనసాగుతోంది. శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాధిత్య సింధియా, శంకర్ లాల్వానీ, బంటీ వివేక్ సాహూ, అలోక్ శర్మ దూసుకెళ్తున్నారు. చింద్వాడలో నకుల్ కమల్నాథ్ వెనుకంజలో ఉన్నారు.
AP: ఎన్నికల కౌంటింగులో రాయలసీమ జిల్లాల్లో కూటమి భారీ విజయం దిశగా సాగుతోంది. మొత్తం 52 స్థానాలకు గాను ప్రస్తుతం 45 చోట్ల కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. కేవలం 7 స్థానాల్లోనే వైసీపీ నేతలు లీడింగులో ఉన్నారు.
ఏపీలోని దాదాపు అన్ని జిల్లాల్లో కూటమి దూసుకెళ్తోంది. ఒక్క కడప మినహా అన్ని జిల్లాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అధిక్యంలో కొనసాగుతున్నాయి. సీఎం జగన్ సొంత జిల్లా కడపలోనూ కూటమి గట్టి పోటీ ఇస్తోంది. టీడీపీ బలహీనంగా ఉన్న రాయలసీమ, దక్షిణ కోస్తాలోనూ సైకిల్ దూసుకెళ్తోంది.
ఖమ్మంలో కాంగ్రెస్ జెండా ఎగురుతోంది. ఆ పార్టీ అభ్యర్థి రఘురాంరెడ్డి ఆరో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి లక్షా 26వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో కాంగ్రెస్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే నామా నాగేశ్వర్రావు కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.
AP: గుంటూరు(D) మంగళగిరిలో TDP అభ్యర్థి నారా లోకేశ్ రికార్డు సృష్టించనున్నారు. ఎన్నికల కౌంటింగ్లో 15 వేలకు పైగా మెజార్టీలో కొనసాగుతూ గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. దశాబ్దాలుగా ఇక్కడ టీడీపీ జెండా ఎగురలేదు. 15 సార్లు ఎన్నికలు జరిగితే ఇక్కడ టీడీపీ గెలిచింది రెండు సార్లే. చివరిసారిగా 1985లో ఇక్కడ గెలిచింది. నారా లోకేశ్ గెలుపుతో టీడీపీకి కొరకరాని కొయ్యగా ఉన్న ఈ నియోజకవర్గం ఆ పార్టీ ఖాతాలో చేరనుంది.
AP: పెనమలూరులో మంత్రి జోగి రమేశ్ లీడింగ్లో ఉన్నారు. తన ప్రత్యర్థి బోడె ప్రసాద్పై 275 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇటు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు(SC)లో టీడీపీ అభ్యర్థి బూర్ల రామంజనేయులు 2,758 ఓట్ల లీడింగ్లో ఉన్నారు.
AP: SKLM జిల్లాలో ధర్మాన సోదరులకు షాక్ తగిలింది. SKLM అసెంబ్లీ అభ్యర్థిగా YCP తరఫున బరిలో దిగిన మంత్రి ధర్మాన ప్రసాదరావుపై.. TDP అభ్యర్థి గొండు శంకర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నరసన్నపేట నుంచి బరిలో దిగిన YCP అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్పై TDP అభ్యర్థి బగ్గు రమణమూర్తి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జిల్లాలో కూటమి అభ్యర్థుల జోరు కొనసాగుతోంది. మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
నల్గొండలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ఆ పార్టీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి 53వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ వరుసగా మూడు సార్లు గెలుపొందింది.
AP: అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి 99 ఓట్ల లీడింగులో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి వెనుకంజలో ఉన్నారు. కళ్యాణదుర్గంలో టీడీపీ నేత అమిలినేని సురేంద్రబాబు 3,030 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ ఎంపీ తలారి రంగయ్య వెనుకబడ్డారు. జమ్మలమడుగులో 312 ఓట్ల లీడింగులో వైసీపీ నేత సుధీర్ రెడ్డి ఉన్నారు.
Sorry, no posts matched your criteria.